Stella Ship: ఎట్టకేలకు కాకినాడ నుంచి బయల్దేరిన స్టెల్లా ఎల్ షిప్!
- కాకినాడ నుంచి బయల్దేరిన స్టెల్లా షిప్
- పశ్చిమ ఆఫ్రికాకు బయలుదేరిన స్టెల్లా
- హల్దియా నుంచి కాకినాడ తీరానికి స్టెల్లా నౌక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాకినాడ తీరంలో గత 55 రోజులుగా నిలిచిపోయిన ‘స్టెల్లా ఎల్’ నౌకకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈరోజు తెల్లవారుజామున పశ్చిమ ఆఫ్రికాకు నౌక బయలుదేరి వెళ్లింది. కస్టమ్స్ అధికారులు క్లియరెన్స్ ఇవ్వడంతో పశ్చిమ ఆఫ్రికా తీరంలోని బెనిన్ దేశ వాణిజ్య కేంద్రం కొటోనౌ పోర్టుకు నౌక బయల్దేరింది. కొటోనౌ పోర్టుకు బయల్దేరేందుకు కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ ఆదివారం అనుమతిని ఇచ్చారు. హల్దియా నుంచి 2024 నవంబరు 11న కాకినాడ తీరానికి స్టెల్లా షిప్ వచ్చిన విషయం తెలిసిందే.
హల్దియా నుంచి గతేడాది నవంబరు 11న కాకినాడ తీరానికి స్టెల్లా నౌక వచ్చింది. నౌకలోకి 32,415 టన్నులు లోడయ్యాక నవంబరు 27న అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయగా పేదల బియ్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ ఆదేశాలతో డిసెంబరు 4న మరోసారి తనిఖీలు చేయగా.. బియ్యంలో 36 శాతం ఫోర్టిఫైడ్ కర్నెల్స్ ఉన్నట్లు తేలింది. దీంతో నౌకలోకి రేషన్ బియ్యం ఎత్తిన సత్యం బాలాజీ ఇండస్ట్రీస్ ఓనర్ ప్రదీప్ అగర్వాల్, మేనేజర్ కళ్యాణ్ అశోక్ లపై 6ఏ కింద పౌరసరఫరాల అధికారులు కేసులు నమోదు చేశారు. నౌకలో పట్టుబడిన 1,320 టన్నుల రేషన్ బియ్యాన్ని డిసెంబరు 30న స్వాధీనం చేసుకుని.. గోదాములోకి తరలించి సీజ్ చేశారు. షిప్ నిలిపినందుకు చెల్లించాల్సిన యాంకరేజి చార్జి, ఎక్స్పోర్ట్ చార్జీ పోర్టు అథారిటీకి స్టీమర్ ఏజెంట్ చెల్లించారు.
Also Read
- India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
- ATM Charges: ఏటీఎం విత్డ్రాయల్పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
- Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
- Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
ఎగుమతిదారుల అభ్యర్థనతో మిగిలిన బియ్యాన్ని నౌకలోకి లోడింగ్కు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఈ ప్రక్రియ ఆదివారం పూర్తయ్యింది. యాంకరేజి ఛార్జి, ఎక్స్పోర్టు రుసుము పోర్టు అథారిటీకి స్టెల్లా నౌక స్టీమర్ ఏజెంట్ చెల్లించి నోడ్యూస్ ధ్రువీకరణ పొందారు. అనంతరం కస్టమ్స్ అధికారులు ఆదివారం క్లియరెన్స్ ఇచ్చారు. దీంతో స్టెల్లా నౌక పశ్చిమ ఆఫ్రికా తీరంకు నేడు బయల్దేరింది. తుఫాన్ కారణంగా మొదటి నుంచి స్టెల్లా నౌకకు అవాంతరాలే ఎదురైన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
-
ATM Charges: ఏటీఎం విత్డ్రాయల్పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
-
Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
-
Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
-
Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!