Telangana Cabinet: సీఎం రేవంత్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటి.. కీలక అంశాలు ఇవే..
- ఈరోజు సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్ లో తెలంగాణ క్యాబినెట్ సమావేశం..
- కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Cabinet: ఈరోజు ఉదయం 11.30 కు సచివాలయంలో హౌసింగ్ డిపార్ట్మెంట్పై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్ లో తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. హైడ్రాకి చట్ట బద్దత ద్వారా ఆర్డినెన్సు తీసుకురావడం?, మూడు యూనివర్సిటీలకు పేర్లు ఖరారు చేయడం, భారీ వర్షాలు- వరదల కారణంగా జరిగిన నష్టం, రేషన్ కార్డులు జారీ, హెల్త్ కార్డులు మంజూరు?, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు, త్రిబుల్ ఆర్ భూసేకరణ, పనుల ప్రారంభం, ఎస్ఎల్బిసి పనులు – నిధుల విడుదల, ఉద్యోగుల డీఏలు – సమస్యలు తదితర అంశాలపై చర్చించనున్నారు.
Read also: Jani Master Wife: ఆ అమ్మాయి నిజం నిరూపిస్తే.. నా భర్తను వదిలేస్తా!
Also Read
- CM Revanth Reddy : ఖేలో ఇండియా గేమ్స్కు తెలంగాణ రెడీ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
- Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
- 22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
- Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
హైడ్రాకు అందించే ప్రతిపాదనలపై మంత్రివర్గం నిర్ణయం..
రెవెన్యూ, పురపాలక, నీటిపారుదల శాఖలు అనుభవిస్తున్న కొన్ని ప్రత్యేక అధికారాలను హైడ్రాకు అందించే ప్రతిపాదనలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. తక్షణమే ఆర్డినెన్స్ రూపంలో ఉత్తర్వులు జారీ చేయడం, హైడ్రాకు చట్టబద్ధత, ప్రత్యేక అధికారాలు కల్పించే అవకాశం ఉంది. ORR పరిదిలో చెరువులు, కాలువల పరిరక్షణ కోసం రెవెన్యూ, పురపాలక మరియు నీటిపారుదల శాఖ చట్టాల ప్రకారం హైడ్రాకు కీలక అధికారాలు అప్పగించబడతాయి. చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసేందుకు, కూల్చివేతలకు అవసరమైన అధికారాలను హైడ్రా పొందుతుంది. శీతాకాల శాసనసభ సమావేశాల్లో హైడ్రా చట్టం బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవలి భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై మంత్రివర్గం చర్చించనుంది. వరద బాధితులకు పరిహారం, దెబ్బతిన్న పంటలు, రోడ్లు, చెరువుల మరమ్మతులు, సాగునీటి ప్రాజెక్టులు తదితర అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు.
Read also: Jani Master Wife: ఆ అమ్మాయి నిజం నిరూపిస్తే.. నా భర్తను వదిలేస్తా!
వరదల కారణంగా రాష్ట్రానికి రూ.10,300 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేసిన ప్రభుత్వం కేంద్ర సాయం కోసం ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది. కేంద్రం నుంచి సాయం అందే అంశంపై కూడా చర్చించనున్నారు. రాష్ట్రంలోని మూడు యూనివర్సిటీలకు కొత్త పేర్లను పెట్టేందుకు ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలను మంత్రివర్గం ఆమోదించనుంది. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్రెడ్డి తెలుగు యూనివర్సిటీగా, కోఠి మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీగా, హ్యాండ్లూమ్ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీగా కొత్త పేర్లను పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే..
Family Suicide: ఇంట్లోనే ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య..?
తాజావార్తలు
-
Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
-
Srinu Vaitla : జార్జ్క్రిష్తో కంబ్యాక్ ఇచ్చేందుకు శ్రీనువైట్ల భారీ స్కెచ్
-
Mallika Sherawat: ‘టామ్ క్రూజ్కు నాపై క్రష్’.. వీడియో కూడా ఉంది.. 49 ఏళ్ల మల్లికా కామెంట్స్ వైరల్
-
Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
-
Mecca Pact Explained: పాకిస్థాన్ పాచికలు చెల్లవు.. మక్కా ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!