Rajanna Sircilla: రేపు వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..
- రేపు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన..
- వేములవాడ రాజన్నను దర్శించుకుని రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు..
- వేములవాడ ఆలయ, పట్టణ అభివృద్ధి పనులకు రూ. 127.65 కోట్లు మంజూరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajanna Sircilla: రేపు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. వేములవాడ రాజన్నను దర్శించుకుని రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేయనున్నారు. వేములవాడ ఆలయ, పట్టణ అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 127.65 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆలయ విస్తరణ అభివృద్ధితో పాటు పట్టణంలో రోడ్డు వెడల్పు, జిల్లా ఎస్పీ కార్యాలయం, యా రన్ డిపో తో పలు అభివృద్ది పనులకు వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి రేపు శంకుస్థాపనలు చేయనున్నారు. తదనంతరం ఆలయ గుడి చెరువు మైదానంలో బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఇప్పటికే రాజన్న గుడి చెరువు మైదానంలో భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యవేక్షిస్తున్నారు.
Read also: Warangal: వరంగల్ కు సర్కార్ వరాల జల్లు… పూర్తిగా మారనున్న రూపురేఖలు..
Also Read
- Sircilla Paddy Scam : ప్రభుత్వ ధాన్యానికి టోకరా.. నకిలీ రికార్డులతో రూ.91 లక్షలు లూటీ..!
- Rajanna Sircilla: పానీపూరి ఫుడ్ పాయిజన్ కలకలం.. 10 మందికి పైగా చిన్నారులకు అస్వస్థత.!
- Vemulawada Rajanna Temple : వేములవాడ రాజన్న ఆలయ పునర్నిర్మాణం.. శరవేగంగా అభివృద్ధి పనులు..
- S*uicide: తండ్రి దినకర్మ రోజే తనయుడు ఆత్మహత్య.!
రాష్ట్ర ప్రభుత్వం రూ. 76 కోట్లు కేటాయించారు. ఆలయ ప్రాంగణం విస్తరణ, భక్తులకు అవసరమైన ఆధునిక సౌకర్యాల ఏర్పాటుకు ఈ నిధులను వినియోగించనున్నారు. అలాగే వేములవాడ దేవాలయం నుంచి ములవాగు వంతెన వరకు రోడ్లను విస్తరించేందుకు రూ. 47.85 కోట్లు, మూలవాగు బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు కొత్త డ్రైనేజీ నిర్మాణానికి రూ. 3.8 కోట్ల నిధులు మంజూరయ్యాయి. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం 127 కోట్లు మంజూరు చేయడంతో వేములవాడ పట్టణ ప్రజలు, వేములవాడ రాజన్న భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిధుల మంజూరులో ప్రత్యేకంగా కృషి చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 20న సీఎం వేములవాడ రాక నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా పోలీసు అధికారులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మిడ్ మానేరు రిజర్వాయర్లో ఆచరణాత్మకంగా నష్టపోయిన బాధితులకు డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేస్తున్నట్లు సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
Warangal Police: నేడు వరంగల్లో సీఎం పర్యటన.. నిరసనకారులపై పోలీసుల ప్రత్యేక నిఘా..
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!