CM Revanth Reddy: రైతులకు గుడ్న్యూస్.. రేపటి నుంచే రైతు భరోసా..
- రైతును రాజుగా చేయడమే కాదు.. వ్యవసాయాన్ని పండగా చేస్తాం..
- రైతుల ఆశీర్వాదం ఉంటేనే పాలకుల కుర్చీలు పదిలంగా ఉంటాయి..
- వరి వేస్తే ఉరేసుకోవాల్సిందే అని గత ప్రభుత్వాధినేత చెప్పారు..
- రూ. 17 వేల కోట్లు మాత్రమే గత ప్రభుత్వం మాఫీ చేసింది: సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా నిధులను జమ చేస్తామని తెలిపారు. ఎన్ని ఎకరాలున్నా రైతులందరికీ రైతు భరోసాను అందజేస్తామని ప్రకటించారు. 9 రోజుల్లోనే రైతులందరి అకౌంట్లలోకి రైతు భరోసా నగదు పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక, రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో రైతును రాజును.. వ్యవసాయాన్నీ పండగ చేయాలనేది మా ఆలోచన అన్నారు. రైతుల ఆశీర్వాదం లేకుంటే.. అధికార పీఠం మీద కూర్చోలేరు అని తేల్చి చెప్పారు. శాసన సభ అయిన.. వార్డు మెంబరుగా గెలవాలన్నా రైతుల మద్దతు అవసరం అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Kishan Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు నష్టం.. కేంద్రమంత్రి షాకింగ్ కామెంట్స్..!
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
- విద్యార్థులకు గుడ్న్యూస్.. విడుదలైన TG PGECET 2026 ఫలితాలు.!
- Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
అయితే, తెలంగాణలో పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళు.. ఇప్పుడు మమ్మల్ని నిందిస్తున్నారు అని సీఎం రేవంత్ మండిపడ్డారు. రైతుల పేరుతో వీధి నాటకాలాడుతున్నారు.. లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని నాలుగు విడతలు చేశారు.. అప్పు కంటే వడ్డీ ఎక్కువైంది అని ఆరోపించారు. రెండో సారి అధికారంలోకి వచ్చి.. కూడా రైతులను మోసమే చేశారు.. మా ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నా.. మేము అధికారంలోకి రాగానే రుణమాఫీ చేశాం అని పేర్కొన్నారు. పదేళ్లు ఆర్థిక విధ్వంసం చేసినా.. మేము ధైర్యంగా పని చేస్తున్నాన్నారు. ఇక, మేము సత్రం నడపడం లేదు.. వరి కొనమని గతంలో కేసీఆర్ చెప్పాడు.. రూ. 7 వేల కోట్లు నష్టం వచ్చింది కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయం అని చెప్పాడు.. అవన్నీ మర్చిపోయామా?.. కానీ, మేము ముందుకు వచ్చి కొనుగోలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు.
Read Also: Mega-Anil Movie : మెగా-అనిల్ మూవీలో రేపటి నుంచే నయన్ జాయిన్..
ఇక, సన్నబియ్యం పేదలకు ఇద్దాం అని చెప్పి.. సన్న వడ్లు పండిస్తే బోనస్ ఇస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. మీరు పండించిన 60 శాతం వడ్లు కొన్నాం.. రైతులు పండించిన సన్న వడ్లతో పేదల అందరూ సన్న బియ్యం తింటున్నారు.. మీకు బోనస్ ఇచ్చి ధైర్యంగా కొన్నామని పేర్కొన్నారు. అయితే, సర్పంచ్ పెండింగ్ బిల్లుల ఇవ్వలేనిది కేసీఆర్.. నేను వచ్చే నాటికి సర్పంచులు లేరు అన్నారు. 8 లక్షల 29 కోట్లు అప్పు తెచ్చాడు కేసీఆర్.. ఇన్ని అప్పులు చేసి.. రోడ్లెక్కి మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు. గత ప్రభుత్వం వాయిదా పద్దతిలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే వాళ్ళు.. నేను వచ్చాకా మొదటి తేదీ జీతాలు వేస్తున్నాను అని సీఎం వెల్లడించారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!