Jaggareddy vs Revanth Reddy : జగ్గారెడ్డి సవాల్.. రేవంత్ సంగతేంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్లో ముసలం మొదలైనట్లు కనపిస్తోంది. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ లీడర్ మర్రి శశిధర్ రెడ్డి ఇంట్లో టీ కాంగ్రెస్ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశం ఒక్కసారిగా తెలంగాణ కాంగ్రెస్ దుమారం రేపింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై అసమ్మతితోనే పార్టీ సీనియర్లు సమావేశమయ్యారని వార్తలు వినిపించాయి. అయితే ఈ మీటింగ్ భట్టి లాంటి వారు స్పష్టతనిస్తూ.. అలాంటిదేమీ లేదని.. సోనియా, రాహుల్ గాంధీల సారథ్యంలోనే కాంగ్రెస్ నడిచేందుకు నిర్ణయం తీసుకున్నామని.. దానిపైనే సమావేశమయ్యామని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే.. ఈ రోజు మరోసారి సీనియర్లు సమావేశం కానున్న నేపథ్యంలో ఏఐసీసీ కార్యదర్శి బోస్రాజు సీనియర్లు ఫోన్ చేయడం.. ఈ సమావేశం నిర్వహిస్తే.. తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందని చెప్పడంతో మరోసారి కాంగ్రెస్లో రేవంత్రెడ్డిపై ఉన్న విముఖత బయటపడింది.
ఏదైనా సమస్య ఉంటే పార్టీ సమావేశాల్లో చర్చించాలని, లేకుండా సోనియా, రాహుల్ గాంధీలతో ముచ్చటించాలని బోస్రాజు హితవు పలికారు. అయితే ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి పీసీసీ రేవంత్రెడ్డిపై ఉన్న వ్యతిరేకతను బయటపెట్టారు. రేవంత్ రెడ్డికి సత్తా ఉంటే.. తన నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరుపున ఓ అభ్యర్థిని నిలబెట్టాలని, తాను ఇండిపెండెంట్గా నిలబడి గెలుస్తానని సవాల్ విసిరారు. జగ్గారెడ్డి చేసిన సవాల్ టీకాంగ్రెస్లో సీనియర్లకు జూనియర్లకు మధ్య సమస్యలు ఉన్నట్లు స్పష్టం చేస్తోంది. అయితే దీనికీ కారణం లేకపోలేదు.. ఇటీవల దేశంలో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. గత ఎన్నికల్లో పంజాబ్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈ సారి ఆ రాష్ట్రాన్ని కూడా చేజార్చుకుంది. దీంతో క్రింది స్థాయి నేత నుంచి అగ్రస్థాయి నేతలవరకు కాంగ్రెస్లో ఏం జరుగుతోందో అర్థకాలేదు.
Also Read
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
ఈ విషయాన్ని జగ్గారెడ్డి ఉటంకిస్తూ.. పంజాబ్లో పీసీసీ చీఫ్ సిద్దూ తీరుతోనే అక్కడ కాంగ్రెస్ ఓడిపోయిందని.. అలా ఉంటే.. ఫలితాలు ఇలాగే ఉంటాయని రేవంత్ రెడ్డికి చురకలు అటించారు. అయితే తెలంగాణలో రానున్న ఎన్నికలకు సిద్ధం కావాలని అధిష్టానం సూచిస్తుంటే.. టీకాంగ్రెస్ నాయకుల మధ్యనే సఖ్యత లేకుండా.. ప్రజల్లోకి వెళ్లి ప్రచారం ఏం నిర్వహిస్తారు.. అనే భావన రాజకీయ విశ్లేషకుల మదిలో మెదులుతోంది. చూడాలి మరి.. జగ్గారెడ్డి బస్తీమే సవాల్కు.. రేవంత్ రెడ్డికి ఏవిధంగా కౌంటర్ ఇస్తారోనని..
తాజావార్తలు
-
Spirit: స్పిరిట్ షూటింగ్’కి నెల రోజుల బ్రేక్
-
Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
-
Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
-
Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘వాటర్ బాయ్’గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!