CM Revanth Reddy: నేడు నల్గొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..
- నల్లగొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..
- పలు అభివృద్ధి పనులకు, ప్రాజెక్టులు, శంకుస్థాపనలు చేయనున్నారు..
- మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు..
CM Revanth Reddy: నల్లగొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పలు ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట నుంచి చాపర్ ద్వారా నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంలకు చేరుకోనున్నారు.నార్కట్పల్లి మండలం బ్రాహ్మణవెల్లంలో ఉదయసముద్రం ఎత్తిపోతల పథకాన్ని మధ్యాహ్నం 2.40 గంటలకు సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు.
Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
- Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
- Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
లక్ష ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టులో భాగంగా.. అప్రోచ్ కెనాల్, టన్నెల్, సర్జ్ పూల్, పంప్ హౌస్, మోటార్ల, రిజర్వాయర్ నిర్మాణాల ట్రయల్ రన్ అనంతరం రిజర్వాయర్లోకి నీటి ఎత్తిపోతకు సంబంధించిన పైలాన్ను రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం 3.15 గంటలకు మిర్యాలగూడ నియోజకవర్గంలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల యాదాద్రి థర్మల్ ప్లాంట్లో ప్రాజెక్ట్ యూనిట్ –2ను ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 4.30 గంటలకు నల్లగొండ మెడికల్ కాలేజీ భవన్నాన్ని సీఎం ప్రారంభించి, మెడికల్ కాలేజ్ ప్రాంగణంలోని బహిరంగసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు.
Read also: Canada: కెనడాలో భారతీయ విద్యార్థి దారుణ హత్య..
ముఖ్యమంత్రి రేవంత రెడ్డి పర్యటన నేపథ్యంలో చేపట్టిన ఏర్పాట్లను మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, పొన్నం ప్రభాకర్లు పరిశీలించి అధికారులతో సమీక్షించారు. దామరచర్ల మండలంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను ఉత్తమ్, తుమ్మల, పొన్నం సందర్శించారు. నార్కట్పల్లి మండలం బ్రాహ్మణవెల్లెంలలో ముఖ్యమంత్రి ప్రారంభించనున్న పైలాన్, రిజర్వాయర్ను మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, పొన్నం పరిశీలించారు. నల్గొండలోని మెడికల్ కళాశాల, సభా ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పార్టీలకు అతీతంగా ప్రజలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.
SDT 18 : శరవేగంగా ఎస్ డీటీ18 షూటింగ్.. టైటిల్, గ్లింప్స్ కు ముహూర్తం ఫిక్స్
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!