Telangana Police: అలా చేస్తే సీజ్, లైసెన్సు రద్దు.. న్యూయర్ వేడుకలపై పోలీసుల హెచ్చరిక..
- నగరంలోని పబ్బులు, బార్లు, రెస్టారెంట్లు, రిసార్ట్లపై నిఘా..
- పబ్బులలో డ్రగ్స్ దొరుకితే సీజ్ చేయడంతో పాటు లైసెన్సులు రద్దు చేస్తాం..
Telangana Police: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగర పోలీసులు అలర్ట్ అయ్యారు. పబ్, బార్ల, ఈవెంట్ నిర్వహిస్తున్న నిర్వహకులపై నిఘా పెట్టారు. హైదరాబాద్ లోని పబ్బులు, బార్లు, రెస్టారెంట్లు, రిసార్ట్లపై నిఘా పెంచారు. న్యూయర్ వేడుకలపై రంగంలోకి దిగిన నార్కొటిక్స్ బ్యూరో పోలీసులు.. స్థానిక పోలీసులు, ఎక్సైజ్ అధికారులతో కలిసి తనఖీ చేశారు. వేడుకల్లో ఎటువంటి డ్రగ్స్ కు వినియోగించకుండ చర్యలు తీసుకోవాలని యజమానులకు ఆదేశించారు. డ్రగ్ ఫ్రీ వేడుకలు నిర్వహిస్తామని వారి నుంచి అండర్టేకింగ్ తీసుకున్నారు.
Read also: ATM Fraud: కామారెడ్డిలో కేటుగాడు.. ఏటీఎం కార్డు మార్చి రూ.40 వేలు కాజేసిన దుండగుడు..
Also Read
పోలీసుల తనిఖీలు
* బంజారాహిల్స్ పరిధిలోని టాస్, హోయిస్ట్, పార్క్ హయత్, లీలా హైదరాబాద్ స్టార్ హోటల్ అండ్ బార్లలో తనిఖీలు చేశారు.
* ఉప్పల్ పరిధిలోని వేవ్ పబ్, రాజేంద్ర నగర్లోని సిలెబర్ టెర్రేస్ కిచెన్లో తనిఖీలు చేపట్టారు.
* ఫిల్మ్ నగర్ లోని మూన్ షైన్ పబ్, జూబ్లీహిల్స్ లోని పలు పబ్బులు, బార్లలో తనిఖీలు చేశారు.
* సరూర్ నగర్ పరిధిలోని అర్బన్ బీట్స్, నైన్ ఓ నైన్, 1634ఈస్ట్ బార్, మోకిల పరిధిలోని రిసార్టులు, బార్లలో తనిఖీలు
* గచ్చిబౌలి, రాయదుర్గం, నార్సింగి పరిధుల్లోని పబ్బులు బార్లలో పోలీసులు తనిఖీ చేసిన వారి నుంచి అండర్ టేకింగ్ తీసుకున్నారు.
Read also: Jagtial Govt Hospital: ప్రభుత్వ ఆసుపత్రిలో అమానుషం.. వృద్ధ దంపతుల పట్ల సిబ్బంది నిర్లక్ష్యం..
పబ్బులలో డ్రగ్స్ దొరుకితే సీజ్ చేయడంతో పాటు లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. సమయం ఇచ్చిన ప్రకారమే పబ్లు నిర్వహించాలని తెలిపారు. మందు సప్లై కూడా సమయం పాటించాలని సమయానికి మించి మందులు సప్లై చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. న్యూయర్ వేడుకల్లో అపశృతి చోటుచేసుకోకుండా పబ్ నిర్వాహకులు జాగ్రత్తగా నిర్వహించాలని తెలిపారు. ఏమాత్రం అలసట నిర్వహించినా చర్యలు తప్పవని పేర్కొన్నారు.
Read also: Tirumala Parakamani: తిరుమల పరకామణి సొమ్ముల స్వాహాపై పూర్తి విచారణ జరపాలన్న బీజేపీ నేతలు
మరోవైపు తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్టంలో డ్రగ్స్ నిర్ములన లక్ష్యం గా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పనిచేస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పనిచేస్తున్నామన్నారు. నార్కోటిక్ డ్రగ్స్ ను కట్టడి చెయ్యడం లో ఎక్సైజ్ శాఖ బాగా కృషి చేసిందన్నారు. గంజాయి, డ్రగ్స్ ఎక్కువగా వినియోగించే ప్రాంతాలను గుర్తించామన్నారు. పబ్స్ పై ప్రత్యేక బృందాలతో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించామని, గంజాయి నిర్మూలనలో భాగంగా ఆపరేషన్ ధూల్ పేట్ నిర్వహించామన్నారు.
Chhattisgarh: సమతా పేరిట సంచలన లేఖ విదుదల చేసిన మావోయిస్టులు
తాజావార్తలు
-
Santosh Goyal Story: విధి వంచించిన మేధావి.. ఈ పీహెచ్డీ స్కాలర్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు..
-
AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక మలుపు.. రంగంలోకి దిగిన ఐటీ అధికారులు
-
iQOO Z11 & Z11x: ఐకూ Z11 సిరీస్ గ్లోబల్ లాంచ్ కన్ఫర్మ్.. ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ వివరాలు
-
Vijay: ఆలయాల బాట పట్టిన విజయ్.. టీవీకే శ్రేణుల్లో నూతనోత్సాహం
-
Minister Gottipati Ravikumar: విద్యుత్ కోతలకు నో.. నిరంతర సరఫరా ఉండాల్సిందే.. మంత్రి గొట్టిపాటి ఆదేశాలు
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!