US-India: టారిఫ్ ఉద్రిక్తతల వేళ ట్రంప్ కీలక నిర్ణయం.. భారత్లో నూతన రాయబారి నియామకం
- టారిఫ్ ఉద్రిక్తతల వేళ ట్రంప్ కీలక నిర్ణయం
- భారత్లో నూతన రాయబారి నియామకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-అమెరికా మధ్య టారిఫ్ ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్కు నూతన రాయబారిగా సెర్గియో గోర్ను నియమించారు. తన సన్నిహితుడు, రాజకీయ సహాయకుడు సెర్గియో గోర్(38)ను భారత రాయబారిగా నియమించినట్లు సోషల్ మీడియాలో ట్రంప్ పేర్కొన్నారు. విదేశాంగ విధానంలో సెర్గియో గోర్ అనుభవం కలిగిన వ్యక్తి అని.. రాయబారిగా అద్భుతంగా పని చేస్తారని ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో ట్రంప్ కితాబు ఇచ్చారు. సెర్గియో గోర్ దక్షిణ-మధ్య ఆసియాకు ప్రత్యేక రాయబారి పాత్రను నిర్వహిస్తారని ట్రంప్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: US: న్యూయార్క్లో బస్సు బోల్తా.. ఐదుగురు మృతి.. భారతీయులుగా అనుమానం!
Also Read
- Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
- Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
- Donald Trump: “అమెరికా క్షీణించింది 100% నిజమే”.. జిన్పింగ్ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన పోస్ట్..!
- UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య సుంకాల ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భారత్పై 50 శాతం సుంకాన్ని ట్రంప్ విధించారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ సన్నిహితుడైన సెర్గియో గోర్ను భారత రాయబారిగా ట్రంప్ నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తిరిగి ఇరు దేశాల మధ్య సంబంధాలను బలపరుస్తారా? లేదంటే ఆజ్యం పోస్తారో చూడాలి.
ఇది కూడా చదవండి: Off The Record: ఆ మాజీ ఎమ్మెల్యే దంపతులు టీడీపీని బెదిరిస్తున్నారా..?
సెర్గియో గోర్.. ట్రంప్కు అత్యంత విధేయుడు. వైట్హౌస్లో ట్రంప్కు అత్యంత నమ్మకస్థుడు. ఇక గోర్కు కూడా ఎలాన్ మస్క్ కూడా శత్రువే. ఇద్దరి మధ్య సరైన సంబంధాలు లేవు. ఎలాన్ మస్క్ను పాము లాంటివాడని ముద్ర వేశాడు. ఇక దౌత్యవేత్తల నియామకంలో ఎక్కువగా సన్నిహితులకే ట్రంప్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. అందులో భాగంగానే గోర్ను భారత రాయబారిగా నియమించారు. ఇక విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఎక్స్లో కీలక పోస్ట్ చేశారు. గోర్ నియామకాన్ని సమర్థించారు. అతి ముఖ్యమైన సంబంధాల్లో ఒకదానికి అద్భుతమైన ప్రతినిధిగా ఉంటారని తెలిపారు.

తాజావార్తలు
-
Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
-
Virat Kohli: కెప్టెన్గా కాదు.. స్నేహితుడిగా జట్టును నడిపించా.!
-
CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
-
Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
-
RBI Cancels 150 NFBC License: 150 ఎన్బిఎఫ్సి కంపెనీల ఆర్బీఐ కొరఢా.. లైసెన్సులు రద్దు
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!