Jaggareddy vs Revanth Reddy : జగ్గారెడ్డి సవాల్.. రేవంత్ సంగతేంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్లో ముసలం మొదలైనట్లు కనపిస్తోంది. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ లీడర్ మర్రి శశిధర్ రెడ్డి ఇంట్లో టీ కాంగ్రెస్ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశం ఒక్కసారిగా తెలంగాణ కాంగ్రెస్ దుమారం రేపింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై అసమ్మతితోనే పార్టీ సీనియర్లు సమావేశమయ్యారని వార్తలు వినిపించాయి. అయితే ఈ మీటింగ్ భట్టి లాంటి వారు స్పష్టతనిస్తూ.. అలాంటిదేమీ లేదని.. సోనియా, రాహుల్ గాంధీల సారథ్యంలోనే కాంగ్రెస్ నడిచేందుకు నిర్ణయం తీసుకున్నామని.. దానిపైనే సమావేశమయ్యామని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే.. ఈ రోజు మరోసారి సీనియర్లు సమావేశం కానున్న నేపథ్యంలో ఏఐసీసీ కార్యదర్శి బోస్రాజు సీనియర్లు ఫోన్ చేయడం.. ఈ సమావేశం నిర్వహిస్తే.. తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందని చెప్పడంతో మరోసారి కాంగ్రెస్లో రేవంత్రెడ్డిపై ఉన్న విముఖత బయటపడింది.
ఏదైనా సమస్య ఉంటే పార్టీ సమావేశాల్లో చర్చించాలని, లేకుండా సోనియా, రాహుల్ గాంధీలతో ముచ్చటించాలని బోస్రాజు హితవు పలికారు. అయితే ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి పీసీసీ రేవంత్రెడ్డిపై ఉన్న వ్యతిరేకతను బయటపెట్టారు. రేవంత్ రెడ్డికి సత్తా ఉంటే.. తన నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరుపున ఓ అభ్యర్థిని నిలబెట్టాలని, తాను ఇండిపెండెంట్గా నిలబడి గెలుస్తానని సవాల్ విసిరారు. జగ్గారెడ్డి చేసిన సవాల్ టీకాంగ్రెస్లో సీనియర్లకు జూనియర్లకు మధ్య సమస్యలు ఉన్నట్లు స్పష్టం చేస్తోంది. అయితే దీనికీ కారణం లేకపోలేదు.. ఇటీవల దేశంలో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. గత ఎన్నికల్లో పంజాబ్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈ సారి ఆ రాష్ట్రాన్ని కూడా చేజార్చుకుంది. దీంతో క్రింది స్థాయి నేత నుంచి అగ్రస్థాయి నేతలవరకు కాంగ్రెస్లో ఏం జరుగుతోందో అర్థకాలేదు.
Also Read
- Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
- Nampally Railway Station: నాంపల్లి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం.. ఏసీ కోచ్లో మంటలు..
ఈ విషయాన్ని జగ్గారెడ్డి ఉటంకిస్తూ.. పంజాబ్లో పీసీసీ చీఫ్ సిద్దూ తీరుతోనే అక్కడ కాంగ్రెస్ ఓడిపోయిందని.. అలా ఉంటే.. ఫలితాలు ఇలాగే ఉంటాయని రేవంత్ రెడ్డికి చురకలు అటించారు. అయితే తెలంగాణలో రానున్న ఎన్నికలకు సిద్ధం కావాలని అధిష్టానం సూచిస్తుంటే.. టీకాంగ్రెస్ నాయకుల మధ్యనే సఖ్యత లేకుండా.. ప్రజల్లోకి వెళ్లి ప్రచారం ఏం నిర్వహిస్తారు.. అనే భావన రాజకీయ విశ్లేషకుల మదిలో మెదులుతోంది. చూడాలి మరి.. జగ్గారెడ్డి బస్తీమే సవాల్కు.. రేవంత్ రెడ్డికి ఏవిధంగా కౌంటర్ ఇస్తారోనని..
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..