KTR: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఇళ్ల అమ్మకాలు పడిపోయాని మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా తెలిపారు. ప్రస్తుతం జులై – సెప్టెంబర్ త్రైమాసికం ఇండ్ల అమ్మకాలు దాదాపు 42 శాతం పడిపోయినట్లు ప్రాప్ ఈక్విటీ అనే సంస్థ నివేదికను రిలీజ్ చేసింది.. ఈ నివేదికను తన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అభివృద్ధి చెందుతున్న మహానగరం సంక్షోభంలోకి వెళ్తుందనడానికి ఈ నివేదికనే నిదర్శనం అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధ్వంసక పరిపాలన చేస్తున్నారని విమర్శించారు. ఆర్ఆర్ ట్యాక్స్, కూల్చివేతల కారణంగా రియల్ ఎస్టేట్ రంగం దారుణంగా పడిపోయిందన్నారు. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపకపోవడంతో.. హైదరాబాద్ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన ఈ మహా నగరం ఇవాళ గందరగోళ పరిస్థితుల్లో కూరుకుపోయిందంటూ కేటీఆర్ మండిపడ్డారు.
Read Also: Jasprit Bumrah: కాన్పూర్ టెస్ట్.. జస్ప్రీత్ బుమ్రా దూరం! తుది జట్టులోకి కుల్దీప్
హైదరాబాద్ మహా నగరంలో ఈ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు 12,082 యూనిట్లుగా ఉండొచ్చని ప్రాప్ ఈక్విటీ చెప్పుకొచ్చింది. గత ఏడాది ఇదే వ్యవధిలో 20,658 యూనిట్ల అమ్మకాలు జరిగాయి.. దీంతో తాజా సర్వేలో అన్ని నగరాల కంటే హైదరాబాద్లోనే అత్యంత క్షీణత నమోదు అయింది. గత ఏడాదిదాకా దేశంలోనే అత్యంత ఎక్కువగా ఇండ్ల అమ్మకాలు ఇక్కడ జరిగాయి. ముంబై, బెంగళూరు లాంటి నగరాలనూ దాటుకొని గడిచిన పదేళ్లలో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం మెరుపు వేగంతో దూసుకుపోయింది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది.
A 42% crash in Hyderabad's housing market in just Q3! From a booming metropolis to a city in crisis, thanks to CM Revanth Reddy's disastrous administration; RR Tax and mad demolition drives
Investors are backing off, and the people of Hyderabad are suffering
What was once… pic.twitter.com/bgbMBESg7q
— KTR (@KTRBRS) September 25, 2024