BJP MP Laxman: రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడని ఖర్గే కలలు కంటున్నారు..
- మోడీ పాలనపై మల్లికార్జున ఖర్గే విషం చిమ్మారు..
- రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడని ఖర్గే కలలు కంటున్నారు..
- రేవంత్ రెడ్డి మూడు రోజులు ఢిల్లీలో పడిగాపులు పడ్డాడు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MP Laxman: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 11 ఏళ్ల పాలన పైనా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే విషం చిమ్మారు అని బీజేపీ ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. మీడియా స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇచ్చారు.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశారు మోడీ.. దేశంలో అభివృద్ధి తారాస్థాయికి చేరుకుంటుంది అని గుర్తు చేశారు. కానీ, ఎమర్జెన్సీ పెట్టింది కాంగ్రెస్ అని మండిపడ్డారు. అయితే, ప్రపంచంలో నాల్గవ ఆర్థిక శక్తిగా భారత్ చేరుకుంది.. బీజేపీ, మోడీకి పెరుగుతున్న ఆదరణను కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోతుందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్.
Read Also: Viral Video: నదిలో చిక్కుకున్న టయోటా ఫార్చ్యూనర్.. నిమిషాల్లోనే లాగేసిన ఏనుగు.. వీడియో వైరల్
Also Read
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
- Off The Record: తెలంగాణలో అధికారమే లక్ష్యం.. సింగరేణి నుంచే ఆపరేషన్ మొదలు?
- Pawan Kalyan: రేపు హైదరాబాద్కు పవన్ కల్యాణ్.. ఫిజియోథెరపీ తప్పనిసరి
- TG TET 2026 Results: టెట్ ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
ఇక, పేదరికం అనుభవించిన వ్యక్తి మోడీ అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. మోడీనీ కులం పేరుతో రాహుల్ గాంధీ దూషించారు.. ఇక, రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడని ఖర్గే భయంకరమైన కలలు కంటున్నాడు అని ఎద్దేవా చేశారు. దేశంలో యువత ఉద్యోగాలు చేసే వారుగా కాకుండా.. ఉద్యోగాలు ఇచ్చే వారీగా తయారు చేస్తున్నారు మోడీ అని పేర్కొన్నారు. ఓబీసీ రిజర్వేషన్లను అడ్డుకుంది రాహుల్ గాంధీ కుటుంబం.. ప్రపంచ వ్యాప్తంగా దేశ ప్రతిష్ట పెరుగుతుంటే.. మోడీనీ నాయకునిగా కీర్తిస్తుంటే గర్వకారణం కాదా అనేది ఖర్గే చెప్పాలని ఓబీసీ మోర్చ అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
Read Also: Tirumala: తిరుమలకు రికార్డుస్థాయిలో భక్తులు.. హుండీ ఆదాయం..!
అయితే, ఆపరేషన్ సింధూర్ లాంటి దాడులతో పాకిస్తాన్ కు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా చెశారా అని ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు. మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో భారత ప్రజలు లేరు.. రేవంత్ రెడ్డి మూడు రోజులు ఢిల్లీలో పడిగాపులు పడ్డారు.. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదు అని విమర్శించారు. ఇది తెలంగాణ ప్రజలకు అవమానం.. గతంలో అంజయ్యకు కూడా అవమానం జరిగింది.. ఢిల్లీకి వెళ్ళి కలవడంలో తప్పులేదు.. కానీ, ఇలా పడిగాపులు పడడం తెలంగాణ ప్రజలకు అవమానం అని పేర్కొన్నారు. ఇక, బీజేపీ వెనుక రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు చేయదు.. ఏదైనా సరే ముందు నుంచే చేస్తుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!