Rajanna Sircilla: రేపు వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..
- రేపు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన..
- వేములవాడ రాజన్నను దర్శించుకుని రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు..
- వేములవాడ ఆలయ, పట్టణ అభివృద్ధి పనులకు రూ. 127.65 కోట్లు మంజూరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajanna Sircilla: రేపు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. వేములవాడ రాజన్నను దర్శించుకుని రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేయనున్నారు. వేములవాడ ఆలయ, పట్టణ అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 127.65 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆలయ విస్తరణ అభివృద్ధితో పాటు పట్టణంలో రోడ్డు వెడల్పు, జిల్లా ఎస్పీ కార్యాలయం, యా రన్ డిపో తో పలు అభివృద్ది పనులకు వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి రేపు శంకుస్థాపనలు చేయనున్నారు. తదనంతరం ఆలయ గుడి చెరువు మైదానంలో బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఇప్పటికే రాజన్న గుడి చెరువు మైదానంలో భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యవేక్షిస్తున్నారు.
Read also: Warangal: వరంగల్ కు సర్కార్ వరాల జల్లు… పూర్తిగా మారనున్న రూపురేఖలు..
Also Read
- Sircilla Paddy Scam : ప్రభుత్వ ధాన్యానికి టోకరా.. నకిలీ రికార్డులతో రూ.91 లక్షలు లూటీ..!
- Rajanna Sircilla: పానీపూరి ఫుడ్ పాయిజన్ కలకలం.. 10 మందికి పైగా చిన్నారులకు అస్వస్థత.!
- Vemulawada Rajanna Temple : వేములవాడ రాజన్న ఆలయ పునర్నిర్మాణం.. శరవేగంగా అభివృద్ధి పనులు..
- S*uicide: తండ్రి దినకర్మ రోజే తనయుడు ఆత్మహత్య.!
రాష్ట్ర ప్రభుత్వం రూ. 76 కోట్లు కేటాయించారు. ఆలయ ప్రాంగణం విస్తరణ, భక్తులకు అవసరమైన ఆధునిక సౌకర్యాల ఏర్పాటుకు ఈ నిధులను వినియోగించనున్నారు. అలాగే వేములవాడ దేవాలయం నుంచి ములవాగు వంతెన వరకు రోడ్లను విస్తరించేందుకు రూ. 47.85 కోట్లు, మూలవాగు బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు కొత్త డ్రైనేజీ నిర్మాణానికి రూ. 3.8 కోట్ల నిధులు మంజూరయ్యాయి. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం 127 కోట్లు మంజూరు చేయడంతో వేములవాడ పట్టణ ప్రజలు, వేములవాడ రాజన్న భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిధుల మంజూరులో ప్రత్యేకంగా కృషి చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 20న సీఎం వేములవాడ రాక నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా పోలీసు అధికారులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మిడ్ మానేరు రిజర్వాయర్లో ఆచరణాత్మకంగా నష్టపోయిన బాధితులకు డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేస్తున్నట్లు సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
Warangal Police: నేడు వరంగల్లో సీఎం పర్యటన.. నిరసనకారులపై పోలీసుల ప్రత్యేక నిఘా..
తాజావార్తలు
-
SIR Survey : మాది ఏ రాష్ట్రమో తేల్చండి.. తెలంగాణలోని ఆ గ్రామాల్లో ‘సర్’ ప్రక్రియకు బ్రేక్..
-
Chanakya Niti: జీవితంలో గెలవాలంటే ‘చాణక్యుడి’ ఈ ఒక్క సూత్రం చాలు.. శత్రువులను కూడా ఈజీగా బురిడీ కొట్టించవచ్చు!
-
China-Pakistan: పాకిస్తాన్తో సంబంధాలకే చైనా ప్రాధాన్యం: జిన్పింగ్.
-
Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
-
Kishan Reddy vs Asaduddin Owaisi: అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్.. ప్రజలను తప్పుదారి పట్టించొద్దు..!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!