Daggubati Venkateswara Rao: నాకు, చంద్రబాబుకు వైరం ఉంది నిజమే కానీ..!
- ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమం
- ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు
- చంద్రబాబు, వెంకటేశ్వరరావు ఆత్మీయ ఆలింగనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తనకు చంద్రబాబు నాయుడుతో వైరం ఉందని అందరూ అంటుంటారని.. అది నిజమే కానీ ఇప్పుడు కాదని మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వర రావు చెప్పారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని, వాటిని మరిచిపోవాలన్నారు. ఎల్లకాలం పరుషంగా ఉండాల్సిన అవసరం లేదని వెంకటేశ్వర రావు పేర్కొన్నారు. దగ్గుబాటి రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమం విశాఖ గీతం యూనివర్సిటీలో జరిగింది. ఈ కార్యక్రమంకు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేదికపై తోడల్లుళ్లు చంద్రబాబు, వెంకటేశ్వర రావు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.
‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో దగ్గుబాటి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ… ‘ఆంధ్ర రాష్ట్రం అనేకసార్లు విభనకు గురైంది. ఆ సందర్భంలో ఎదురైన పరిస్థితిని చర్చించే ప్రయత్నం చేశాను. రాజకీయ నాయకులు ఎప్పుడు స్వీయ చరిత్రలు, అనుభవాలు రాస్తుంటారు కానీ.. ప్రపంచ చరిత్రను రాసినప్పుడు బుక్ లాంఛ్ కోసం ప్రముఖులను పిలవడంపై సందిగ్ధత వుండేది. రాజకీయ నాయకులు అంటే ఎన్నికల్లో ఖర్చు పెట్టడం, తిరిగి సంపాదించడం అనే అభిప్రయంలోకి వెళ్ళిపోయింది. ప్రపంచ చరిత్ర పుస్తకం పోటీ పరీక్షలకు వెళ్లే వాళ్లకు ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నా’ అని అన్నారు.
Also Read
- AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- Gunasekhar: అలా పుట్టిందే 'ఒక్కడు' సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
‘వేదిక ఎక్కి 30 ఏళ్లు అయ్యింది. గతంలో మైక్ ముందు మాట్లాడమని అడిగినా వెళ్లి పోయేవాడిని. ఇవాళ బుక్ రిలీజ్ కోసం వచ్చాను. రాజకీయాలు, పుస్తక పరిచయం గురించి ప్రస్తావిస్తూ బోర్ కొట్టించానా?. మరో 50 ఏళ్లు బ్రతికే టెక్నాలజీ వచ్చేస్తుందట. నాకు, చంద్రబాబుకు వైరం ఉందని అందరూ అంటారు. అది నిజమే కానీ.. ఇప్పుడు కాదు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు, వాటిని మరిచిపోవాలి. ఎల్లకాలం పరుషంగా వుండాలిస్సిన అవసరం లేదు’ అని దగ్గుబాటి చెప్పుకొచ్చారు. దగ్గుబాటి మాట్లాడిన అనంతరం సీఎం చంద్రబాబు ఆయన్ను అభినందిస్తూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరూ ఒకే బహిరంగ వేదికపైకి రావడం 30 ఏళ్లలో ఇదే మొదటిసారి.
తాజావార్తలు
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
-
Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై “సింగం” ఫార్ములా బ్లాక్బస్టర్!!
-
Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్
-
Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!