CM Revanth Reddy: రైతులకు గుడ్న్యూస్.. రేపటి నుంచే రైతు భరోసా..
- రైతును రాజుగా చేయడమే కాదు.. వ్యవసాయాన్ని పండగా చేస్తాం..
- రైతుల ఆశీర్వాదం ఉంటేనే పాలకుల కుర్చీలు పదిలంగా ఉంటాయి..
- వరి వేస్తే ఉరేసుకోవాల్సిందే అని గత ప్రభుత్వాధినేత చెప్పారు..
- రూ. 17 వేల కోట్లు మాత్రమే గత ప్రభుత్వం మాఫీ చేసింది: సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా నిధులను జమ చేస్తామని తెలిపారు. ఎన్ని ఎకరాలున్నా రైతులందరికీ రైతు భరోసాను అందజేస్తామని ప్రకటించారు. 9 రోజుల్లోనే రైతులందరి అకౌంట్లలోకి రైతు భరోసా నగదు పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక, రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో రైతును రాజును.. వ్యవసాయాన్నీ పండగ చేయాలనేది మా ఆలోచన అన్నారు. రైతుల ఆశీర్వాదం లేకుంటే.. అధికార పీఠం మీద కూర్చోలేరు అని తేల్చి చెప్పారు. శాసన సభ అయిన.. వార్డు మెంబరుగా గెలవాలన్నా రైతుల మద్దతు అవసరం అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Kishan Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు నష్టం.. కేంద్రమంత్రి షాకింగ్ కామెంట్స్..!
Also Read
- Bhatti Vikramarka: సింగరేణి 128 మంది ఉద్యోగుల భవితవ్యంపై నిర్ణయం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన.!
- Lemon Prices Surge in Hyderabad: నిమ్మకాయ ధరలకు రెక్కలు.. చికెన్తో పోటీ పడుతున్న ధరలు
- Uttam Kumar Reddy: పాదయాత్ర అంటే జనాలు నవ్వుతారు.. కేసీఆర్పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు.!
- MLAs Arrested: పబ్లిక్ గార్డెన్స్ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్..!
అయితే, తెలంగాణలో పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళు.. ఇప్పుడు మమ్మల్ని నిందిస్తున్నారు అని సీఎం రేవంత్ మండిపడ్డారు. రైతుల పేరుతో వీధి నాటకాలాడుతున్నారు.. లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని నాలుగు విడతలు చేశారు.. అప్పు కంటే వడ్డీ ఎక్కువైంది అని ఆరోపించారు. రెండో సారి అధికారంలోకి వచ్చి.. కూడా రైతులను మోసమే చేశారు.. మా ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నా.. మేము అధికారంలోకి రాగానే రుణమాఫీ చేశాం అని పేర్కొన్నారు. పదేళ్లు ఆర్థిక విధ్వంసం చేసినా.. మేము ధైర్యంగా పని చేస్తున్నాన్నారు. ఇక, మేము సత్రం నడపడం లేదు.. వరి కొనమని గతంలో కేసీఆర్ చెప్పాడు.. రూ. 7 వేల కోట్లు నష్టం వచ్చింది కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయం అని చెప్పాడు.. అవన్నీ మర్చిపోయామా?.. కానీ, మేము ముందుకు వచ్చి కొనుగోలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు.
Read Also: Mega-Anil Movie : మెగా-అనిల్ మూవీలో రేపటి నుంచే నయన్ జాయిన్..
ఇక, సన్నబియ్యం పేదలకు ఇద్దాం అని చెప్పి.. సన్న వడ్లు పండిస్తే బోనస్ ఇస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. మీరు పండించిన 60 శాతం వడ్లు కొన్నాం.. రైతులు పండించిన సన్న వడ్లతో పేదల అందరూ సన్న బియ్యం తింటున్నారు.. మీకు బోనస్ ఇచ్చి ధైర్యంగా కొన్నామని పేర్కొన్నారు. అయితే, సర్పంచ్ పెండింగ్ బిల్లుల ఇవ్వలేనిది కేసీఆర్.. నేను వచ్చే నాటికి సర్పంచులు లేరు అన్నారు. 8 లక్షల 29 కోట్లు అప్పు తెచ్చాడు కేసీఆర్.. ఇన్ని అప్పులు చేసి.. రోడ్లెక్కి మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు. గత ప్రభుత్వం వాయిదా పద్దతిలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే వాళ్ళు.. నేను వచ్చాకా మొదటి తేదీ జీతాలు వేస్తున్నాను అని సీఎం వెల్లడించారు.
తాజావార్తలు
-
Shaque: అనుమానాలతో పిచ్చెక్కించడానికి వస్తున్న పరిణీతి చోప్రా మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
Best Scooters for Women: మహిళలకు బెస్ట్ స్కూటర్లు ఇవే.. స్టైలిష్ లుక్, మంచి మైలేజ్తో అదిరిపోయే మోడల్స్!
-
Bhatti Vikramarka: సింగరేణి 128 మంది ఉద్యోగుల భవితవ్యంపై నిర్ణయం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన.!
-
JrNTR : ఆదర్శకుటుంబానికి తోడుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్
-
Asia Cup 2026: జిత్తులమారి వస్తున్నాడు.. టీమిండియాకు మరోసారి ట్రోఫీ వివాదం తప్పదా?
ట్రెండింగ్
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!