Cyber Crime: హైదరాబాద్లో వెలుగు చూసిన కాల్ సెంటర్ స్కాం..
- హైదరాబాద్ లో నకిలీ కాల్ సెంటర్ల స్కాం..
- 50 మందిని అదుపులోకి తీసుకున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో..
- హ్యాక్ అయిన బ్యాంక్ ఖాతాలు సరి చేస్తామంటూ మోసాలు..
- డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు సేకరించి ఖాతాల్లో నగదు కాజేస్తున్న నిందితులు..
- హైటెక్ సిటీలో నకిలీ కాల్ సెంటర్ నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Crime: హైదరాబాద్ నగరంలో కాల్ సెంటర్ల స్కాం వెలుగులోకి వచ్చింది. పే పాల్ వినియోగిస్తున్న కస్టమర్స్ డేటా చోరీ చేసినట్లు గుర్తించారు. విదేశాల్లో ఉంటున్న కస్టమర్స్ టార్గెట్ గా ఈ స్కాం చేశారు. దీంతో పాటు హ్యాక్ అయిన బ్యాంకు ఖాతాలను సరిచేస్తామంటూ మోసాలు చేసి.. బ్యాంకు అకౌంట్, డెబిట్, క్రెడిక్ కార్డులు వివరాలు సేకరంచి ఖాతాల్లో నగదు కాజేస్తున్నారు నిందితులు. ఇక, ఈ కాల్ సెంటర్ పై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సోదాలు చేసి సుమారు 50 మందిని అదుపులోకి తీసుకుంది. అలాగే, భారీగా కంప్యూటర్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుంది.
Read Also: Malala: 13 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై అడుగుపెట్టిన నోబెల్ గ్రహీత మలాలా
Also Read
- Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
- Bonalu 2026: గోల్కొండ నుంచి లాల్దర్వాజా వరకు.. బోనాల జాతరకు సర్వం సిద్ధం..
- Shabad Murder Case : చనిపోవడానికి ముందు రాజ్కుమార్ సెల్ఫీ వీడియో.. విస్తుపోయే నిజాలు..!
- Asian U23 Athletics: స్వర్ణ పతకంతో మెరిసిన తెలంగాణ బిడ్డ.. సీఎం రేవంత్ అభినందనలు..
కాగా, హైటెక్ సిటీలోని పత్రికా నగర్ అడ్డాగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నామని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు తెలిపారు. 63 మంది సైబర్ నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నాం.. ఎక్కువ మంది నార్త్ ఈస్టర్న్ దేశాలకు చెందిన వాళ్ళు ఉన్నారు.. అమెరికాకి చెందిన పే పాల్ అనే యాప్ ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.. అధునాతన సాప్ట్ వేర్ EYEBEAM, X-LITE ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారని చెప్పుకొచ్చారు. విదేశాల్లో ఉన్న వాళ్ళే టార్గెట్ గా చేసుకుని ఫిషింగ్ మెయిల్స్ పంపుతున్నారు.. ఫ్రాడ్ ప్రివెన్షన్ టీమ్ అని చెప్పుకుంటూ కాల్స్ చేస్తున్నారు.. 63 మందిలో 22 మంది అమ్మాయిలు ఉన్నారు.. సోషల్ మీడియాలో ఉద్యోగాల పేరుతో ప్రకటనలు ఇచ్చి రిక్రూట్ చేసుకున్నారు అని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ పేర్కొనింది.
Read Also: Daggubati Venkateswara Rao: నాకు, చంద్రబాబుకు వైరం ఉంది నిజమే!
ఇక, ఎలా సైబర్ నేరాలకు పాల్పడాలో కూడా శిక్షణ ఇచ్చారు అని సైబర్ సెక్యూరిటీ బ్యూరో తెలిపింది. Exito సొల్యూషన్స్ ఎండీ చందా మనస్వనినీ అరెస్ట్ చేశాం.. నెట్వర్క్ ను ఆపరేట్ చేస్తున్న జాదు భాయ్, రాహుల్ అలియాస్ ప్రతిక్ ను కూడా ఉన్నారు.. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లింక్డ్ ఇన్, ఇన్ స్టాగ్రాం, ఫేస్ బుక్ ద్వారా యువతీ, యువకులను రిక్రూట్ చేసుకున్నారు.. కాల్ సెంటర్ లో ఉద్యోగాల పేరుతో వారిని నియమించుకున్నారు.. ఒక్కొకరికి రూ. 30 వేల జీతం ఇచ్చారు.. 52 మొబైల్ ఫోన్స్, 63 ల్యాప్ టాప్స్, 27 ఐడీ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!