Konda Surekha: వివాదాలు సృష్టించేలా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు..
- టీటీడీ తరహాలో యాదగిరిగుట్టకు బోర్డు ఉండాలి..
- తిరుమలలో మా సిఫార్సు లేఖలు పనిచేయకపోతే ఎలా..
- వివాదాలు సృష్టించేలా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు: మంత్రి సురేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Konda Surekha: తెలంగాణ అసెంబ్లీలో లాబీలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మీడియాతో చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట బోర్డు ఉండాలని చట్ట సవరణ చేశాం.. టీటీడీకి స్వయం ప్రతిపత్తి ఉంటుంది.. కానీ, యాదగిరిగుట్ట బోర్డుకు ప్రభుత్వం కంట్రోల్ లో ఉంటుంది అని తెలిపారు. హైదరాబాద్ కు ఏపీ ముఖ్యమంత్రి వస్తే.. చంద్రబాబును కలిసి టీటీడీ సిఫారసు లేఖలను అనుమతించాలని అడుగుతాను అని పేర్కొన్నారు. కనీసం మా లెటర్ కూడా టీటీడీలో పనిచేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. మేము ఇష్టారీతిలో ఎవరికి పడితే వారికి లెటర్ ఇవ్వడం లేదు.. అయినా ఇప్పుడు ఎందుకు ఆపారో తెలియడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. దైవ దర్శనాల దగ్గర అభ్యంతరాలు పెట్టడం సరైంది కాదు అని మంత్రి కొండా సురేఖ చెప్పుకొచ్చారు.
Read Also: Harish Rao: ఉస్మానియా యూనివర్సిటీలో ఆంక్షలు విధించడం అప్రజాస్వామికం..
Also Read
- Narendra Modi : సీఎం రేవంత్కు మోడీ కౌంటర్..
- Kishan Reddy : తెలంగాణకు శుభవార్త.. త్వరలోనే రీజినల్ రింగు రోడ్డు పనులు..!
- PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
- Hyderabad Liquor Scam: బ్రాండెడ్ మందు బాబులకు షాక్.. ప్రీమియం లిక్కర్లో చీప్ లిక్కర్..
ఇక, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు పొట్టి శ్రీరాములు పేరు పెడితే.. మేము ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయమని మంత్రి కొండా సురేఖ తెలిపారు. వివాదాలు సృష్టంచే విధంగా బీజేపీ సభ్యులు మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు. ఇక, సెల్ఫ్ డ్రైవింగ్ గురించి కేటీఆర్ కు తెలిసినంతగా ఎవరికి తెలియదు అని ఎద్దేవా చేశారు. ఆర్కీయాలజీ, దేవాదాయ, టూరిజం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ల యూనిట్ గా చేస్తేనే.. టెంపుల్ టూరిజం పెరుగుతుంది అని చెప్పుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం సహాకరించకుండా పురాతన దేవాలయాలను అభివృద్ధి చేయడం సాధ్యం కాదు.. నాకు పురాతన ఆలయాల అభివృద్ధి కోసం రోజు దరఖాస్తులు వస్తున్నాయి.. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న భూములను రక్షిస్తాం.. అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు మహిళా సంఘాలకు లీజ్ కు ఇస్తామన్నారు. దేవాలయాల్లో ఉన్న బంగారానికి సంబంధించిన వివరాలు తెప్పిస్తున్నాం.. ఒక్క వేములవాడలోనే 60 కేజీల గోల్డ్ ఉంది.. అన్నీ దేవాలయాలను ఓకే గొడుకు కిందకు తీసుకువస్తాం.. ప్రతీ గుడి ఖర్చులను థర్డ్ పార్టీతో ఆడిట్ చేయిస్తామని మంత్రి కొండా సురేఖ వెల్లడించింది.
- Tags
- bjp
- congress
- hyderabad
- konda surekha
- ktr
తాజావార్తలు
-
PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
-
Warren Buffett: ‘అమ్మా.. నీ కోపమే నన్ను ప్రపంచ విజేతను చేసింది’.. వారెన్ బఫెట్
-
S Keerthana: 29 ఏళ్లకే మంత్రి.. 5 భాషల్లో ప్రావీణ్యం.. విజయ్ కేబినెట్లో స్పెషల్గా కీర్తన..
-
LSG vs CSK : లక్నో భారీ స్కోరు.. ఇంగ్లిస్ శివతాండవం.. షాబాజ్ మెరుపు ముగింపు.!
-
Tamil Nadu Election Twist: తమిళ రాజకీయాల్లో మళ్లీ ట్విస్ట్.. మద్రాస్ హైకోర్టు మెట్లు ఎక్కిన మాజీ మంత్రి!
-
PM Modi Telangana Visit: తెలంగాణపై మోడీ వరాల జల్లు.. రూ.9,377 కోట్లతో పలు ప్రాజెక్టులకు శ్రీకారం