Hyderabad Crime: కన్న తల్లిని రోడ్డుపై వదిలేసిన కొడుకు.. ఆకలి తట్టుకోలేక తల్లి మృతి..
- కన్న తల్లి ని రోడ్డు పై వదిలి వెళ్ళిపోయిన కొడుకు..
- కోడుకు కోసం ఎదురుచూసి అనారోగ్యనికి గురై మృతి చెందిన తల్లి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Crime: నవమాసాలు మోసి, కని, పెంచిన అమ్మను నమ్మించి నడిరోడ్డుపై వదిలేశాడు ఓ కొడుకు. తన కొడుకు వస్తాడని.. తీసుకుని వెళతాడని తన కన్నపేగుకోసం రెండు రోజులు ఎదురుచూసింది తల్లికి నిరాశే మిగిలింది. ఆ రెండు రోజులు తిండిలేక ఆకలితో అలమటించింది. స్థానిక సమాచారంతో ఆపస్మారక స్థితిలో ఉన్న శ్యామలను గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు. కన్నకొడుకును చూడాలనే ఆశతోనే ప్రాణాలు వదిలింది. మానవత్వం మంటగలిసిన ఈ ఘటన సికింద్రాబాద్ లోని బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
Read also: Telangana Assembly 2024 LIVE UPDATES: తెలంగాణ అసెంబ్లీ 2024.. లైవ్ అప్డేట్స్
Also Read
- Telangana Sports : గాయత్రి-త్రిసాకు సీఎం రేవంత్ అభినందనలు.. గోపీచంద్తో స్పెషల్ మీట్
- Hyderabad Pan Masala Raid: హైదరాబాద్లో పాన్ మసాలా దందా.. రూ.160 కోట్ల స్కామ్..
- Kishan Reddy: రేవంత్ అమెరికా టూర్ రద్దు.. కిషన్ రెడ్డి కౌంటర్..!
- Telangana Congress : కాంగ్రెస్లో బిగ్ షాక్.. కొండా సురేఖ, చిన్నారెడ్డికి ఎసరు.?
మేడ్చల్ చేపల మార్కెట్ వద్ద నివాసం ఉంటున్న అరవింద్ కన్న తల్లి శ్యామల(60) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఈ నెల 5వ తేదీన అరవింద్ తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్తానని చెప్పి ఇంటి నుంచి తీసుకొచ్చి బోయినపల్లి చెక్ పోస్ట్ వద్ద ఉన్న ఎంఎంఆర్ గార్డెన్ వద్ద ఫుట్ పాత్ పై వదిలేసి మళ్లీ వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. కానీ రెండు రోజులు గడిచినా తిరిగి రాలేదు. దీంతో ఆకలితో అలమటిస్తున్న తల్లి అస్వస్థతకు గురై అపస్మారక స్థితికి చేరుకుంది. స్థానికుల సమాచారం మేరకు బోయినపల్లి పోలీసులు ఇన్ స్పెక్టర్ లక్ష్మీనారాయణరెడ్డి, ఎస్ ఐ శివశంకర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 108 అంబులెన్స్తో నల్లాలను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. శ్యామల నుంచి పోలీసులు వివరాలు సేకరించారు.
Read also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
కొడుకుని చూడాలని శ్యామల కొడుకు కోసం ఎదురుచూస్తున్నానని తెలిపడంతో.. పోలీసులు అతడి ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తుండగా ఇంతలోనే ఆమె కన్ను మూసింది. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. కానీ మృతురాలు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ లో దర్యాప్తు చేసిన ఆమె కుమారుడు అరవింద్ ఆచూకీ లభించలేదు. బోయినపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచినట్లు వెల్లడించారు. శ్యామల వివరాలు తెలిసిన వారు ఎవరైన తన కొడుకును తీసుకుని రావాలని చివరి చూపైన తల్లిని చూడాలని కోరారు. శ్యామల కుటుంబ సభ్యులు ఎవరైనా వుంటే వాఉ బోయిన్పల్లి పోలీసులను సంప్రదించాలని ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణరెడ్డి వెల్లడించారు.
Parliament Sessions: రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు! రికార్డు నుంచి తొలగింపు
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!