Charminar Clock: 135 ఏళ్ల ఘన చరిత్ర.. చారిత్రాత్మక చార్మినార్ గడియారం ధ్వంసం..
- చార్మినార్కు మరమ్మతు పనులు..
- ఇనుప పైప్ తగిలి ధ్వంసమైన గడియారం డయల్ బోర్డు..
- ఈస్ట్ వైపు ఉన్న 135 ఏళ్ల నాటి గడియారం ధ్వంసం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Charminar Clock: నగరానికి తలమానికంగా హైదరాబాద్ నిలుస్తోంది. ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా చార్మినార్ను 1591లో కుతుబ్ షాహీ రాజవంశానికి చెందిన ఐదవ పాలకుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించారు. ఇప్పట్లో హైదరాబాద్ అంటే మనకే కాదు.. విదేశీయులు కూడా చార్మినార్ గుర్తొస్తుంది. అంతటి ఘటన చరిత్ర కలిగిన చార్మినార్ చారిత్రక కట్టడంగా గుర్తింపు పొందింది. చార్మినార్ అంటే కొందరికి షాపింగ్, అక్కడ దొరికే ముత్యాలు గుర్తుకు తెస్తుంది. రాత్రిపూట చార్మినార్ అందాలను చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతారు. వారాంతాల్లో చార్మినార్ అందాలను చూసేందుకు, షాపింగ్ చేసేందుకు చాలా మంది వస్తారు. రంజాన్ మాసంలో చార్మినార్ రద్దీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇసుక వేస్తే రాలనంత జనం పోటెత్తుతారు. ఇక మన దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా చార్మినార్ చారిత్రక కట్టడంగా గుర్తింపు పొందింది. వందల ఏళ్ల చరిత్ర ఉన్న చార్మినార్కే కాదు, దానిపై ఉన్న గడియారాలకు కూడా గొప్ప చరిత్ర ఉంది.
Read also: Manu Bhaker: పారిస్ ఒలింపిక్స్ 2024.. చరిత్రకు అడుగు దూరంలో మను బాకర్!
Also Read
- Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
- TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
- Kishan Reddy : జీవో 97పై బీజేపీ ఫైర్.. విద్యార్థులకు అండగా కిషన్ రెడ్డి.!
- Government Action : వనపర్తిలో బుల్డోజర్ యాక్షన్.. రూ.52 కోట్ల బకాయిలపై ఉక్కుపాదం
అయితే చార్మినార్ను 1591లో కుతుబ్ షాహీ రాజవంశానికి చెందిన ఐదవ పాలకుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించాగా.. దానికి 1889లో చార్మినార్కు నాలుగు వైపులా గడియారాలను ఏర్పాటు చేశారు. 135 ఏళ్ల చరిత్ర ఉన్న గడియారం డయల్ బోర్డు ధ్వంసం అయ్యింది. చార్మినార్ మరమ్మతు పనుల్లో ఇనుప పైప్ తగిలి గడియారం ధ్వంసమైనట్లు తెలుస్తోంది. అయితే గడియారం పాక్షికంగా ధ్వంసం కావడంతో ఇప్పటికీ పనిచేస్తుంది. మరి, 135 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన గడియారాన్ని మరిచిపోయి కొత్తది ఏర్పాటు చేస్తారా.. లేక మరమ్మతులు చేస్తారో వేచి చూడాల్సిందే. కాగా.. చార్మినార్ పనులు పూర్తయిన మరుసటి సంవత్సరం 1592లో చార్మినార్కు నాలుగు వైపులా తోరణాలు నిర్మించారు. చార్మినార్ కమాన్, కాళీ కమాన్, మచిలీ కమాన్, షేర్ ఇ బతుల్ అనే పేర్లతో ఉన్న ఈ తోరణాలు 60 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో ఇడో-పర్షియన్ శైలిలో నిర్మించబడ్డాయి. ఇది పురావస్తు నిర్మాణ నిధిగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాచే తయారు చేయబడిన అధికారిక భవనాల జాబితాలో చేరింది. చార్మినార్ ప్రాంతానికి ఈశాన్యంలో, లాడ్ బజార్, పశ్చిమాన గ్రానైట్తో నిర్మించిన మక్కా మసీదు కూడా నిర్మించారు.
Telangana Assembly 2024: కేసీఆర్ రికార్డ్ బ్రేక్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి..
తాజావార్తలు
-
Sonal Dinusha: టీమిండియాపై సెంచరీలు.. ఆ కిక్కే వేరప్పా.. గాల్లో తేలిపోతున్న శ్రీలంక హీరో!
-
Tollywood : టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ నెక్ట్స్ లైనప్ సినిమాలు ఇవే
-
I Am Game: దుల్కర్ సల్మాన్ స్వయంగా పాడిన ‘లూజర్’ సాంగ్.. అభిమానులకు అదిరిపోయే స్టైలిష్ ట్రీట్
-
ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
-
RAM 23 : రామ్ పోతినేని సినిమా టైటిల్ ఇదే.. మాస్ ఆడియన్స్కు కనెక్ట్ అవుతుందా?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!