MP Balram Naik: కాంగ్రెస్ గ్యారంటీలపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్కు లేదు..
- కేటీఆర్ పై ఎంపీ బలరాంనాయక్ తీవ్ర విమర్శలు
- మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రేపు బీఆర్ఎస్ మహా ధర్నాలో పాల్గొననున్న కేటీఆర్
- కేటీఆర్ మహబూబాబాద్ వస్తే గిరిజనులంతా తరిమి కొడతారు- ఎమ్మెల్యే మురళి నాయక్
- లగచర్ల ఘటనకు మహబూబాబాద్ కు సంబంధం ఏమిటి- ఎంపీ బలరాం నాయక్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ హయాంలో మహబూబాబాద్లో గిరిజనుల నుంచి బలవంతంగా లాక్కున్న భూములను వారికి తిరిగి ఇచ్చిన తర్వాతనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహబూబాబాద్కు రావాలని ఎంపీ బలరాంనాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ.. లగచర్ల ఘటన బీఆర్ఎస్ పార్టీ కుట్రతో చేయించిందని.. అందులో ఏడుగురికి భూములు లేవని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ దళితుడిని సీఎం చేయలేదని.. 3 ఎకరాల భూమిని ఇవ్వలేదని, కేజీ టు పీజీ ఉచిత విద్యను అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో గిరిజనులపై ఎన్నో దాడులు జరిగాయని.. ఖమ్మంలో గిరిజన రైతులకు సంకెళ్లు వేశారని.. సిరిసిల్లలో ఇసుక ట్రాక్టర్లతో దళితులను హతమార్చారని, ఎల్బీ నగర్లో ఆరు సంవత్సరాల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారని, హుజూర్ నగర్లో ప్రస్తుత జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ పై దాడి చేశారని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు గిరిజనులు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. కేటీఆర్ భయానికి సినిమా హీరోయిన్లు ముంబైకి పారిపోతున్నారని అన్నారు.
Read Also: Raghuram rajan: ప్రభుత్వ రుణాలు చాలా ప్రమాదకరం
Also Read
అనంతరం ఎమ్మెల్యే డాక్టర్. మురళి నాయక్ మాట్లాడుతూ… రేపు బీఆర్ఎస్ ధర్నాకు కేటీఆర్ వస్తే దగాపడ్డ గిరిజనులంతా తరిమి తరిమి కొడతారని అన్నారు. ఇందిరా గాంధీ గిరిజనులకు భూములను పంపిణీ చేస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ భూములను బలవంతంగా లాక్కొని కనీసం నష్టపరిహారం కూడా చెల్లించలేదని తెలిపారు. భూములను లాక్కోవద్దని గిరిజన మహిళలంతా కాళ్ళ మీద పడ్డ కనికరించలేదని.. 30 కుటుంబాలను బజారుకు ఈడ్చారని, గిరిజనులకు నష్ట పరిహారం చెల్లించలేదని, ఆరోజు గిరిజనులు కనపడలేదా అని ప్రశ్నించారు. హైదరాబాద్ చుట్టూ అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా కొడంగల్లో ఫార్మ పరిశ్రమకు కృషి చేస్తుంటే, బీఆర్ఎస్ కుట్రతో అధికారులపై దాడులకు పాల్పడ్డారని.. లగచర్ల రైతులకు నష్టపరిహారం చెల్లించడంతో పాటు, కుటుంబానికో ఉద్యోగం ఇస్తామని చెప్పామని అన్నారు.
Read Also: Hair dryer blast: హెయిర్ డ్రైయర్ పేలి చేతులు కోల్పోయిన మహిళ..
తాజావార్తలు
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!