Malala: 13 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై అడుగుపెట్టిన నోబెల్ గ్రహీత మలాలా
- 13 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై అడుగుపెట్టిన మలాలా
- 15 ఏళ్ల వయసులో తాలిబన్ల దాడిలో గాయపడ్డ మలాలా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, మహిళా హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్జాయ్ బుధవారం పాకిస్థాన్లోని తన సొంత గడ్డపై అడుగుపెట్టింది. 13 ఏళ్ల తర్వాత ఆమె తన స్వస్థలానికి తిరిగి వచ్చింది. ఆమె తండ్రి, భర్త, సోదరుడు హై సెక్యూరిటీ మధ్య పాక్కు చేరుకుంది. 15 ఏళ్ల వయసులో ఆమెపై తాలిబన్లు కాల్పులకు తెగబడ్డారు. స్వాత్ లోయలో ఉగ్రవాదులు బస్సు ఎక్కి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆమె తలకు గాయాలయ్యాయి.
ఇది కూడా చదవండి: YouTube @ 20: 20 ఏళ్ల యూట్యూబ్.. దీని చరిత్ర మీకు తెలుసా..!
Also Read
- Tarique Rahman: బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్ దూరం.. కారణమిదే!
- Zelenskyy: జెలెన్స్కీ విమానాన్ని డ్రోన్ ఢీకొట్టబోయిందా?.. నార్వే ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- Khawaja Asif: 'మధ్యవర్తి' నుంచి 'గారడీవాడి' స్థాయికి.. పాకిస్థాన్కు తప్పని దౌత్య చిక్కులు.. ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు
- Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
హెలికాప్టర్లో ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లోని షాంగ్లా జిల్లాలోని బర్కానాకు చేరుకుంది. అక్కడ ఆమె కుటుంబ సభ్యులను కలుసుకుంది. ఇటీవల ఇస్లామాబాద్లో ఆమె మామ గుండె శస్త్రచికిత్స చేయించుకున్నారు. అతడిని కూడా పరామర్శించింది. అలాగే పూర్వీకుల స్మశానవాటికను కూడా సందర్శించిందని ది డాన్ వార్తాపత్రిక తెలిపింది. అలాగే బాలికల కోసం నిర్మించిన పాఠశాలను కూడా ఆమె సందర్శించింది. ప్రమాదం జరిగిన తర్వాత మలాలా తన సొంతూరు సందర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఇది కూడా చదవండి: Nani : ‘ది ప్యారడైజ్’ లో నాని రెండు జడల వెనుక రహస్యం ఇదే..!
ఇక 2021లో అసీర్ మాలిక్ను మలాలా వివాహం చేసుకుంది. 2018లో బర్కానా జిల్లాలో సుమారు వెయ్యి మంది బాలికలకు ఉచిత విద్యను అందించేందుకు పాఠశాలను ఆమె నిర్మించింది. పాఠశాలలో విద్యార్థులను, తరగతి గదులను సందర్శించారు. మలాలా ఫండ్తో ఉచిత విద్యను అందిస్తోంది.
కాల్పులకు గురైన తర్వాత మలాలా తొలిసారి 2018లో పాకిస్తాన్ను సందర్శించింది. ఆ తర్వాత ఆమె 2022లో పాకిస్తాన్ను సందర్శించి వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాలను సందర్శించి బాధితులను ఓదార్చారు. ఇక ఈ సంవత్సరం జనవరిలో ఇస్లామాబాద్లో జరిగిన ముస్లిం సమాజంలో బాలికల విద్యపై అంతర్జాతీయ సమావేశంలో పాల్గొంది. అయితే సొంత గడ్డపై మాత్రం 13 ఏళ్ల తర్వాత అడుగుపెట్టింది.
ఇది కూడా చదవండి: Udhayanidhi Stalin: సనాతన ధర్మం వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో ఉదయనిధి స్టాలిన్కి ఊరట
తాజావార్తలు
-
Russia Aircraft Deal: భారత్కు రష్యా బిగ్ ఆఫర్.. 105 విమానాలు, దేశంలోనే SJ-100 తయారీ!
-
Tarique Rahman: బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్ దూరం.. కారణమిదే!
-
UP Election 2027: యూపీ అసెంబ్లీ ఎన్నికలు.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య సీట్ల పంచాయతీ!
-
Duleep Trophy 2026: డ్రాగా ముగిసిన దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్.. ఈస్ట్ జోన్దే టైటిల్!
-
Bolishetti Srinivas: ఎమ్మెల్యే బొలిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ వల్లే కాపులకు విలువ.. 50-60 సీట్ల లక్ష్యం..!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?