IMD Weather: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం.. తెలంగాణలో వర్షాలు..
- బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం..
- అల్పపీడన ప్రభావంతో రెండు రోజుల పాటు తెలంగాణకు వర్ష సూచన..
- పలు జిల్లాలకు తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన..
- ఖమ్మం,కొత్తగూడెం,మహబూబాబాద్, ములుగు జిలాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IMD Weather: తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రెండు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాలకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయని వెల్లడించింది. ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిలాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందిన తెలిపింది. రాష్ట్రంలో పగటిపూట పొడి వాతావరణం ఉంటుందని, సాయంత్రం చల్లగా ఉంటుందని, పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ నగరంలో వాతావరణంలో స్వల్ప మార్పులు ఉంటాయని తెలిపారు.
Read also: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నేడు విచారణకు ఆ నేత..
Also Read
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
- HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
- HYDRA Ranganath: నేను చట్టపరిధిలోనే పనిచేస్తున్నా, పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తి లేదు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
కాగా.. తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్లోని శివారు ప్రాంతాల్లో 18 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చలి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆస్తమా, దగ్గు, జలుబు ఉన్నవారు, వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లాలని, వెచ్చటి దుస్తులు ధరించాలని చెప్పారు. వేడివేడి ఆహారాన్ని తినాలని, రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.
Read also: Rajanna Sircilla Crime: సిరిసిల్లలో దారుణం.. దంపతుల అనుమానస్పద మృతి..
అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. ఈరోజు ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, బాపట్ల, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు తెలిపారు. గుంటూరు, వైఎస్ఆర్, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, శ్రీ సత్యసాయి, కడప, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వారు తెలిపారు. నెల్లూరు, కావలి పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. రైతులు తమ పంట పొలాల్లోని అదనపు నీటిని ఒడిసిపట్టేందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు.
CM Revanth Reddy: నేడు ఎల్బీ స్టేడియంలో బాలల దినోత్సవ వేడుకలు.. హాజరు కానున్న సీఎం
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!