SI Passing Out Parade: పోలీస్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్కు సీఎం రేవంత్..
- హైదరాబాద్: పోలీస్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్కు సీఎం రేవంత్..
- అనంతరం అకాడమీలో క్రీడాభవన్ ప్రారంభోత్సవం..
- మధ్యాహ్నం 3 గంటలకు జీహెచ్ఎంసీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SI Passing Out Parade: తెలంగాణ హోంశాఖలో త్వరలో కొత్తగా మరో 547 మంది ఎస్ఐలు చేరబోతున్నారు. సివిల్, ఏఆర్, తెలంగాణ స్పెషల్ పోలీస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్, ఫింగర్ ప్రింట్ బ్యూరో, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో వీరికి ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వనుంది. వీరందరూ తాజాగా రాజా బహద్దూర్ వెంకట్రామారెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో 9 నెలల పాటు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. రాష్ట్ర హోంశాఖ పరిధిలోని ఆయా విభాగాల్లో వీరికి విధులు అప్పగించేందుకు ఉన్నతాధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు ఈరోజు ( బుధవారం) పాసింగ్ అవుట్ పరేడ్ (పీవోపీ) నిర్వహించబోతున్నట్లు అకాడమీ డైరెక్టర్ అభిలాష బిష్త్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
Read Also: Rahul Gandhi : అమెరికాలో పాకిస్థాన్, బంగ్లాదేశ్ గురించి కీలక వ్యాఖ్యలు చేసిన రాహుల్
Also Read
- Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు కొత్త రూల్స్.. స్లాబ్ పెద్దదైతే డబ్బులు కట్.!
- KTR: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు, గులాబీ జెండా ఎగరడం ఖాయం
- Hyderabad: పరారీలో "గోల్డ్ మ్యాన్" .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
- Donald Trump: "ఆ గౌరవం దక్కించుకున్న ఏకైక యూఎస్ ప్రెసిడెంట్ నేనే".. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ట్రంప్ ఫిదా!
కాగా, తెలంగాణ పోలీస్ అకాడమీలో సబ్ ఇన్స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్.. పాసింగ్ అవుట్ పరేడ్ కు ముఖ్య అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. కాగా, మొత్తం 547 మంది ఎస్సైలు ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. వీరిలో 145 మంది మహిళా ఎస్ఐలు, 402 మంది పురుషులు ఉన్నారు. 547లో 401 మంది సివిల్ ఎస్ఐలు ఉండగా.. 547లో 472 మంది గ్రాడ్యూయేట్స్ 75 మంది పోస్ట్ గ్రాడ్యూయేట్స్ ఉన్నారు. వీరిలో 248 మంది ఎస్ఐలకు బీటెక్ బ్యాక్ గ్రౌండ్ ఉంది. పరేడ్ కమాండర్ గా మహిళా ఎస్ఐ పల్లి భాగ్యశ్రీ ఉండనున్నారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారిలో అత్యధికంగా 26 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వయసు గల అభ్యర్థులు ఉన్నారు. 283 మంది 26 నుంచి 30 సంవత్సరాల వయసు కలవారు.. 182 మంది 25 ఏళ్ళ లోపు వయసున్న వారు ఉన్నారు. ఈ పరేడ్ తర్వాత పోలీస్ అకాడమీలో క్రీడా భవన్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ)పై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
తాజావార్తలు
-
Nellore: కోడూరు బీచ్లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
-
Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు కొత్త రూల్స్.. స్లాబ్ పెద్దదైతే డబ్బులు కట్.!
-
Supreme Court: నెహ్రూ నుంచి మోడీ పాలన దాకా పెండింగ్లో ఉన్న భూ-కేసు పరిష్కారం.. మిస్టరీ ఏంటంటే..!
-
Varanasi : జక్కన్న ఇలా షాకిచ్చాడేంటి?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!