Daggubati Venkateswara Rao: నాకు, చంద్రబాబుకు వైరం ఉంది నిజమే కానీ..!
- ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమం
- ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు
- చంద్రబాబు, వెంకటేశ్వరరావు ఆత్మీయ ఆలింగనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తనకు చంద్రబాబు నాయుడుతో వైరం ఉందని అందరూ అంటుంటారని.. అది నిజమే కానీ ఇప్పుడు కాదని మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వర రావు చెప్పారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని, వాటిని మరిచిపోవాలన్నారు. ఎల్లకాలం పరుషంగా ఉండాల్సిన అవసరం లేదని వెంకటేశ్వర రావు పేర్కొన్నారు. దగ్గుబాటి రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమం విశాఖ గీతం యూనివర్సిటీలో జరిగింది. ఈ కార్యక్రమంకు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేదికపై తోడల్లుళ్లు చంద్రబాబు, వెంకటేశ్వర రావు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.
‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో దగ్గుబాటి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ… ‘ఆంధ్ర రాష్ట్రం అనేకసార్లు విభనకు గురైంది. ఆ సందర్భంలో ఎదురైన పరిస్థితిని చర్చించే ప్రయత్నం చేశాను. రాజకీయ నాయకులు ఎప్పుడు స్వీయ చరిత్రలు, అనుభవాలు రాస్తుంటారు కానీ.. ప్రపంచ చరిత్రను రాసినప్పుడు బుక్ లాంఛ్ కోసం ప్రముఖులను పిలవడంపై సందిగ్ధత వుండేది. రాజకీయ నాయకులు అంటే ఎన్నికల్లో ఖర్చు పెట్టడం, తిరిగి సంపాదించడం అనే అభిప్రయంలోకి వెళ్ళిపోయింది. ప్రపంచ చరిత్ర పుస్తకం పోటీ పరీక్షలకు వెళ్లే వాళ్లకు ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నా’ అని అన్నారు.
Also Read
- Sugar Price Fall: చక్కెర ధరలపై కేంద్రం మాస్టర్ ప్లాన్.. సామాన్యులకు గుడ్ న్యూస్..
- Operation Sindoor: భారత్ హిట్ లిస్టులో పాకిస్తాన్ ‘‘స్కార్దు’’.. చైనాకు కూడా హెచ్చరికేనా..?
- Egg Prices Rise: గుడ్ల ధరలకు ఇథనాల్ ఎఫెక్ట్.. అసలు కారణం ఇదే!
- Nepal Flash Floods: నేపాల్ వరద ప్రళయం.. బీహార్కు పెను ప్రమాదం..
‘వేదిక ఎక్కి 30 ఏళ్లు అయ్యింది. గతంలో మైక్ ముందు మాట్లాడమని అడిగినా వెళ్లి పోయేవాడిని. ఇవాళ బుక్ రిలీజ్ కోసం వచ్చాను. రాజకీయాలు, పుస్తక పరిచయం గురించి ప్రస్తావిస్తూ బోర్ కొట్టించానా?. మరో 50 ఏళ్లు బ్రతికే టెక్నాలజీ వచ్చేస్తుందట. నాకు, చంద్రబాబుకు వైరం ఉందని అందరూ అంటారు. అది నిజమే కానీ.. ఇప్పుడు కాదు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు, వాటిని మరిచిపోవాలి. ఎల్లకాలం పరుషంగా వుండాలిస్సిన అవసరం లేదు’ అని దగ్గుబాటి చెప్పుకొచ్చారు. దగ్గుబాటి మాట్లాడిన అనంతరం సీఎం చంద్రబాబు ఆయన్ను అభినందిస్తూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరూ ఒకే బహిరంగ వేదికపైకి రావడం 30 ఏళ్లలో ఇదే మొదటిసారి.
తాజావార్తలు
-
Komaram Bheem District : ఆసిఫాబాద్లో వరద బీభత్సం.. బైకిస్టులకు తృటిలో తప్పిన ప్రమాదం..
-
Sugar Price Fall: చక్కెర ధరలపై కేంద్రం మాస్టర్ ప్లాన్.. సామాన్యులకు గుడ్ న్యూస్..
-
Ranabaali: ఇప్పుడు రష్మిక – విజయ్ వంతు.. ఈ వారంలోనే ‘రణబాలి’ బిగ్ సర్ప్రైజ్? అసలు ట్విస్ట్ ఇదే!
-
Operation Sindoor: భారత్ హిట్ లిస్టులో పాకిస్తాన్ ‘‘స్కార్దు’’.. చైనాకు కూడా హెచ్చరికేనా..?
-
Food Facts : పప్పులో తెల్లటి నురుగు.. మురికేనా.? అసలు నిజం ఇదే.!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..