Ranya Rao: నటి కాదు.. పెద్ద కిలాడీ.. వెలుగులోకి రన్యా రావు బాగోతాలు
- వెలుగులోకి నటి రన్యా రావు స్టేట్మెంట్
- నేరాన్ని అంగీకరించిన రన్యా రావు
- రహస్యంగా ఉంచాలని అధికారులకు విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రన్యా రావు కన్నడ నటి. పైగా ఐపీఎస్ ఆఫీసర్ కుమార్తె. ఇప్పుడు ఆమె పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతుంది. ఏదో గొప్ప పని చేసిందనో.. ఘనకార్యం చేసిందనో కాదు. కుటుంబ గౌరవానికి తగ్గట్టుగా ఉండాల్సిన ఆమె.. నీచానికి ఒడిగట్టింది. విదేశాల నుంచి బంగారం స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. లక్ష కాదు.. రెండు లక్షలు కాదు.. ఏకంగా కోట్ల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారంటే.. ఈమె ఎంత పెద్ద కిలాడీనో అర్థం చేసుకోవచ్చు.
మార్చి 3న బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్యారావును కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా.. రూ.12 కోట్ల విలువైన 14.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. దుబాయ్ నుంచి ఇలా పలుమార్లు బంగారం స్మగ్లింగ్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. ఆమె ఇంటిని సోదా చేయగా.. అక్కడ కూడా కోట్ల విలువైన బంగారాన్ని గుర్తించినట్లుగా సమాచారం. జనవరి నుంచి మార్చి 3 వరకు దాదాపు 27 సార్లు దుబాయ్ వెళ్లి వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. తన తండ్రి హోదాను అడ్డంపెట్టుకుని.. ఒక కానిస్టేబుల్ సాయంతో ఎలాంటి తనిఖీలు లేకుండా ఎయిర్పోర్టులో ఆమె కథ నడిపించినట్లుగా తెలుస్తోంది. బంగారం బిస్కెట్లు.. తొడలకు స్టిక్కర్లతో అంటించుకుని బయటకు వచ్చేసేదని సమాచారం అయితే ఆమె వెనుక బలమైన రాజకీయ శక్తులు ఉన్నట్లుగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానిస్తు్న్నారు.
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
తాజాగా ఆమె బోగాతానికి సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. యూఏఈ నుంచి ఇటీవల రన్యారావు 17 బంగారు బిస్కెట్లను తీసుకొచ్చారని అధికారులు తెలిపారు. దుబాయ్కు మాత్రమే కాకుండా యూరప్, సౌదీ అరేబియా, అమెరికా, పశ్చిమాసియా దేశాల నుంచి కూడా బంగారం స్మగ్లింగ్ చేసినట్లుగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ తెలిపింది. ఈ విషయాలు ఆమెనే చెప్పినట్లుగా అధికారులు తెలిపారు. అయితే ఈ విషయాలను రహస్యంగా ఉంచాలని ఆమె అధికారులను కోరినట్లు తెలుస్తోంది. తనకు కొంత విశ్రాంతి ఇవ్వాలని.. ఎప్పుడు విచారణకు రమ్మంటే అప్పుడు వస్తానని చెప్పినట్లుగా సమాచారం.
ఇది కూడా చదవండి: Child Trafficking Case: చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో కీలక సూత్రధారి అరెస్ట్
గతేడాది ఆమె 30 సార్లు దుబాయ్కు వెళ్లారని.. ఈ మధ్య కాలంలో కేవలం 15 రోజుల్లో నాలుగుసార్లు విదేశాలకు వెళ్లినట్లుగా అధికారులు గుర్తించారు. ప్రతి ట్రిప్లో కొన్ని కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేసినట్లుగా దర్యాప్తులో తేలిందని అధికారులు పేర్కొన్నారు. స్మగ్లింగ్ చేసినందుకు ప్రతి ట్రిప్కు ఆమెకు రూ.12 లక్షల వరకు ముట్టినట్లు అధికారులు వెల్లడించారు.
రన్యారావు తండ్రి రామచంద్రరావు ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నారు. కుమార్తె స్మగ్లింగ్ వార్త తెలిసి.. గుండె పగిలిపోయిందని ఆయన అన్నారు. స్మగ్లింగ్ గురించి తనకు తెలియదన్నారు. 2024లో జతిన్ హుక్కేరితో రన్యారావు వివాహం జరిగినట్లుగా చెప్పారు. అయితే వారిద్దరూ కలిసి ఉండడం లేదని.. విడిగా ఉండడం వల్ల ఆమె ఇలాంటి పనులు చేస్తుందని చెప్పుకొచ్చారు. ఆమె చర్యలతో తనకు సంబంధం లేదని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే రామచంద్రరావు కూడా ఒక వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. 2014 హవాలా కేసులో పెద్ద మొత్తంలో డబ్బు మాయం చేసినట్లుగా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అలాగే నకిలీ ఎన్కౌంటర్లో ఇద్దరు గ్యాంగ్స్టర్ల మరణాలపై 2016 నుంచి సీఐడీ దర్యాప్తు కేసు కూడా ఉంది. ప్రస్తుతం ఈ కేసులు దర్యాప్తులో ఉన్నాయి.
ఇది కూడా చదవండి: పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!