Charlapally Terminal: కాసేపట్లో చర్లపల్లి టెర్మినల్ ప్రారంభం.. పాల్గొన్న ముఖ్య నేతలు
- మరికాసేపట్లో చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవం
- ఢిల్లీ నుంచి 12:30 నిమిషాలకు మోడీ వర్చువల్ గా ప్రారంభం
- వర్చువల్ గా హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి
- హాజరైన కిషన్ రెడ్డి, బండి సంజయ్, సోమన్న, ఈటల, పలువురు ప్రజా ప్రతి నిధులు.
మరికాసేపట్లో చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవం జరుగనుంది. ఢిల్లీ నుంచి 12:30 నిమిషాలకు మోడీ వర్చువల్గా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్గా హాజరు కానున్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రులు బండి సంజయ్, సోమన్న, ఎంపీ ఈటల రాజేందర్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,పలువురు ప్రజా ప్రతి నిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. మోదీ గొప్ప మనసుతో రూ.400 కోట్లకు పైగా ఖర్చు చేసి టెర్మినల్ నిర్మించారని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో రైల్వే స్టేషన్లలో దుర్గంధంతో ఉండేవి.. ఇప్పుడు ప్రపంచంతో పోటీ పడేలా రైల్వే స్టేషన్లను నిర్మిస్తున్నారని అన్నారు. రైల్వే స్టేషన్లను ఎయిర్పోర్టులను తలపించేలా నిర్మిస్తున్నారని చెప్పారు.
చర్లపల్లి పారిశ్రామిక వాడకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఈటల పేర్కొన్నారు.
Stella Ship: ఎట్టకేలకు కాకినాడ నుంచి బయల్దేరిన స్టెల్లా ఎల్ షిప్!
Also Read
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
- Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
- CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. కొత్త టెర్మినల్ను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం మనం అందరం కోరాం.. కానీ గత ప్రభుత్వం సంకల్పం చేసిందో లేదో గాని, శాసన సభ్యులు అనేకమంది ప్రయత్నం చేశారన్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్కి అప్రోచ్ రోడ్డు, విమానాశ్రయం రోడ్లు లాగా అప్రోచ్ రోడ్డు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ అప్రోచ్ రోడ్డు కోసం కేంద్ర నిధుల నుంచి సహాయం అందజేయాలని తమ ప్రభుత్వం కూడా కోరుతోందన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. ఎన్డీఏ రాకముందే రైల్వే స్టేషన్లు ఎలా ఉండేవి.. ఇప్పుడు ఎలా ఉన్నాయో చూస్తున్నామన్నారు. ఒక ప్రణాళికా బద్ధంగా మూడు రంగాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రైల్వే, రోడ్డు, విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. 32 వేల కోట్ల రూపాయలు రైల్వే అభివృద్ధి కోసం కేంద్రం నిధులు విడుదల చేసిందని పేర్కొన్నారు. 2 వేల కోట్లతో అమృత్ స్కీం కింద రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రూ. 430 కోట్లతో ఆత్యాధునిక టెర్మినల్ను అభివృద్ధి చేశామని తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి పని చేసుకోవాలి.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని బండి సంజయ్ తెలిపారు.
China Virus: బెంగళూరులోనే రెండు కేసులు.. HMPV వైరస్గా నిర్ధారణ
కేంద్ర సహాయ మంత్రి సోమన్న మాట్లాడుతూ.. రైల్వే టెర్మినల్ను ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు రైల్వే అభివృద్ధికి ఖర్చు చేస్తోందని తెలిపారు. అమృత్ భారత్ స్కీం కింద అనేక రైల్వే స్టేషన్లను రీ డెవలప్మెంట్ చేశాం.. చర్లపల్లి రైల్వే టెర్మినల్ 4Th టెర్మినల్గా అభివృద్ధి చేశామన్నారు. ఈ కొత్త టెర్మినల్ రావడంతో హైదరాబాద్లో చాలా వరకు నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తప్పుతాయని చెప్పారు. న్యూ ట్రైన్స్ త్వరలో ప్రారంభం అవుతాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకు విజ్ఞప్తి.. అప్రోచ్ రోడ్డు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత.. ఇది గమనించాలని చెప్పారు. కేంద్రం, రాష్ట్రం కలిసి రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాల్సి ఉంటుందన్నారు. మోడీ స్వప్నం.. రైల్వే అభివృద్ధి చేయాలని అన్నారు.
తాజావార్తలు
-
Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి ‘ఫస్ట్’కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
-
Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
-
AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!