South Central Railway: తెలంగాణ- కర్ణాటక ఎంపీలతో జిఎం అరుణ్ కుమార్ జైన్ సమావేశం..
- హైదరాబాద్ రైల్ నిలయంలో ఎంపీ లతో జిఎం అరుణ్ కుమార్ జైన్ సమావేశం ప్రారంభం..
- దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని తెలంగాణ- కర్ణాటక ఎంపీలతో సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
South Central Railway: తెలంగాణ, కర్ణాటక ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే సమావేశం మొదలైంది. సికింద్రాబాద్ లోని నిలయంలో ఎంపీ లతో జిఎం అరుణ్ కుమార్ జైన్ సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి, ఎంపీలు కావ్య, రఘునందన్ రావు, DK అరుణ లు పాల్గొన్నారు. రైళ్ల హాల్టింగ్, కొత్త రైల్వే లైన్, రైల్వే అండర్ బ్రిడ్జిలు, అండర్ పాసులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, నూతన ప్రాజెక్ట్ లు, కొత్త లైన్ లు తదితర సమస్యలను ఎంపీలు అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నారు. కాగా.. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం సమర్పించనున్న బడ్జెట్లో రైల్వే కేటాయింపులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇందులో జోన్లు, రాష్ట్రాల వారీగా నిధులు, ప్రాజెక్టుల మంజూరు తదితరాలు ఉంటాయి. జోన్ల వారీగా నిధుల కేటాయింపు, ప్రాజెక్టుల మంజూరుపై ఆయా రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు, వారిపై ఎంపీల ఒత్తిడి కీలక పాత్ర పోషిస్తుంది.
Read also: Governor Jishnu Dev Varma: సూర్యాపేట జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన..
Also Read
- CM Revanth Reddy : నీట్-యూజీ 2026 రద్దు... మోడీ సర్కార్ ఫెయిల్
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
దశాబ్దాల క్రితం తెలంగాణకు మంజూరైన వివిధ రైల్వే ప్రాజెక్టుల నిర్మాణాలు సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఇప్పటికీ నత్తనడకన సాగుతున్నాయి. సర్వే స్థాయిలో ఉన్న వారు సాగదీయడానికే పరిమితమయ్యారు. కొత్త మంజూరు లేదు. తాజాగా డీఎం రైల్వే నిర్వహించిన సమావేశంలో… ముఖ్యమైన ప్రాజెక్టులకే ప్రాధాన్యం ఇవ్వాలని ఎంపీలు పట్టుబట్టితే బడ్జెట్ లో రాష్ట్రానికి మంచి స్థానం దక్కే అవకాశాలున్నాయి. మరోవైపు ముంబైలో AC MMTS రైళ్లు ఉన్నాయి. హైదరాబాద్లోని ఎంఎంటీఎస్లో కూడా ఏసీ బోగీలను మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ మహానగరం విస్తరించనుంది. ఈ నేపథ్యంలో షాద్నగర్, భువనగిరి, సంగారెడ్డి వంటి పట్టణాలకు ఎంఎంటీఎస్ రైళ్లు నడిపేందుకు ప్రాజెక్టులు మంజూరు చేయాలి. శంషాబాద్ నుంచి విజయవాడ వరకు జాతీయ రహదారిపై కొత్త రైలు మార్గాన్ని త్వరగా పూర్తి చేయాలి. ఈ మార్గంలో రైల్వే లైన్ మంజూరైతే తెలుగు రాష్ట్రాల్లోని కీలక నగరాల మధ్య దూరం తగ్గుతుంది.
KTR Tour: నేడు ఆదిలాబాద్ లో కేటీఆర్ పర్యటన.. రాంలీలా మైదానంలో బహిరంగ సభ..
తాజావార్తలు
-
Tech Layoffs 2026: టెక్ రంగంలో కలకలం.. రెండు వారాల్లోనే 25,000 మందికి ఉద్వాసన..
-
Modi-CM Vijay: ప్రధాని మోడీకి సీఎం విజయ్ లేఖ.. దేనికోసమంటే..!
-
CM Revanth Reddy : నీట్-యూజీ 2026 రద్దు… మోడీ సర్కార్ ఫెయిల్
-
Gaurnaidu: ‘పెద్ది’ నుంచి ఊహించని ఊరమాస్ టీజర్.. ‘గౌర్నాయుడు’గా శివరాజ్కుమార్ విశ్వరూపం!
-
Siddaramaiah: “హిజాబ్”కు అనుమతి, “కాషాయ కండువాల”కు నో పర్మిషన్..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!