Charminar Clock: 135 ఏళ్ల ఘన చరిత్ర.. చారిత్రాత్మక చార్మినార్ గడియారం ధ్వంసం..
- చార్మినార్కు మరమ్మతు పనులు..
- ఇనుప పైప్ తగిలి ధ్వంసమైన గడియారం డయల్ బోర్డు..
- ఈస్ట్ వైపు ఉన్న 135 ఏళ్ల నాటి గడియారం ధ్వంసం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Charminar Clock: నగరానికి తలమానికంగా హైదరాబాద్ నిలుస్తోంది. ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా చార్మినార్ను 1591లో కుతుబ్ షాహీ రాజవంశానికి చెందిన ఐదవ పాలకుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించారు. ఇప్పట్లో హైదరాబాద్ అంటే మనకే కాదు.. విదేశీయులు కూడా చార్మినార్ గుర్తొస్తుంది. అంతటి ఘటన చరిత్ర కలిగిన చార్మినార్ చారిత్రక కట్టడంగా గుర్తింపు పొందింది. చార్మినార్ అంటే కొందరికి షాపింగ్, అక్కడ దొరికే ముత్యాలు గుర్తుకు తెస్తుంది. రాత్రిపూట చార్మినార్ అందాలను చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతారు. వారాంతాల్లో చార్మినార్ అందాలను చూసేందుకు, షాపింగ్ చేసేందుకు చాలా మంది వస్తారు. రంజాన్ మాసంలో చార్మినార్ రద్దీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇసుక వేస్తే రాలనంత జనం పోటెత్తుతారు. ఇక మన దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా చార్మినార్ చారిత్రక కట్టడంగా గుర్తింపు పొందింది. వందల ఏళ్ల చరిత్ర ఉన్న చార్మినార్కే కాదు, దానిపై ఉన్న గడియారాలకు కూడా గొప్ప చరిత్ర ఉంది.
Read also: Manu Bhaker: పారిస్ ఒలింపిక్స్ 2024.. చరిత్రకు అడుగు దూరంలో మను బాకర్!
Also Read
- Cyber Fraud: తెలుగు అమ్మాయిలతో సైబర్ వల.. ఢిల్లీ ముఠా దందా బట్టబయలు
- Varuna Yagam : ముగిసిన వరుణయాగం.. పాల్గొన్న సీఎం రేవంత్ దంపతులు
- Palamuru Rangareddy Project: పాలమూరుకు కేంద్రం షాక్.. జాతీయ హోదాపై క్లారిటీ.!
- Tragedy: నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం.. రాంగ్ రూట్లో దూసుకొచ్చిన కారు, ఆర్మీ జవాన్ మృతి
అయితే చార్మినార్ను 1591లో కుతుబ్ షాహీ రాజవంశానికి చెందిన ఐదవ పాలకుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించాగా.. దానికి 1889లో చార్మినార్కు నాలుగు వైపులా గడియారాలను ఏర్పాటు చేశారు. 135 ఏళ్ల చరిత్ర ఉన్న గడియారం డయల్ బోర్డు ధ్వంసం అయ్యింది. చార్మినార్ మరమ్మతు పనుల్లో ఇనుప పైప్ తగిలి గడియారం ధ్వంసమైనట్లు తెలుస్తోంది. అయితే గడియారం పాక్షికంగా ధ్వంసం కావడంతో ఇప్పటికీ పనిచేస్తుంది. మరి, 135 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన గడియారాన్ని మరిచిపోయి కొత్తది ఏర్పాటు చేస్తారా.. లేక మరమ్మతులు చేస్తారో వేచి చూడాల్సిందే. కాగా.. చార్మినార్ పనులు పూర్తయిన మరుసటి సంవత్సరం 1592లో చార్మినార్కు నాలుగు వైపులా తోరణాలు నిర్మించారు. చార్మినార్ కమాన్, కాళీ కమాన్, మచిలీ కమాన్, షేర్ ఇ బతుల్ అనే పేర్లతో ఉన్న ఈ తోరణాలు 60 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో ఇడో-పర్షియన్ శైలిలో నిర్మించబడ్డాయి. ఇది పురావస్తు నిర్మాణ నిధిగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాచే తయారు చేయబడిన అధికారిక భవనాల జాబితాలో చేరింది. చార్మినార్ ప్రాంతానికి ఈశాన్యంలో, లాడ్ బజార్, పశ్చిమాన గ్రానైట్తో నిర్మించిన మక్కా మసీదు కూడా నిర్మించారు.
Telangana Assembly 2024: కేసీఆర్ రికార్డ్ బ్రేక్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి..
తాజావార్తలు
-
JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
-
KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
-
Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
-
Cyber Fraud: తెలుగు అమ్మాయిలతో సైబర్ వల.. ఢిల్లీ ముఠా దందా బట్టబయలు
-
Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!