Konda Surekha: వివాదాలు సృష్టించేలా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు..
- టీటీడీ తరహాలో యాదగిరిగుట్టకు బోర్డు ఉండాలి..
- తిరుమలలో మా సిఫార్సు లేఖలు పనిచేయకపోతే ఎలా..
- వివాదాలు సృష్టించేలా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు: మంత్రి సురేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Konda Surekha: తెలంగాణ అసెంబ్లీలో లాబీలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మీడియాతో చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట బోర్డు ఉండాలని చట్ట సవరణ చేశాం.. టీటీడీకి స్వయం ప్రతిపత్తి ఉంటుంది.. కానీ, యాదగిరిగుట్ట బోర్డుకు ప్రభుత్వం కంట్రోల్ లో ఉంటుంది అని తెలిపారు. హైదరాబాద్ కు ఏపీ ముఖ్యమంత్రి వస్తే.. చంద్రబాబును కలిసి టీటీడీ సిఫారసు లేఖలను అనుమతించాలని అడుగుతాను అని పేర్కొన్నారు. కనీసం మా లెటర్ కూడా టీటీడీలో పనిచేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. మేము ఇష్టారీతిలో ఎవరికి పడితే వారికి లెటర్ ఇవ్వడం లేదు.. అయినా ఇప్పుడు ఎందుకు ఆపారో తెలియడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. దైవ దర్శనాల దగ్గర అభ్యంతరాలు పెట్టడం సరైంది కాదు అని మంత్రి కొండా సురేఖ చెప్పుకొచ్చారు.
Read Also: Harish Rao: ఉస్మానియా యూనివర్సిటీలో ఆంక్షలు విధించడం అప్రజాస్వామికం..
Also Read
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
- Hyderabad: ప్రేమ వేధింపుల వివాదం.. కత్తులతో పొడిచి యువకుడిని దారుణ హత్య..!
ఇక, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు పొట్టి శ్రీరాములు పేరు పెడితే.. మేము ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయమని మంత్రి కొండా సురేఖ తెలిపారు. వివాదాలు సృష్టంచే విధంగా బీజేపీ సభ్యులు మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు. ఇక, సెల్ఫ్ డ్రైవింగ్ గురించి కేటీఆర్ కు తెలిసినంతగా ఎవరికి తెలియదు అని ఎద్దేవా చేశారు. ఆర్కీయాలజీ, దేవాదాయ, టూరిజం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ల యూనిట్ గా చేస్తేనే.. టెంపుల్ టూరిజం పెరుగుతుంది అని చెప్పుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం సహాకరించకుండా పురాతన దేవాలయాలను అభివృద్ధి చేయడం సాధ్యం కాదు.. నాకు పురాతన ఆలయాల అభివృద్ధి కోసం రోజు దరఖాస్తులు వస్తున్నాయి.. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న భూములను రక్షిస్తాం.. అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు మహిళా సంఘాలకు లీజ్ కు ఇస్తామన్నారు. దేవాలయాల్లో ఉన్న బంగారానికి సంబంధించిన వివరాలు తెప్పిస్తున్నాం.. ఒక్క వేములవాడలోనే 60 కేజీల గోల్డ్ ఉంది.. అన్నీ దేవాలయాలను ఓకే గొడుకు కిందకు తీసుకువస్తాం.. ప్రతీ గుడి ఖర్చులను థర్డ్ పార్టీతో ఆడిట్ చేయిస్తామని మంత్రి కొండా సురేఖ వెల్లడించింది.
- Tags
- bjp
- congress
- hyderabad
- konda surekha
- ktr
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!