Rajanna Sircilla Crime: సిరిసిల్లలో దారుణం.. దంపతుల అనుమానస్పద మృతి..
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో దంపతుల అనుమానస్పద మృతి..
- భార్యను కట్టేతో కొట్టి అనంతరం భర్త పురుగుల మందు తాగినట్లు అనుమానం..
- ఘటన స్థలంలో పురుగుల మందు డబ్బా కట్టెకు రక్తపు మరకలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajanna Sircilla Crime: దంపతుల అనుమానస్పద మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలకలం రేపుతుంది. జిల్లా కేంద్రంలోని శాంతి నగర్ కు చెందిన ముదాం వెంకటేష్ (40), వసంత (36) అనే భార్య భర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి కూతురు వర్షిణి, కొడుకు అజిత్ ఉన్నారు. ఏం జరిగిందో తెలియదు గానీ.. వెంకటేష్, వసంత ఇద్దరు ఓ పొలంలో శవమై తేలారు. దీంతో కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటన వద్దకు చేరుకున్న పోలీసులకు కొని ఆధారాలు లభించాయి. ఘటన స్థలంలో పురుగుల మందు డబ్బా కట్టెకు రక్తపు మరకలు గుర్తించారు. భార్య వసంతను భర్త వెంకటేష్ కట్టేతో కొట్టి చంపినట్లు అనుమానిస్తున్నారు. అనంతరం వెంకటేష్ పురుగుల మందు తాగి మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ కలహాలతోనే భార్యను చంపినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే స్థానిక, మృతుల కుటుంబాలని దర్యాప్తు చేసి అనుమానంపై క్లారిటీ ఇవ్వనున్నారు. అయితే వీరిద్దరూ పొలంలో ఎందుకు వచ్చారు? నిజంగానే భర్త వెంకటేస్ భార్య వసంతను చంపాడా? లేక ఎవరైనా వీరిని చంపి ఇలా చిత్రీకరిస్తున్నారా? అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పుడే క్లారిటీ ఇవ్వలేమని దర్యాప్తు తరువాత దీనిపై సమాచారం ఇస్తామని పోలీసులు తెలిపారు.
CM Revanth Reddy: నేడు ఎల్బీ స్టేడియంలో బాలల దినోత్సవ వేడుకలు.. హాజరు కానున్న సీఎం
Also Read
తాజావార్తలు
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
-
Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
-
Seyon: కమల్ హాసన్ నిర్మాణంలో శివకార్తికేయన్ మాస్ అవతార్
-
Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
-
IPL 2026: ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్ మారుతుందా? బీసీసీఐ, కేంద్రం ఆదేశాలపై ఉత్కంఠ!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..