CM Revanth Reddy: రైతులకు గుడ్న్యూస్.. రేపటి నుంచే రైతు భరోసా..
- రైతును రాజుగా చేయడమే కాదు.. వ్యవసాయాన్ని పండగా చేస్తాం..
- రైతుల ఆశీర్వాదం ఉంటేనే పాలకుల కుర్చీలు పదిలంగా ఉంటాయి..
- వరి వేస్తే ఉరేసుకోవాల్సిందే అని గత ప్రభుత్వాధినేత చెప్పారు..
- రూ. 17 వేల కోట్లు మాత్రమే గత ప్రభుత్వం మాఫీ చేసింది: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా నిధులను జమ చేస్తామని తెలిపారు. ఎన్ని ఎకరాలున్నా రైతులందరికీ రైతు భరోసాను అందజేస్తామని ప్రకటించారు. 9 రోజుల్లోనే రైతులందరి అకౌంట్లలోకి రైతు భరోసా నగదు పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక, రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో రైతును రాజును.. వ్యవసాయాన్నీ పండగ చేయాలనేది మా ఆలోచన అన్నారు. రైతుల ఆశీర్వాదం లేకుంటే.. అధికార పీఠం మీద కూర్చోలేరు అని తేల్చి చెప్పారు. శాసన సభ అయిన.. వార్డు మెంబరుగా గెలవాలన్నా రైతుల మద్దతు అవసరం అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Kishan Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు నష్టం.. కేంద్రమంత్రి షాకింగ్ కామెంట్స్..!
Also Read
అయితే, తెలంగాణలో పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళు.. ఇప్పుడు మమ్మల్ని నిందిస్తున్నారు అని సీఎం రేవంత్ మండిపడ్డారు. రైతుల పేరుతో వీధి నాటకాలాడుతున్నారు.. లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని నాలుగు విడతలు చేశారు.. అప్పు కంటే వడ్డీ ఎక్కువైంది అని ఆరోపించారు. రెండో సారి అధికారంలోకి వచ్చి.. కూడా రైతులను మోసమే చేశారు.. మా ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నా.. మేము అధికారంలోకి రాగానే రుణమాఫీ చేశాం అని పేర్కొన్నారు. పదేళ్లు ఆర్థిక విధ్వంసం చేసినా.. మేము ధైర్యంగా పని చేస్తున్నాన్నారు. ఇక, మేము సత్రం నడపడం లేదు.. వరి కొనమని గతంలో కేసీఆర్ చెప్పాడు.. రూ. 7 వేల కోట్లు నష్టం వచ్చింది కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయం అని చెప్పాడు.. అవన్నీ మర్చిపోయామా?.. కానీ, మేము ముందుకు వచ్చి కొనుగోలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు.
Read Also: Mega-Anil Movie : మెగా-అనిల్ మూవీలో రేపటి నుంచే నయన్ జాయిన్..
ఇక, సన్నబియ్యం పేదలకు ఇద్దాం అని చెప్పి.. సన్న వడ్లు పండిస్తే బోనస్ ఇస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. మీరు పండించిన 60 శాతం వడ్లు కొన్నాం.. రైతులు పండించిన సన్న వడ్లతో పేదల అందరూ సన్న బియ్యం తింటున్నారు.. మీకు బోనస్ ఇచ్చి ధైర్యంగా కొన్నామని పేర్కొన్నారు. అయితే, సర్పంచ్ పెండింగ్ బిల్లుల ఇవ్వలేనిది కేసీఆర్.. నేను వచ్చే నాటికి సర్పంచులు లేరు అన్నారు. 8 లక్షల 29 కోట్లు అప్పు తెచ్చాడు కేసీఆర్.. ఇన్ని అప్పులు చేసి.. రోడ్లెక్కి మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు. గత ప్రభుత్వం వాయిదా పద్దతిలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే వాళ్ళు.. నేను వచ్చాకా మొదటి తేదీ జీతాలు వేస్తున్నాను అని సీఎం వెల్లడించారు.
తాజావార్తలు
-
West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో