KTR: అండగా ఉంటాం.. గ్రూప్-1 అభ్యర్థులకు కేటీఆర్ హామీ..
- గ్రూప్ 1 మెయిన్స్ ను వాయిదా వేసేలా ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలి..
- తప్పకుండా సహకరిస్తాం అని చెప్పిన కేటీఆర్..
- అభ్యర్థులు సుప్రీంకోర్టు కు వెళితే పార్టీ తరుపున అండగా ఉంటామని హామీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: తెలంగాణ భవన్ లో గ్రూప్ 1 అభ్యర్థులతో కేటీఆర్ భేటీ ముగిసింది. గ్రూప్ 1 అభ్యర్థులు కేటీఆర్ తో కలవాలన్న అభ్యర్థన మేరకు ఇవాళ తెలంగాణ భవన్ ఆయన కలిసారు. జీవో నెంబర్ 29 ను ఎత్తివేయాలని కొందరు అభ్యర్థులు కేటీఆర్ ను కోరారు. ఈ జీవో వల్ల తమకు నష్టం జరుగుతుందని అభ్యర్థులు తెలిపారు. గ్రూప్ 1 మెయిన్స్ ను వాయిదా వేసేలా ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని అభ్యర్థులు కేటీఆర్ కు తెలిపారు. దీనిపై స్పందించిన కేటీఆర్ తప్పకుండా సహకరిస్తాం అని చెప్పారు. అభ్యర్థులు సుప్రీంకోర్టు కు వెళితే పార్టీ తరుపున అండగా ఉంటాం అని హామీ ఇచ్చారు.
Read also: Skin Care Tips: మెడ చుట్టూ నలుపు పోవాలంటే ఇలా చేయండి..
Also Read
గ్రూప్-1 మెయిన్స్ను రీషెడ్యూల్ చేయాలని అభ్యర్థులు గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 21 నుంచి జరగనున్న గ్రూప్-1 మెయిన్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సాయంత్రం వందలాది మంది అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ప్రిలిమ్స్ పరీక్షల్లో తప్పులు దొర్లాయని, జీవో 29ని సవరించిన తర్వాతే మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై దాదాపు 33 కేసులు వచ్చాయని, వాటన్నింటినీ పరిష్కరించిన తర్వాతే మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. 2011లో గ్రూప్-1 పరీక్షలు కూడా నిర్వహించామని, 2016లో రద్దు చేసి మళ్లీ నిర్వహించామని గుర్తు చేశారు.. మెయిన్స్ పరీక్షల్లో కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. గ్రూప్-1 పరీక్ష ప్రిలిమ్స్లో అన్ని ప్రశ్నలు తప్పులు లేకుండా ఉన్నాయని, 150 ప్రశ్నల్లో 20 ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని గుర్తు చేశారు. ఈ కేసులన్నింటినీ పరిష్కరించిన తర్వాతే మెయిన్స్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
Uppal Stadium: ఉప్పల్ స్టేడియంలో బ్లాక్ టిక్కెట్ల దందా.. ఈడీ దర్యాప్తు ముమ్మరం..
- Tags
- group 1 mains
- ktr
- telangana
- TGPSC
- tspsc
తాజావార్తలు
-
PBKS-Dharamsala: పంజాబ్ కింగ్స్ కొంపముంచిన ధర్మశాల.. ప్రత్యర్థి జట్లకు మాత్రం అదృష్ట వేదిక!
-
AC Usage Tips: మీరు AC వాడుతున్నారా? ఈ 5 చిట్కాలు తప్పక పాటించండి..!
-
JR NTR : అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాకుండానే థియేటర్ వద్ద భారీ కటౌట్.. పాలాభిషేకాలతో ఫ్యాన్స్ రచ్చ
-
Samsung Galaxy M47 5G, F70 Pro 5G: సామ్ సంగ్ మిడ్-రేంజ్ 5G ఫోన్లు విడుదలకు సిద్ధం.. 8GB ర్యామ్
-
Kalki Avatar: కలియుగం ముగింపుకు కౌంట్డౌన్ మొదలైందా? పురాణాలు చెప్పిన భయంకర నిజాలు ఇవే!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..