Daggubati Venkateswara Rao: నాకు, చంద్రబాబుకు వైరం ఉంది నిజమే కానీ..!
- ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమం
- ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు
- చంద్రబాబు, వెంకటేశ్వరరావు ఆత్మీయ ఆలింగనం
తనకు చంద్రబాబు నాయుడుతో వైరం ఉందని అందరూ అంటుంటారని.. అది నిజమే కానీ ఇప్పుడు కాదని మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వర రావు చెప్పారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని, వాటిని మరిచిపోవాలన్నారు. ఎల్లకాలం పరుషంగా ఉండాల్సిన అవసరం లేదని వెంకటేశ్వర రావు పేర్కొన్నారు. దగ్గుబాటి రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమం విశాఖ గీతం యూనివర్సిటీలో జరిగింది. ఈ కార్యక్రమంకు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేదికపై తోడల్లుళ్లు చంద్రబాబు, వెంకటేశ్వర రావు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.
‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో దగ్గుబాటి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ… ‘ఆంధ్ర రాష్ట్రం అనేకసార్లు విభనకు గురైంది. ఆ సందర్భంలో ఎదురైన పరిస్థితిని చర్చించే ప్రయత్నం చేశాను. రాజకీయ నాయకులు ఎప్పుడు స్వీయ చరిత్రలు, అనుభవాలు రాస్తుంటారు కానీ.. ప్రపంచ చరిత్రను రాసినప్పుడు బుక్ లాంఛ్ కోసం ప్రముఖులను పిలవడంపై సందిగ్ధత వుండేది. రాజకీయ నాయకులు అంటే ఎన్నికల్లో ఖర్చు పెట్టడం, తిరిగి సంపాదించడం అనే అభిప్రయంలోకి వెళ్ళిపోయింది. ప్రపంచ చరిత్ర పుస్తకం పోటీ పరీక్షలకు వెళ్లే వాళ్లకు ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నా’ అని అన్నారు.
Also Read
- House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
‘వేదిక ఎక్కి 30 ఏళ్లు అయ్యింది. గతంలో మైక్ ముందు మాట్లాడమని అడిగినా వెళ్లి పోయేవాడిని. ఇవాళ బుక్ రిలీజ్ కోసం వచ్చాను. రాజకీయాలు, పుస్తక పరిచయం గురించి ప్రస్తావిస్తూ బోర్ కొట్టించానా?. మరో 50 ఏళ్లు బ్రతికే టెక్నాలజీ వచ్చేస్తుందట. నాకు, చంద్రబాబుకు వైరం ఉందని అందరూ అంటారు. అది నిజమే కానీ.. ఇప్పుడు కాదు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు, వాటిని మరిచిపోవాలి. ఎల్లకాలం పరుషంగా వుండాలిస్సిన అవసరం లేదు’ అని దగ్గుబాటి చెప్పుకొచ్చారు. దగ్గుబాటి మాట్లాడిన అనంతరం సీఎం చంద్రబాబు ఆయన్ను అభినందిస్తూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరూ ఒకే బహిరంగ వేదికపైకి రావడం 30 ఏళ్లలో ఇదే మొదటిసారి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!