Harish Vs Ponnam: దయచేసి కేసీఆర్ ప్రస్తావన వద్దు.. సభలో హరీష్కు పొన్నం వినతి
- కేసీఆర్ నాయకత్వంలో పీవీకి భారతరత్న ఇవ్వాలని ఇదే అసెంబ్లీలో తీర్మానం..
- కేంద్రం కూడా స్పందించి పీవీకి భారతరత్న ఇచ్చింది..
- మన్మోహన్ తెచ్చిన ఆర్డినెన్స్ను రాహుల్ చించేసినా ప్రధానిగా ఆయన మాట్లాడలేదు..
Harish Vs Ponnam: దేశానికి దిశానిర్దేశం చేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టి అనూహ్యంగా ఎదిగారన్నారు. అసెంబ్లీలో మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానం సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో పీవీకి భారతరత్న ఇవ్వాలని ఇదే అసెంబ్లీలో తీర్మానం చేశాం. కేంద్రం కూడా స్పందించి పీవీకి భారతరత్న ఇచ్చింది. హైదరాబాద్లో కేసీఆర్ పీవీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆయనను మా పీవీగా, టీవీగా గౌరవించాం. కాంగ్రెస్ ఓటమికి సంస్కరణలే కారణమని ఏఐసీసీలో చర్చించినా మన్మోహన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మన్మోహన్ తెచ్చిన ఆర్డినెన్స్ను రాహుల్ చించేసినా ప్రధానిగా ఆయన మాట్లాడలేదని తెలిపారు.
Read also: Tollywood : మెగా మల్టీస్టారర్ కు శ్రీకారం.. దర్శకుడు ఎవరంటే.?
Also Read
- Unusual Weather : తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం... పగలు సెగలు..సాయంత్రం జల్లులు
- Singareni : సింగరేణి చరిత్రలో మైలురాయి.. రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.!
- Chit Fund Fraud: చిట్ ఫండ్ పేరుతో భారీ మోసం.. ఏకంగా రూ.2 కోట్ల స్కాం
- B.Tech Student: పాపం ఏం కష్టమొచ్చిందో.. డీజిల్ పోసుకొని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య..
దాదాపు రెండేళ్ల పాటు కేంద్ర మంత్రివర్గంలో కేసీఆర్ పనిచేశారని గుర్తు చేశారు. 2004లో కేంద్ర మంత్రివర్గంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమానికి ఎన్నోసార్లు ఎదురుదెబ్బలు తగిలినా అధైర్య పడొద్దని ప్రోత్సహించారన్నారు. కేంద్ర కేబినెట్ లో చేరాలని కేసీఆర్ ను మన్మోహన్ సింగ్ ఆహ్వానించారన్నారు. కేంద్ర కేబినెట్ లో చేరాలని కేసీఆర్ ను మన్మోహన్ సింగ్ ఆహ్వానించారన్నారు. నేను మంత్రి పదవుల కోసం ఢిల్లీకి రాలేదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఢిల్లీకి వచ్చామని కేసీఆర్ అన్నారని తెలిపారు. యూపీఐ సమావేశంలో మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ కూడా మాట్లాడుతూ మేము తెలంగాణ తప్పకుండా ఏర్పాటు చేస్తామని, మీరు కేంద్రంలో చేరాలని కేసీఆర్ ను కోరారని హరీష్ రావు తెలిపారు. ఆయన ఆహ్వాన్నాన్ని స్వీకరించి కేసీఆర్ చేరారని గుర్తుచేశారు.
Read also: Priyanka Gandhi: డబుల్ ఇంజిన్ సర్కార్లో యువతపై డబుల్ దాడులు..
