China Virus: బెంగళూరులోనే రెండు కేసులు.. HMPV వైరస్గా నిర్ధారణ
- బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు హెచ్ ఎంపీవీ వైరస్..
- వైరస్ సోకినట్లు ధ్రువీకరించిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China Virus: చైనాలో కలకలం రేపుతున్న హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ (HMPV) కేసులు భారత్లో రెండు నమోదయ్యాయి. బెంగళూరుకు చెందిన ఓ ఆస్పత్రిలో మూడు, ఎనిమిది నెలల చిన్నారుల్లో ఈ వైరస్ ఉన్నట్లు గుర్తించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) దృవీకరించింది. అయితే, వీరిలో ఒక చిన్నారికి వైరస్ తగ్గుముఖం పట్టగా.. మరొకరికి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. భారత్లో చైనా వైరస్ వ్యాప్తిపై పూర్తి స్థాయిలో ఆరా తీసుకున్నారు.
Read Also: Dil Raju : తెలంగాణలో ‘గేమ్ ఛేంజర్’ టికెట్ రేట్స్ పై దిల్ రాజు ప్రెస్ మీట్
Also Read
అయితే, హెచ్ఎంపీవీ వైరస్ బారిన పడిన ఇద్దరు చిన్నారులకు అంతర్జాతీయ ప్రయాణాలు చేసిన హస్టరీ లేదని ఐసీఎంఆర్ తేల్చి చెప్పింది. అయినప్పటికీ వ్యాది రావడం అందరినీ కలవర పెడుతుందని తెలిపింది. కాగా, చైనాలో హ్యూమన్ మెటానిమోవైరస్ సహా పలు శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తుండటంతో భారత్ ఇప్పటికే అలర్ట్ అయింది. ఇటీవలే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధ్యక్షతన జాయింట్ మానిటరింగ్ గ్రూప్ మీటింగ్ నిర్వహించింది.
Read Also: Charlapally Terminal: కాసేపట్లో చర్లపల్లి టెర్మినల్ ప్రారంభం.. పాల్గొన్న ముఖ్య నేతలు
శీతాకాలంలో మార్పులు చోటుచేసుకున్న కారణంగానే చైనాలో ఇన్ఫ్లూయెంజా, ఆర్ఎస్వీ, హెచ్ఎంపీవీ తరహా వైరస్లు వ్యాప్తి చెందుతున్నాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ తేల్చింది. భారత్లోని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే పలు చోట్ల ఆర్ఎస్ఏ, హెచ్ఎంపీవీ తదితర పరీక్షలు చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఒకవేళ శ్వాసకోశ వ్యాధులు అనుకోకుండా పెరిగినా వాటిని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు డీజీహెచ్ఎస్ చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
-
OTR: పసుపు నీళ్లు చుట్టూ తిరుగుతున్న తెలంగాణ పాలిటిక్స్
-
UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్రాజ్లో ఎస్పీ నేత హత్య
-
Cheyutha Pension : గుడ్న్యూస్.. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?