మరికాసేపట్లో చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవం జరుగనుంది. ఢిల్లీ నుంచి 12:30 నిమిషాలకు మోడీ వర్చువల్గా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్గా హాజరు కానున్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రులు బండి సంజయ్, సోమన్న, ఎంపీ ఈటల రాజేందర్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,పలువురు ప్రజా ప్రతి నిధులు హాజరయ్యారు.