BJP MP Laxman: తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగాం.. ఎదురులేని శక్తిగా ఎదుగుతాం
- ఎమ్మెల్సీ ఎన్నికల తీర్పు రేవంత్ రెడ్డి పాలనకు రెఫరెండం..
- తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగాo.. ఎదురులేని శక్తిగా ఎదుగుతాం..
- ఢిల్లీకి చక్కర్లు కొట్టడంలో రేవంత్ త్వరలోనే సెంచరీ కొట్టడం ఖాయం: ఎంపీ లక్ష్మణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MP Laxman: ఎమ్మెల్సీ ఎన్నికల తీర్పు రేవంత్ రెడ్డి పాలనకు రెఫరెండం అని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తెలిపారు. డబుల్ ఎమ్మెల్సీ గెలిచాం.. డబులింజన్ సర్కార్ ఖాయం అన్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగాo.. ఎదురులేని శక్తిగా ఎదుగుతామన్నారు. బీజేపీ చేసేదే చెప్తుంది, చెప్పింది చేస్తుందన్నారు. రాబోయే కాలంలో బీజేపీ గెలుపు కోసం పూర్తిగా ప్రణాళికబద్దంగా ముందుకు పోతామన్నారు. రేవంత్ రెడ్డికి ఇంటి పోరు,హైకమాండ్ పోరు, ప్రజల హోరు తగలిందని ఆయన విమర్శించారు. తెలంగాణలో పాలన పడకేసి, పట్టు సాధించుకోలేక ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.. ఢిల్లీకి చక్కర్లు కొట్టడంలో రేవంత్ రెడ్డి త్వరలోనే సెంచరీ కొట్టడం ఖాయం అని ఎద్దేవా చేశారు. కనీసం మంత్రి వర్గ విస్తరణ లేదు, ఎమ్మెల్సీల ఫైనల్ లేదు.. మిణుకు మిణుకు మంటూ కాంగ్రెస్ కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు.
Read Also: Ranya Rao: నటి కాదు.. పెద్ద కిలాడీ.. వెలుగులోకి రన్యా రావు బాగోతాలు
Also Read
- Women Commission : తెలంగాణ మహిళా కమిషన్లో ఉద్యమ కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!
- CM Revanth Reddy : ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశానికే నంబర్ వన్ చేస్తాం
- HAM Projects : తెలంగాణలో రహదారుల విప్లవం.. 'హ్యామ్' ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక సమీక్ష
- Hyderabad Census : హైదరాబాద్లో ఇంటింటికీ సర్వే.. మీ ఇంటికీ వస్తున్నారు జాగ్రత్త..!
ఇక, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రయత్నం చేశాయని ఎంపీ లక్ష్మణ్ చెప్పారు. తెలంగాణలో విద్యావంతులు, మేధావులు, టీచర్లు మార్పు కోరుకుంటారన్నది స్పష్టం అవుతోంది.. రాహుల్ గాంధీ అబద్దాల ప్రచారం ప్రజలు నమ్మడం లేదు.. సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి తెలంగాణలో ఉంది అని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికలను రేవంత్ రెడ్డి సాధారణ ఎన్నికలుగా మార్చారు.. ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తుంటే రేవంత్ ఎదురు దాడి చేస్తున్నారు.. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది.. రాష్ట్రంలో మేం అధికారంలో లేము.. అయినా రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. బీజేపీలో సామాన్య కార్యకర్త సైతం జాతీయ అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉందని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Sreeleela: తమిళనాడు కోడలిగా శ్రీలీల..? తాజా కామెంట్స్ హాట్ టాపిక్!
-
Ali : అలీ కీలక పాత్రలో కొత్త సినిమా ప్రారంభం!
-
NBK – Vivek Athreya : వివేక్ ఆత్రేయ సినిమాలో ‘బాలయ్య’ డ్యూయల్ రోల్.. ఊచకోత అన్ లిమిటెడ్
-
CM Vijay: సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. మందుబాబులకు బిగ్ షాక్!
-
Raj Tarun: నిద్రలో నడుస్తూ హత్యలు.. రాజ్ తరుణ్ ‘టార్టాయిస్’ ఫస్ట్ లుక్ రిలీజ్!
ట్రెండింగ్
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..