BJP Poru Sabha: నేడు సరూర్ నగర్ స్టేడియంలో బీజేపీ పోరు సభ.. హాజరుకానున్న జేపీ నడ్డా
- నేడు హైదరాబాద్లోని సరూర్నగర్ స్టేడియంలో బీజేపీ పోరు సభ..
- సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు సభ..
- పాల్గొననున్న కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్తో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Poru Sabha: నేడు హైదరాబాద్లోని సరూర్నగర్ స్టేడియంలో బీజేపీ పోరు సభ నిర్వహిస్తుంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన వైఫల్యాలపై బీజేపీ సభ నిర్వహించనుంది. 6 అబద్ధాలు, 66 మోసాలు అనే నినాదంతో కాంగ్రెస్ వైఫల్యాలను బట్టబయలు చేయాలని బీజేపీ నిర్ణయించింది. హైదరాబాద్లోని సరూర్నగర్ స్టేడియంలో జరిగే సమావేశానికి కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్తో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. బీజేపీ సభకు ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి జన సమీకరణ చేశారు.
Read also: Astrology: డిసెంబర్ 07, శనివారం దినఫలాలు
Also Read
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
- Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
- Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
కాగా.. శుక్రవారం సరూర్ నగర్ స్టేడియంలో సభ ఏర్పాట్లను ఎంపీపీ ఈటల రాజేందర్, నాయకులు చింతల రామచంద్రారెడ్డి, రామచంద్రరావు, ప్రేమేందర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు తదితరులు పరిశీలించారు. సాయంత్రం 5.30కి బేగంపేట విమానాశ్రయానికి నడ్డా చేరుకుంటారని తెలిపారు. సాయంత్రం 6.15 నుంచి 7.45 వరకు సరూర్ నగర్ స్టేడియంలో బీజేపీ సభలో పాల్గొంటారు. రాత్రి 8.25 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి తిరిగివెళ్లనున్నారు. కాగా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను బహిరంగ సభలో బయటపెట్టి ఇచ్చిన హామీలను అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానన్నారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు బీజేపీ నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ ఇదే కావడం గమనార్హం.
Gaza: గాజాలో అంతులేని అగచాట్లు.. ఆకలి కేకలతో అల్లాడుతున్న పాలస్తీనియన్లు
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!