Daggubati Venkateswara Rao: నాకు, చంద్రబాబుకు వైరం ఉంది నిజమే కానీ..!
- ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమం
- ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు
- చంద్రబాబు, వెంకటేశ్వరరావు ఆత్మీయ ఆలింగనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తనకు చంద్రబాబు నాయుడుతో వైరం ఉందని అందరూ అంటుంటారని.. అది నిజమే కానీ ఇప్పుడు కాదని మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వర రావు చెప్పారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని, వాటిని మరిచిపోవాలన్నారు. ఎల్లకాలం పరుషంగా ఉండాల్సిన అవసరం లేదని వెంకటేశ్వర రావు పేర్కొన్నారు. దగ్గుబాటి రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమం విశాఖ గీతం యూనివర్సిటీలో జరిగింది. ఈ కార్యక్రమంకు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేదికపై తోడల్లుళ్లు చంద్రబాబు, వెంకటేశ్వర రావు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.
‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో దగ్గుబాటి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ… ‘ఆంధ్ర రాష్ట్రం అనేకసార్లు విభనకు గురైంది. ఆ సందర్భంలో ఎదురైన పరిస్థితిని చర్చించే ప్రయత్నం చేశాను. రాజకీయ నాయకులు ఎప్పుడు స్వీయ చరిత్రలు, అనుభవాలు రాస్తుంటారు కానీ.. ప్రపంచ చరిత్రను రాసినప్పుడు బుక్ లాంఛ్ కోసం ప్రముఖులను పిలవడంపై సందిగ్ధత వుండేది. రాజకీయ నాయకులు అంటే ఎన్నికల్లో ఖర్చు పెట్టడం, తిరిగి సంపాదించడం అనే అభిప్రయంలోకి వెళ్ళిపోయింది. ప్రపంచ చరిత్ర పుస్తకం పోటీ పరీక్షలకు వెళ్లే వాళ్లకు ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నా’ అని అన్నారు.
Also Read
- Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
- Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
- Xi Jinping: భారత్లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
‘వేదిక ఎక్కి 30 ఏళ్లు అయ్యింది. గతంలో మైక్ ముందు మాట్లాడమని అడిగినా వెళ్లి పోయేవాడిని. ఇవాళ బుక్ రిలీజ్ కోసం వచ్చాను. రాజకీయాలు, పుస్తక పరిచయం గురించి ప్రస్తావిస్తూ బోర్ కొట్టించానా?. మరో 50 ఏళ్లు బ్రతికే టెక్నాలజీ వచ్చేస్తుందట. నాకు, చంద్రబాబుకు వైరం ఉందని అందరూ అంటారు. అది నిజమే కానీ.. ఇప్పుడు కాదు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు, వాటిని మరిచిపోవాలి. ఎల్లకాలం పరుషంగా వుండాలిస్సిన అవసరం లేదు’ అని దగ్గుబాటి చెప్పుకొచ్చారు. దగ్గుబాటి మాట్లాడిన అనంతరం సీఎం చంద్రబాబు ఆయన్ను అభినందిస్తూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరూ ఒకే బహిరంగ వేదికపైకి రావడం 30 ఏళ్లలో ఇదే మొదటిసారి.
తాజావార్తలు
-
Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
-
MSI Cyborg 15 Max C2W: ఎంఎస్ఐ Cyborg 15 Max గేమింగ్ ల్యాప్టాప్లు భారత్లో లాంచ్.. RTX 50 సిరీస్ GPU, 144Hz డిస్ప్లే
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
TFTDDA Dispute: డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో కీలక మలుపు.. సెప్టెంబర్ 13 సమావేశంపై కోర్టు స్టే!
-
Explainer: సిక్కులపై అమెరికా పగ పట్టిందా?
ట్రెండింగ్
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..