Cyber Crime: హైదరాబాద్లో వెలుగు చూసిన కాల్ సెంటర్ స్కాం..
- హైదరాబాద్ లో నకిలీ కాల్ సెంటర్ల స్కాం..
- 50 మందిని అదుపులోకి తీసుకున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో..
- హ్యాక్ అయిన బ్యాంక్ ఖాతాలు సరి చేస్తామంటూ మోసాలు..
- డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు సేకరించి ఖాతాల్లో నగదు కాజేస్తున్న నిందితులు..
- హైటెక్ సిటీలో నకిలీ కాల్ సెంటర్ నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Crime: హైదరాబాద్ నగరంలో కాల్ సెంటర్ల స్కాం వెలుగులోకి వచ్చింది. పే పాల్ వినియోగిస్తున్న కస్టమర్స్ డేటా చోరీ చేసినట్లు గుర్తించారు. విదేశాల్లో ఉంటున్న కస్టమర్స్ టార్గెట్ గా ఈ స్కాం చేశారు. దీంతో పాటు హ్యాక్ అయిన బ్యాంకు ఖాతాలను సరిచేస్తామంటూ మోసాలు చేసి.. బ్యాంకు అకౌంట్, డెబిట్, క్రెడిక్ కార్డులు వివరాలు సేకరంచి ఖాతాల్లో నగదు కాజేస్తున్నారు నిందితులు. ఇక, ఈ కాల్ సెంటర్ పై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సోదాలు చేసి సుమారు 50 మందిని అదుపులోకి తీసుకుంది. అలాగే, భారీగా కంప్యూటర్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుంది.
Read Also: Malala: 13 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై అడుగుపెట్టిన నోబెల్ గ్రహీత మలాలా
Also Read
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
- KCR Meeting : ఎర్రవల్లి వేదికగా కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. బీఆర్ఎస్ ప్రక్షాళనకు శ్రీకారం..!
కాగా, హైటెక్ సిటీలోని పత్రికా నగర్ అడ్డాగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నామని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు తెలిపారు. 63 మంది సైబర్ నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నాం.. ఎక్కువ మంది నార్త్ ఈస్టర్న్ దేశాలకు చెందిన వాళ్ళు ఉన్నారు.. అమెరికాకి చెందిన పే పాల్ అనే యాప్ ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.. అధునాతన సాప్ట్ వేర్ EYEBEAM, X-LITE ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారని చెప్పుకొచ్చారు. విదేశాల్లో ఉన్న వాళ్ళే టార్గెట్ గా చేసుకుని ఫిషింగ్ మెయిల్స్ పంపుతున్నారు.. ఫ్రాడ్ ప్రివెన్షన్ టీమ్ అని చెప్పుకుంటూ కాల్స్ చేస్తున్నారు.. 63 మందిలో 22 మంది అమ్మాయిలు ఉన్నారు.. సోషల్ మీడియాలో ఉద్యోగాల పేరుతో ప్రకటనలు ఇచ్చి రిక్రూట్ చేసుకున్నారు అని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ పేర్కొనింది.
Read Also: Daggubati Venkateswara Rao: నాకు, చంద్రబాబుకు వైరం ఉంది నిజమే!
ఇక, ఎలా సైబర్ నేరాలకు పాల్పడాలో కూడా శిక్షణ ఇచ్చారు అని సైబర్ సెక్యూరిటీ బ్యూరో తెలిపింది. Exito సొల్యూషన్స్ ఎండీ చందా మనస్వనినీ అరెస్ట్ చేశాం.. నెట్వర్క్ ను ఆపరేట్ చేస్తున్న జాదు భాయ్, రాహుల్ అలియాస్ ప్రతిక్ ను కూడా ఉన్నారు.. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లింక్డ్ ఇన్, ఇన్ స్టాగ్రాం, ఫేస్ బుక్ ద్వారా యువతీ, యువకులను రిక్రూట్ చేసుకున్నారు.. కాల్ సెంటర్ లో ఉద్యోగాల పేరుతో వారిని నియమించుకున్నారు.. ఒక్కొకరికి రూ. 30 వేల జీతం ఇచ్చారు.. 52 మొబైల్ ఫోన్స్, 63 ల్యాప్ టాప్స్, 27 ఐడీ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు.
తాజావార్తలు
-
Petrol-Diesel prices: పెట్రోల్-డీజిల్ ధరలు పెరగొచ్చు.. ఆర్బీఐ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..
-
CM Vijay: IMDb లిస్ట్ను షేక్ చేసిన తమిళనాడు సీఎం.. వారంలోనే టాప్-2లోకి ‘దళపతి’! అసలేం జరిగిందంటే..
-
Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
-
Air India: ప్రధాని మోదీ పొదుపు మంత్రం.. ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం..
-
Supreme Court: హిందూ మతం ఓ జీవన విధానం.. దీపం వెలిగిస్తే సరిపోతుందన్న సుప్రీంకోర్టు
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!