IMD Weather: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం.. తెలంగాణలో వర్షాలు..
- బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం..
- అల్పపీడన ప్రభావంతో రెండు రోజుల పాటు తెలంగాణకు వర్ష సూచన..
- పలు జిల్లాలకు తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన..
- ఖమ్మం,కొత్తగూడెం,మహబూబాబాద్, ములుగు జిలాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IMD Weather: తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రెండు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాలకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయని వెల్లడించింది. ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిలాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందిన తెలిపింది. రాష్ట్రంలో పగటిపూట పొడి వాతావరణం ఉంటుందని, సాయంత్రం చల్లగా ఉంటుందని, పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ నగరంలో వాతావరణంలో స్వల్ప మార్పులు ఉంటాయని తెలిపారు.
Read also: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నేడు విచారణకు ఆ నేత..
Also Read
కాగా.. తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్లోని శివారు ప్రాంతాల్లో 18 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చలి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆస్తమా, దగ్గు, జలుబు ఉన్నవారు, వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లాలని, వెచ్చటి దుస్తులు ధరించాలని చెప్పారు. వేడివేడి ఆహారాన్ని తినాలని, రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.
Read also: Rajanna Sircilla Crime: సిరిసిల్లలో దారుణం.. దంపతుల అనుమానస్పద మృతి..
అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. ఈరోజు ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, బాపట్ల, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు తెలిపారు. గుంటూరు, వైఎస్ఆర్, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, శ్రీ సత్యసాయి, కడప, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వారు తెలిపారు. నెల్లూరు, కావలి పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. రైతులు తమ పంట పొలాల్లోని అదనపు నీటిని ఒడిసిపట్టేందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు.
CM Revanth Reddy: నేడు ఎల్బీ స్టేడియంలో బాలల దినోత్సవ వేడుకలు.. హాజరు కానున్న సీఎం
తాజావార్తలు
-
Pat Cummins: “అభిషేక్, ఇషాన్, క్లాసెన్ కాదు.. వాళ్ల వల్లే మ్యాచ్ గెలిచాం”.. SRH కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
TulsiGabbard: అమెరికా ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ పదవికి తులసి గబ్బార్డ్ రాజీనామా.. కారణం ఏంటంటే?
-
Mega158: ‘మెగా158’ టైటిల్పై హింట్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి?
-
Rowdy Janardhana: ‘రౌడీ జనార్దన’కి డబుల్ మ్యూజిక్ ట్రీట్..
-
Patriot: 18 ఏళ్ల తర్వాత మమ్ముట్టి – మోహన్ లాల్ కలయిక.. ‘పేట్రియాట్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!