SI Passing Out Parade: పోలీస్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్కు సీఎం రేవంత్..
- హైదరాబాద్: పోలీస్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్కు సీఎం రేవంత్..
- అనంతరం అకాడమీలో క్రీడాభవన్ ప్రారంభోత్సవం..
- మధ్యాహ్నం 3 గంటలకు జీహెచ్ఎంసీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..
SI Passing Out Parade: తెలంగాణ హోంశాఖలో త్వరలో కొత్తగా మరో 547 మంది ఎస్ఐలు చేరబోతున్నారు. సివిల్, ఏఆర్, తెలంగాణ స్పెషల్ పోలీస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్, ఫింగర్ ప్రింట్ బ్యూరో, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో వీరికి ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వనుంది. వీరందరూ తాజాగా రాజా బహద్దూర్ వెంకట్రామారెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో 9 నెలల పాటు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. రాష్ట్ర హోంశాఖ పరిధిలోని ఆయా విభాగాల్లో వీరికి విధులు అప్పగించేందుకు ఉన్నతాధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు ఈరోజు ( బుధవారం) పాసింగ్ అవుట్ పరేడ్ (పీవోపీ) నిర్వహించబోతున్నట్లు అకాడమీ డైరెక్టర్ అభిలాష బిష్త్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
Read Also: Rahul Gandhi : అమెరికాలో పాకిస్థాన్, బంగ్లాదేశ్ గురించి కీలక వ్యాఖ్యలు చేసిన రాహుల్
Also Read
- Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
- Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
- Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
కాగా, తెలంగాణ పోలీస్ అకాడమీలో సబ్ ఇన్స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్.. పాసింగ్ అవుట్ పరేడ్ కు ముఖ్య అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. కాగా, మొత్తం 547 మంది ఎస్సైలు ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. వీరిలో 145 మంది మహిళా ఎస్ఐలు, 402 మంది పురుషులు ఉన్నారు. 547లో 401 మంది సివిల్ ఎస్ఐలు ఉండగా.. 547లో 472 మంది గ్రాడ్యూయేట్స్ 75 మంది పోస్ట్ గ్రాడ్యూయేట్స్ ఉన్నారు. వీరిలో 248 మంది ఎస్ఐలకు బీటెక్ బ్యాక్ గ్రౌండ్ ఉంది. పరేడ్ కమాండర్ గా మహిళా ఎస్ఐ పల్లి భాగ్యశ్రీ ఉండనున్నారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారిలో అత్యధికంగా 26 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వయసు గల అభ్యర్థులు ఉన్నారు. 283 మంది 26 నుంచి 30 సంవత్సరాల వయసు కలవారు.. 182 మంది 25 ఏళ్ళ లోపు వయసున్న వారు ఉన్నారు. ఈ పరేడ్ తర్వాత పోలీస్ అకాడమీలో క్రీడా భవన్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ)పై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!