Hyderabad: వాల్టా చట్టానికి అధికారులు పదును.. చెట్టు నరికితే భారీ జరిమానాలు..
- హైదరాబాద్ లో చెట్లను సంరక్షించేందుకు అటవీశాఖ అధికారులు ఫోకస్ ..
- అధికారులను సంప్రదించకుండా చెట్లను నరికితే భారీ జరిమానా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్ లో చెట్లను సంరక్షించేందుకు అటవీశాఖ అధికారులు ఫోకస్ పెట్టింది. ప్రతి చెట్టును కాపాడేందుకు వాల్టా చట్టాన్ని కఠినతరం చేస్తోంది. చెట్టును నరికివేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తుంది. పార్కులో మొక్కను తీసివేసిన, ఇంట్లో చెట్టు కొమ్మలను నరికినా జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేసింది. కేబీఆర్ నేషనల్ పార్క్కు సంబంధించి ఇటీవల కాలంలో అటవీశాఖ అధికారులు ఇలాంటి ఫిర్యాదులతో పలు కేసులు నమోదు చేశారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ డివిజన్లలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. వాల్టా చట్టం ప్రకారం తమ ఇంటి ఆవరణలోని చెట్టును ఎవరూ స్వయంగా నరికివేయకూడదు. ఆ చెట్టు వల్ల ఏదైనా సమస్య ఉంటే అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. అధికారులు పరిశీలించి, నిజంగా సమస్య ఉంటే, చెట్టును నరికి లేదా స్థలం నుండి తొలగించి మరెక్కడా నాటుతారు. చెట్టును తొలగించేందుకు రూ. 500, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. లేకపోతే, నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానా వేలల్లో ఉంటుంది.
Read also: South Central Railway: తెలంగాణ- కర్ణాటక ఎంపీలతో జిఎం అరుణ్ కుమార్ జైన్ సమావేశం..
Also Read
- CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
- Harish Rao : రేవంత్కు హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్.. ‘నిరూపిస్తే రాజీనామా.!’
- CM Revanth Reddy : జగ్గారెడ్డి లాంటి నాయకుడు వెయ్యి కోట్లు ఇచ్చినా దొరకడు
- CM Revanth Reddy : 70 వేల జాబ్స్ భర్తీ.. పేపర్ లీకేజీలపై బీఆర్ఎస్కు రేవంత్ కౌంటర్.!
కానీ చాలా మందికి వాల్టా చట్టంపై సరైన అవగాహన లేదు. దీంతో కొందరు తమ ఇళ్లలో చెట్లను నరికివేస్తున్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ రోడ్ నెం.32లో నివాసముంటున్న సమ్మిరెడ్డి తన ఇంటి ముందున్న మూడు చెట్లను కరెంటు తీగలు అడ్డుగా ఉన్నాయని నరికాడు. అతనికి అధికారులు జరిమానా విధించారు. కానీ అలాంటి చట్టం ఉందని తనకు తెలియదనే చెట్లను నరికివేసినట్లు సమ్మిరెడ్డి అధికారులకు తెలిపారు. మరోవైపు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 76లో నివాసముంటున్న ప్రసాద్ ఇంట్లోని సీతాఫలం చెట్లను నరికినందుకు అటవీశాఖ అధికారులు రూ.12వేలు జరిమానా విధించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో ఓ వ్యాపారి తన ఇంటి ఆవరణోని చెట్టు కొమ్మను నరికేయడంతో రూ.10వేల జరిమానా కట్టాడు. గతేడాది బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఎన్బీటీ నగర్లో నివాసముంటున్న హేమలత ఇంటి పక్కన చెట్టును నరికితే రూ.12 వేలు జరిమానా విధించారు. ఇదిలా ఉండగా.. ఈ చట్టం చెట్లు, మొక్కలకే కాకుండా భూమి, నీటికి కూడా వర్తిస్తుందని అటవీశాఖ అధికారులు తెలిపారు.
Telangana Rains: తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..
తాజావార్తలు
-
Story Board : స్వతంత్ర భారత ప్రస్థానం ఎలా ఉంది..? ఇన్నేళ్లలో మనం ఏం సాధించాం..?
-
CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
-
OTR: కోదండరాంకు యువత సెగ..! నాడు నమ్మినవాళ్లే ఇప్పుడు నిలదీస్తున్నారా..?
-
Nitin Nabin: నితిన్ నబీన్ ఏపీ పర్యటన ఖరారు.. ఆగస్టు 17 నుంచి 21 వరకు..
-
OTR: బీఆర్ఎస్కు కాంగ్రెస్ బిగ్ కౌంటర్..! 10 ఏళ్ల భూ కేటాయింపుల చిట్టా..!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!