Bandi Sanjay: సురవరం.. నిరంతరం పేదల కోసమే తపించారు
సురవరం సుధాకర్రెడ్డి.. నిరంతరం పేదల అభ్యున్నతి కోసమే పాటుపడిన నాయకుడు అని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. సురవరం సుధాకర్రెడ్డి మృతి పట్ల కేంద్రమంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు సంతాపం తెలిపారు. సురవరం సుధాకర్ రెడ్డి మరణం బాధాకరం అన్నారు. సౌమ్యుడు, మృధుస్వభావి, అందరితో కలిసి మెలిసి ఉంటూ నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పనిచేసిన నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి అని బండి సంజయ్ కొనియాడారు.
ఇది కూడా చదవండి: US-India: టారిఫ్ ఉద్రిక్తతల వేళ ట్రంప్ కీలక నిర్ణయం.. భారత్లో నూతన రాయబారి నియామకం
Also Read
తెలంగాణకు చెందిన సురవరం సుధాకర్ రెడ్డి సామాన్య కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి సీపీఐ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి గా పనిచేసి గుర్తింపు పొందడం గొప్ప విషయం అన్నారు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు. సురవరం ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
రామచంద్రరావు..
ఇక సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సంతాపం తెలిపారు. అనారోగ్యంతో మరణించారన్న వార్త తీవ్రంగా బాధించిందన్నారు. తెలుగు వ్యక్తి సీపీఐ జాతీయ పార్టీ కార్యదర్శి గా పనిచేయడం జరిగిందని.. జాతీయ పార్టీకి నాయకత్వం వహించారని చెప్పారు. తెలుగు వ్యక్తి ఉన్నత స్థానానికి ఎదిగి గుర్తింపు పొందారని… సౌమ్యుడిగా.. అందరితో కలిసి మెలిసి ఉండేవారని.. గొప్ప మేధావిగా అభివర్ణించారు. వారి మరణం తెలుగు ప్రజలకు తీరనిలోటు అన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు పనిచేసిన వ్యక్తి అని.. సమాజం కోసం, పేద, బడుగు, బలహీన వర్గాల కోసం పనిచేసిన వ్యక్తి అని తెలిపారు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
ఇది కూడా చదవండి: US: న్యూయార్క్లో బస్సు బోల్తా.. ఐదుగురు మృతి.. భారతీయులుగా అనుమానం!
కమ్యూనిస్టు దిగ్గజం, సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్రెడ్డి (83) హైదరాబాద్ గచ్చిబౌలి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మరణవార్త తెలియగానే పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఇక మరణం పట్ల రాజకీయ ప్రముఖులంతా సంతాపం తెలిపారు.
తాజావార్తలు
-
Vivo T5x 5G: భారీగా తగ్గిన వివో T5x 5G ధర.. 50MP Sony కెమెరా + 120Hz డిస్ప్లే + 7200mAh
-
Donald Trump: ఎఫ్బీఐ చీఫ్ కాష్ పటేల్ను టార్గెట్ చేసిన ట్రంప్..!
-
Top 3 Scooters: 51 లక్షల యూనిట్ల అమ్మకాలు.. జనం ఎగబడి కొంటున్న టాప్ 3 స్కూటర్లు ఇవే.. ధరలు, మైలేజ్ & ఫీచర్లు
-
Paranormal Activity: పెట్టింది రూ.12 లక్షలు.. కొల్లగొట్టింది రూ.16 వేల కోట్లు! సినిమా చరిత్రలోనే అతిపెద్ద మిరాకిల్..
-
Green Moong Dal Laddu: ప్రోటీన్ పుష్కలంగా ఉండే పెసరపప్పు బెల్లం లడ్డు.. పిల్లల కోసం అదిరిపోయే హెల్దీ స్నాక్.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!