హరీష్ రావ్ .. పొన్నం ప్రభాకర్
కాగా.. అసెంబ్లీలో హరీష్ రావు మాటలకు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కేసీఆర్ అంటే గౌరవం కాదనడం లేదు.. కేసీఆర్ గురించి ఎందుకు అధ్యక్ష అన్నారు. దేశిని చినమల్లయ్య కి… ప్రో. జయశంకర్ కి ఏం గౌరవం దక్కింది అనేది చర్చ జరగాలా..? మన్మోహన్ సింగ్ సంతాప సభలో ఇవన్నీ ఎందుకీ అధ్యక్ష అన్నారు. సంతాప సభలో ఇవన్నీ చెప్పడానికి సందర్భం కాదన్నారు. దయచేసి మన్మోహన్ సింగ్ సంతాప సభ గురించి చర్చిస్తే మేలనే అసెంబ్లీలో రెండు చేతులు జోడించి తెలిపారు. మనం వాగ్దానాలు లేదంటే జరిగినటు వంటి మాటలు కాదు.. ఇవాళ మన్మోహన్ సింగ్ సంతాప సభ దాని గురించి మాట్లాడితే బాగుంటుందని సభలో తెలిపారు.
Read also: Priyanka Gandhi: డబుల్ ఇంజిన్ సర్కార్లో యువతపై డబుల్ దాడులు..
అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ.. శాసన మండలిలో కూడా మన్మోహన్ కు నివాళులర్పించి ఉంటే బాగుండేదన్నారు. హైదరాబాద్లో స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ పేరు పెట్టాలని హరీష్ రావు కోరారు. దేశ చరిత్రలో మన్మోహన్ సింగ్ చెరగని ముద్ర వేశారని హరీష్ రావు అన్నారు. మన్మోహన్ పదవుల కోసం వెతకలేదు. మన్మోహన్ను వెతుక్కుంటూ పదవులు వచ్చాయి. పీవీ, మన్మోహన్ ఇద్దరూ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు. కాంగ్రెస్ ఓటమికి పీవీ సంస్కరణలే కారణమని ఆంటోనీ నివేదిక పేర్కొంది.
Read also: The Family Man 3 : ‘ది ఫ్యామిలీ మ్యాన్ – 3’ షూటింగ్ పూర్తి.. క్లారిటీ ఇచ్చిన మనోజ్
ఓటమికి మన్మోహన్ బాధ్యుడిని చేసినా ఆయన వెనక్కి తగ్గలేదు. లాలూను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఇబ్బందులు ఎదురైనా మన్మోహన్ మౌనం వహించారు. మన్మోహన్ హయాంలోనే తెలంగాణ ఆవిర్భవించిందని హరీష్ రావు అన్నారు. జన్మభూమి కోసం ఎన్నో అవకాశాలను వదులుకున్నామన్నారు. దేశ రాజకీయాల్లోకి పీవీ మన్మోహన్ను తీసుకొచ్చారన్నారు. పీవీకి మన్మోహన్ నమ్మక ద్రోహం చేయలేదన్నారు. ఆర్థిక మంత్రిగా మన్మోహన్ చేసిన ప్రసంగం బెస్ట్ అని కొనియాడారు. లైసెన్స్ రాజ్, పర్మిట్ రాజ్కు మన్మోహన్ స్వస్తి పలికారని గుర్తు చేశారు.
Ethiopia: ఇథియోపియాలో ఘోర ప్రమాదం.. 71మంది మృతి
తాజావార్తలు
-
Rishab Pant: రిషబ్ పంత్ ఆట ముగిసిందా..? లక్నో కెప్టెన్ ఫామ్పై బౌలింగ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..
-
Anemia in Children : చిన్నపిల్లల్లో రక్తహీనత.. తల్లిదండ్రులు గమనించాల్సిన హెచ్చరిక సంకేతాలు, నివారణ మార్గాలు.!
-
Varanasi: మహేష్ బాబు వారణాసికి నీటి కష్టాలు.. జక్కన్న రిక్వెస్ట్కు సింపుల్గా నో చెప్పిన జలమండలి!
-
Jio Rs 209 Plan: జియో యూజర్స్కు షాక్.. ఆ పాపులర్ రీఛార్జ్ ప్లాన్ ఇక బంద్! కారణం ఇదేనా?
-
Egg Biryani Recipe: 10 నిమిషాల్లోనే కుక్కర్ లో ఎగ్ బిర్యానీ.. ఇలా చేస్తే టెస్ట్ అదుర్స్..!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!