Hyderabad: వాల్టా చట్టానికి అధికారులు పదును.. చెట్టు నరికితే భారీ జరిమానాలు..
- హైదరాబాద్ లో చెట్లను సంరక్షించేందుకు అటవీశాఖ అధికారులు ఫోకస్ ..
- అధికారులను సంప్రదించకుండా చెట్లను నరికితే భారీ జరిమానా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్ లో చెట్లను సంరక్షించేందుకు అటవీశాఖ అధికారులు ఫోకస్ పెట్టింది. ప్రతి చెట్టును కాపాడేందుకు వాల్టా చట్టాన్ని కఠినతరం చేస్తోంది. చెట్టును నరికివేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తుంది. పార్కులో మొక్కను తీసివేసిన, ఇంట్లో చెట్టు కొమ్మలను నరికినా జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేసింది. కేబీఆర్ నేషనల్ పార్క్కు సంబంధించి ఇటీవల కాలంలో అటవీశాఖ అధికారులు ఇలాంటి ఫిర్యాదులతో పలు కేసులు నమోదు చేశారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ డివిజన్లలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. వాల్టా చట్టం ప్రకారం తమ ఇంటి ఆవరణలోని చెట్టును ఎవరూ స్వయంగా నరికివేయకూడదు. ఆ చెట్టు వల్ల ఏదైనా సమస్య ఉంటే అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. అధికారులు పరిశీలించి, నిజంగా సమస్య ఉంటే, చెట్టును నరికి లేదా స్థలం నుండి తొలగించి మరెక్కడా నాటుతారు. చెట్టును తొలగించేందుకు రూ. 500, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. లేకపోతే, నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానా వేలల్లో ఉంటుంది.
Read also: South Central Railway: తెలంగాణ- కర్ణాటక ఎంపీలతో జిఎం అరుణ్ కుమార్ జైన్ సమావేశం..
Also Read
- Secunderabad Bonalu 2026: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలపై క్లారిటీ.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
- ACB Raids: ఆదాయానికి మించిన ఆస్తులు.. డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ దాడులు.!
- Hyderabad: ఘనంగా మిస్ యూనివర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2026 గ్రాండ్ ఫినాలే.!
- CM Revanth Reddy : SIRపై సీఎం రేవంత్ సీరియస్.. గాంధీ భవన్లో వార్ రూమ్.!
కానీ చాలా మందికి వాల్టా చట్టంపై సరైన అవగాహన లేదు. దీంతో కొందరు తమ ఇళ్లలో చెట్లను నరికివేస్తున్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ రోడ్ నెం.32లో నివాసముంటున్న సమ్మిరెడ్డి తన ఇంటి ముందున్న మూడు చెట్లను కరెంటు తీగలు అడ్డుగా ఉన్నాయని నరికాడు. అతనికి అధికారులు జరిమానా విధించారు. కానీ అలాంటి చట్టం ఉందని తనకు తెలియదనే చెట్లను నరికివేసినట్లు సమ్మిరెడ్డి అధికారులకు తెలిపారు. మరోవైపు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 76లో నివాసముంటున్న ప్రసాద్ ఇంట్లోని సీతాఫలం చెట్లను నరికినందుకు అటవీశాఖ అధికారులు రూ.12వేలు జరిమానా విధించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో ఓ వ్యాపారి తన ఇంటి ఆవరణోని చెట్టు కొమ్మను నరికేయడంతో రూ.10వేల జరిమానా కట్టాడు. గతేడాది బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఎన్బీటీ నగర్లో నివాసముంటున్న హేమలత ఇంటి పక్కన చెట్టును నరికితే రూ.12 వేలు జరిమానా విధించారు. ఇదిలా ఉండగా.. ఈ చట్టం చెట్లు, మొక్కలకే కాకుండా భూమి, నీటికి కూడా వర్తిస్తుందని అటవీశాఖ అధికారులు తెలిపారు.
Telangana Rains: తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..
తాజావార్తలు
-
Sugar Free Diet: చక్కెర పూర్తిగా మానేస్తే ఆరోగ్యానికే ప్రమాదమా..? తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు
-
Pak ISI: తప్పిన పెను ప్రమాదం.. పాకిస్తాన్ ISI ఉగ్రవాద ముఠాను పట్టుకున్న పోలీసులు..
-
Jobs In RBI: డిగ్రీ, పీజీ అర్హత.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెలకు రూ.1.50 లక్షలు..
-
T20 World Cup: పాక్పై గెలిచినా తగ్గని కసి.. డచ్ జట్టుపై భారీ విజయమే లక్ష్యంగా బరిలోకి టీమిండియా..
-
Save The Tigers 3: జూన్ 19 నుంచి సరికొత్త ట్విస్టులతో ‘సేవ్ ది టైగర్స్ 3’
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?