BJP Poru Sabha: నేడు సరూర్ నగర్ స్టేడియంలో బీజేపీ పోరు సభ.. హాజరుకానున్న జేపీ నడ్డా
- నేడు హైదరాబాద్లోని సరూర్నగర్ స్టేడియంలో బీజేపీ పోరు సభ..
- సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు సభ..
- పాల్గొననున్న కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్తో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా..
BJP Poru Sabha: నేడు హైదరాబాద్లోని సరూర్నగర్ స్టేడియంలో బీజేపీ పోరు సభ నిర్వహిస్తుంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన వైఫల్యాలపై బీజేపీ సభ నిర్వహించనుంది. 6 అబద్ధాలు, 66 మోసాలు అనే నినాదంతో కాంగ్రెస్ వైఫల్యాలను బట్టబయలు చేయాలని బీజేపీ నిర్ణయించింది. హైదరాబాద్లోని సరూర్నగర్ స్టేడియంలో జరిగే సమావేశానికి కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్తో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. బీజేపీ సభకు ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి జన సమీకరణ చేశారు.
Read also: Astrology: డిసెంబర్ 07, శనివారం దినఫలాలు
కాగా.. శుక్రవారం సరూర్ నగర్ స్టేడియంలో సభ ఏర్పాట్లను ఎంపీపీ ఈటల రాజేందర్, నాయకులు చింతల రామచంద్రారెడ్డి, రామచంద్రరావు, ప్రేమేందర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు తదితరులు పరిశీలించారు. సాయంత్రం 5.30కి బేగంపేట విమానాశ్రయానికి నడ్డా చేరుకుంటారని తెలిపారు. సాయంత్రం 6.15 నుంచి 7.45 వరకు సరూర్ నగర్ స్టేడియంలో బీజేపీ సభలో పాల్గొంటారు. రాత్రి 8.25 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి తిరిగివెళ్లనున్నారు. కాగా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను బహిరంగ సభలో బయటపెట్టి ఇచ్చిన హామీలను అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానన్నారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు బీజేపీ నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ ఇదే కావడం గమనార్హం.
Gaza: గాజాలో అంతులేని అగచాట్లు.. ఆకలి కేకలతో అల్లాడుతున్న పాలస్తీనియన్లు
తాజావార్తలు
-
Islamabad Talks: ఇరాన్-అమెరికా చర్చలపై ఉత్కంఠ.. ఇస్లామాబాద్లో మాత్రం లాక్డౌన్
-
Genelia D’Souza: స్టేజి పైనే వెక్కి వెక్కి ఏడ్చిన హా.. హా.. హాసిని.! వీడియో వైరల్..
-
Gayatri Gupta: ఇంట్లో 10 కత్తులు దాచుకున్నా.. క్యాస్టింగ్ కౌచ్పై గాయత్రి గుప్తా షాకింగ్ కామెంట్స్!
-
Trump: ఇరాన్ అణు కేంద్రాలు ధ్వంసం చేశాం.. ఫేక్ మీడియా హైలెట్ చేయలేదు.. ట్రంప్ ధ్వజం
-
India Defense New Weapons: రక్షణ వ్యవస్థలోకి భారీగా కొత్త ఆయుధాలు.. ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన కీలక మార్పులు ఇవే..!
ట్రెండింగ్
-
200% వాల్యూమ్ బూస్ట్, 144Hz స్క్రీన్ + 7000mAh బ్యాటరీ.. బడ్జెట్లోనే POCO M8s 5G లాంచ్.!
-
Apple CEO: టిమ్ కుక్ రాజీనామా.. కొత్త సీఈఓగా జాన్ టెర్నస్ బాధ్యతలు.!
-
Masala Vada Recipe: బండి మీద అమ్మేలా కరకరలాడే ‘మసాలా వడలు’.. ఈ చిట్కాలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!
-
Body Odor: చెమట వాసనతో ఇబ్బంది.? డియోడ్రెంట్ కాదు.. ఈ ఒక్క ‘పటిక’ చాలు.!
-
Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!