Charlapally Terminal: కాసేపట్లో చర్లపల్లి టెర్మినల్ ప్రారంభం.. పాల్గొన్న ముఖ్య నేతలు
- మరికాసేపట్లో చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవం
- ఢిల్లీ నుంచి 12:30 నిమిషాలకు మోడీ వర్చువల్ గా ప్రారంభం
- వర్చువల్ గా హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి
- హాజరైన కిషన్ రెడ్డి, బండి సంజయ్, సోమన్న, ఈటల, పలువురు ప్రజా ప్రతి నిధులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరికాసేపట్లో చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవం జరుగనుంది. ఢిల్లీ నుంచి 12:30 నిమిషాలకు మోడీ వర్చువల్గా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్గా హాజరు కానున్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రులు బండి సంజయ్, సోమన్న, ఎంపీ ఈటల రాజేందర్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,పలువురు ప్రజా ప్రతి నిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. మోదీ గొప్ప మనసుతో రూ.400 కోట్లకు పైగా ఖర్చు చేసి టెర్మినల్ నిర్మించారని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో రైల్వే స్టేషన్లలో దుర్గంధంతో ఉండేవి.. ఇప్పుడు ప్రపంచంతో పోటీ పడేలా రైల్వే స్టేషన్లను నిర్మిస్తున్నారని అన్నారు. రైల్వే స్టేషన్లను ఎయిర్పోర్టులను తలపించేలా నిర్మిస్తున్నారని చెప్పారు.
చర్లపల్లి పారిశ్రామిక వాడకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఈటల పేర్కొన్నారు.
Stella Ship: ఎట్టకేలకు కాకినాడ నుంచి బయల్దేరిన స్టెల్లా ఎల్ షిప్!
Also Read
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
- CM Revanth Reddy : సీఎం రేవంత్ బిగ్ ప్లాన్.. స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి మేకోవర్.!
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. కొత్త టెర్మినల్ను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం మనం అందరం కోరాం.. కానీ గత ప్రభుత్వం సంకల్పం చేసిందో లేదో గాని, శాసన సభ్యులు అనేకమంది ప్రయత్నం చేశారన్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్కి అప్రోచ్ రోడ్డు, విమానాశ్రయం రోడ్లు లాగా అప్రోచ్ రోడ్డు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ అప్రోచ్ రోడ్డు కోసం కేంద్ర నిధుల నుంచి సహాయం అందజేయాలని తమ ప్రభుత్వం కూడా కోరుతోందన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. ఎన్డీఏ రాకముందే రైల్వే స్టేషన్లు ఎలా ఉండేవి.. ఇప్పుడు ఎలా ఉన్నాయో చూస్తున్నామన్నారు. ఒక ప్రణాళికా బద్ధంగా మూడు రంగాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రైల్వే, రోడ్డు, విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. 32 వేల కోట్ల రూపాయలు రైల్వే అభివృద్ధి కోసం కేంద్రం నిధులు విడుదల చేసిందని పేర్కొన్నారు. 2 వేల కోట్లతో అమృత్ స్కీం కింద రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రూ. 430 కోట్లతో ఆత్యాధునిక టెర్మినల్ను అభివృద్ధి చేశామని తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి పని చేసుకోవాలి.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని బండి సంజయ్ తెలిపారు.
China Virus: బెంగళూరులోనే రెండు కేసులు.. HMPV వైరస్గా నిర్ధారణ
కేంద్ర సహాయ మంత్రి సోమన్న మాట్లాడుతూ.. రైల్వే టెర్మినల్ను ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు రైల్వే అభివృద్ధికి ఖర్చు చేస్తోందని తెలిపారు. అమృత్ భారత్ స్కీం కింద అనేక రైల్వే స్టేషన్లను రీ డెవలప్మెంట్ చేశాం.. చర్లపల్లి రైల్వే టెర్మినల్ 4Th టెర్మినల్గా అభివృద్ధి చేశామన్నారు. ఈ కొత్త టెర్మినల్ రావడంతో హైదరాబాద్లో చాలా వరకు నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తప్పుతాయని చెప్పారు. న్యూ ట్రైన్స్ త్వరలో ప్రారంభం అవుతాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకు విజ్ఞప్తి.. అప్రోచ్ రోడ్డు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత.. ఇది గమనించాలని చెప్పారు. కేంద్రం, రాష్ట్రం కలిసి రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాల్సి ఉంటుందన్నారు. మోడీ స్వప్నం.. రైల్వే అభివృద్ధి చేయాలని అన్నారు.
తాజావార్తలు
-
Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
-
Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
-
Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
-
Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
-
Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?