Rajanna Sircilla: రేపు వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..
- రేపు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన..
- వేములవాడ రాజన్నను దర్శించుకుని రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు..
- వేములవాడ ఆలయ, పట్టణ అభివృద్ధి పనులకు రూ. 127.65 కోట్లు మంజూరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajanna Sircilla: రేపు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. వేములవాడ రాజన్నను దర్శించుకుని రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేయనున్నారు. వేములవాడ ఆలయ, పట్టణ అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 127.65 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆలయ విస్తరణ అభివృద్ధితో పాటు పట్టణంలో రోడ్డు వెడల్పు, జిల్లా ఎస్పీ కార్యాలయం, యా రన్ డిపో తో పలు అభివృద్ది పనులకు వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి రేపు శంకుస్థాపనలు చేయనున్నారు. తదనంతరం ఆలయ గుడి చెరువు మైదానంలో బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఇప్పటికే రాజన్న గుడి చెరువు మైదానంలో భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యవేక్షిస్తున్నారు.
Read also: Warangal: వరంగల్ కు సర్కార్ వరాల జల్లు… పూర్తిగా మారనున్న రూపురేఖలు..
Also Read
- KTR : జీవో 97పై కేటీఆర్ ఫైర్.. విద్యార్థులకు కీలక హామీ
- Sircilla Paddy Scam : ప్రభుత్వ ధాన్యానికి టోకరా.. నకిలీ రికార్డులతో రూ.91 లక్షలు లూటీ..!
- Rajanna Sircilla: పానీపూరి ఫుడ్ పాయిజన్ కలకలం.. 10 మందికి పైగా చిన్నారులకు అస్వస్థత.!
- Vemulawada Rajanna Temple : వేములవాడ రాజన్న ఆలయ పునర్నిర్మాణం.. శరవేగంగా అభివృద్ధి పనులు..
రాష్ట్ర ప్రభుత్వం రూ. 76 కోట్లు కేటాయించారు. ఆలయ ప్రాంగణం విస్తరణ, భక్తులకు అవసరమైన ఆధునిక సౌకర్యాల ఏర్పాటుకు ఈ నిధులను వినియోగించనున్నారు. అలాగే వేములవాడ దేవాలయం నుంచి ములవాగు వంతెన వరకు రోడ్లను విస్తరించేందుకు రూ. 47.85 కోట్లు, మూలవాగు బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు కొత్త డ్రైనేజీ నిర్మాణానికి రూ. 3.8 కోట్ల నిధులు మంజూరయ్యాయి. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం 127 కోట్లు మంజూరు చేయడంతో వేములవాడ పట్టణ ప్రజలు, వేములవాడ రాజన్న భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిధుల మంజూరులో ప్రత్యేకంగా కృషి చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 20న సీఎం వేములవాడ రాక నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా పోలీసు అధికారులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మిడ్ మానేరు రిజర్వాయర్లో ఆచరణాత్మకంగా నష్టపోయిన బాధితులకు డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేస్తున్నట్లు సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
Warangal Police: నేడు వరంగల్లో సీఎం పర్యటన.. నిరసనకారులపై పోలీసుల ప్రత్యేక నిఘా..
తాజావార్తలు
-
Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వెళ్తున్నారా? ఈ ట్రాఫిక్ రూట్లు మర్చిపోకండి
-
Sergio Gor: మణిపూర్లో సెర్గియో గోర్ పర్యటన.. గవర్నర్, సీఎంతో భేటీ!
-
Rain Alert: బ్రిక్స్ సదస్సు వేళ ఢిల్లీకి భారీ వర్ష సూచన
-
Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
-
New Excise Policy: 2026-27 ఎక్సైజ్ పాలసీ.. ఏడాది పాటు లైసెన్సులు రెన్యువల్..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?