MP Balram Naik: కాంగ్రెస్ గ్యారంటీలపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్కు లేదు..
- కేటీఆర్ పై ఎంపీ బలరాంనాయక్ తీవ్ర విమర్శలు
- మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రేపు బీఆర్ఎస్ మహా ధర్నాలో పాల్గొననున్న కేటీఆర్
- కేటీఆర్ మహబూబాబాద్ వస్తే గిరిజనులంతా తరిమి కొడతారు- ఎమ్మెల్యే మురళి నాయక్
- లగచర్ల ఘటనకు మహబూబాబాద్ కు సంబంధం ఏమిటి- ఎంపీ బలరాం నాయక్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ హయాంలో మహబూబాబాద్లో గిరిజనుల నుంచి బలవంతంగా లాక్కున్న భూములను వారికి తిరిగి ఇచ్చిన తర్వాతనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహబూబాబాద్కు రావాలని ఎంపీ బలరాంనాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ.. లగచర్ల ఘటన బీఆర్ఎస్ పార్టీ కుట్రతో చేయించిందని.. అందులో ఏడుగురికి భూములు లేవని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ దళితుడిని సీఎం చేయలేదని.. 3 ఎకరాల భూమిని ఇవ్వలేదని, కేజీ టు పీజీ ఉచిత విద్యను అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో గిరిజనులపై ఎన్నో దాడులు జరిగాయని.. ఖమ్మంలో గిరిజన రైతులకు సంకెళ్లు వేశారని.. సిరిసిల్లలో ఇసుక ట్రాక్టర్లతో దళితులను హతమార్చారని, ఎల్బీ నగర్లో ఆరు సంవత్సరాల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారని, హుజూర్ నగర్లో ప్రస్తుత జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ పై దాడి చేశారని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు గిరిజనులు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. కేటీఆర్ భయానికి సినిమా హీరోయిన్లు ముంబైకి పారిపోతున్నారని అన్నారు.
Read Also: Raghuram rajan: ప్రభుత్వ రుణాలు చాలా ప్రమాదకరం
Also Read
అనంతరం ఎమ్మెల్యే డాక్టర్. మురళి నాయక్ మాట్లాడుతూ… రేపు బీఆర్ఎస్ ధర్నాకు కేటీఆర్ వస్తే దగాపడ్డ గిరిజనులంతా తరిమి తరిమి కొడతారని అన్నారు. ఇందిరా గాంధీ గిరిజనులకు భూములను పంపిణీ చేస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ భూములను బలవంతంగా లాక్కొని కనీసం నష్టపరిహారం కూడా చెల్లించలేదని తెలిపారు. భూములను లాక్కోవద్దని గిరిజన మహిళలంతా కాళ్ళ మీద పడ్డ కనికరించలేదని.. 30 కుటుంబాలను బజారుకు ఈడ్చారని, గిరిజనులకు నష్ట పరిహారం చెల్లించలేదని, ఆరోజు గిరిజనులు కనపడలేదా అని ప్రశ్నించారు. హైదరాబాద్ చుట్టూ అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా కొడంగల్లో ఫార్మ పరిశ్రమకు కృషి చేస్తుంటే, బీఆర్ఎస్ కుట్రతో అధికారులపై దాడులకు పాల్పడ్డారని.. లగచర్ల రైతులకు నష్టపరిహారం చెల్లించడంతో పాటు, కుటుంబానికో ఉద్యోగం ఇస్తామని చెప్పామని అన్నారు.
Read Also: Hair dryer blast: హెయిర్ డ్రైయర్ పేలి చేతులు కోల్పోయిన మహిళ..
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!