BJP MP Laxman: తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగాం.. ఎదురులేని శక్తిగా ఎదుగుతాం
- ఎమ్మెల్సీ ఎన్నికల తీర్పు రేవంత్ రెడ్డి పాలనకు రెఫరెండం..
- తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగాo.. ఎదురులేని శక్తిగా ఎదుగుతాం..
- ఢిల్లీకి చక్కర్లు కొట్టడంలో రేవంత్ త్వరలోనే సెంచరీ కొట్టడం ఖాయం: ఎంపీ లక్ష్మణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MP Laxman: ఎమ్మెల్సీ ఎన్నికల తీర్పు రేవంత్ రెడ్డి పాలనకు రెఫరెండం అని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తెలిపారు. డబుల్ ఎమ్మెల్సీ గెలిచాం.. డబులింజన్ సర్కార్ ఖాయం అన్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగాo.. ఎదురులేని శక్తిగా ఎదుగుతామన్నారు. బీజేపీ చేసేదే చెప్తుంది, చెప్పింది చేస్తుందన్నారు. రాబోయే కాలంలో బీజేపీ గెలుపు కోసం పూర్తిగా ప్రణాళికబద్దంగా ముందుకు పోతామన్నారు. రేవంత్ రెడ్డికి ఇంటి పోరు,హైకమాండ్ పోరు, ప్రజల హోరు తగలిందని ఆయన విమర్శించారు. తెలంగాణలో పాలన పడకేసి, పట్టు సాధించుకోలేక ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.. ఢిల్లీకి చక్కర్లు కొట్టడంలో రేవంత్ రెడ్డి త్వరలోనే సెంచరీ కొట్టడం ఖాయం అని ఎద్దేవా చేశారు. కనీసం మంత్రి వర్గ విస్తరణ లేదు, ఎమ్మెల్సీల ఫైనల్ లేదు.. మిణుకు మిణుకు మంటూ కాంగ్రెస్ కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు.
Read Also: Ranya Rao: నటి కాదు.. పెద్ద కిలాడీ.. వెలుగులోకి రన్యా రావు బాగోతాలు
Also Read
- University of London Hyderabad Campus: హైదరాబాద్లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
- Hyderabad Food Safety Raids: బిగ్బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
- Hyderabad: బిల్డింగ్ కుప్పకూలడానికి అసలు కారణం ఇదే.. గచ్చిబౌలి ఘటనలో సంచలన నిజాలు
- Ranganath: ఇక చుట్టుపక్కల ఉన్న అక్రమ నిర్మాణాలన్నీ కూల్చేస్తాం.. హైడ్రా కమిషనర్ బిగ్ వార్నింగ్
ఇక, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రయత్నం చేశాయని ఎంపీ లక్ష్మణ్ చెప్పారు. తెలంగాణలో విద్యావంతులు, మేధావులు, టీచర్లు మార్పు కోరుకుంటారన్నది స్పష్టం అవుతోంది.. రాహుల్ గాంధీ అబద్దాల ప్రచారం ప్రజలు నమ్మడం లేదు.. సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి తెలంగాణలో ఉంది అని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికలను రేవంత్ రెడ్డి సాధారణ ఎన్నికలుగా మార్చారు.. ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తుంటే రేవంత్ ఎదురు దాడి చేస్తున్నారు.. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది.. రాష్ట్రంలో మేం అధికారంలో లేము.. అయినా రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. బీజేపీలో సామాన్య కార్యకర్త సైతం జాతీయ అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉందని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ వెల్లడించారు.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!