US-India: టారిఫ్ ఉద్రిక్తతల వేళ ట్రంప్ కీలక నిర్ణయం.. భారత్లో నూతన రాయబారి నియామకం
- టారిఫ్ ఉద్రిక్తతల వేళ ట్రంప్ కీలక నిర్ణయం
- భారత్లో నూతన రాయబారి నియామకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-అమెరికా మధ్య టారిఫ్ ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్కు నూతన రాయబారిగా సెర్గియో గోర్ను నియమించారు. తన సన్నిహితుడు, రాజకీయ సహాయకుడు సెర్గియో గోర్(38)ను భారత రాయబారిగా నియమించినట్లు సోషల్ మీడియాలో ట్రంప్ పేర్కొన్నారు. విదేశాంగ విధానంలో సెర్గియో గోర్ అనుభవం కలిగిన వ్యక్తి అని.. రాయబారిగా అద్భుతంగా పని చేస్తారని ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో ట్రంప్ కితాబు ఇచ్చారు. సెర్గియో గోర్ దక్షిణ-మధ్య ఆసియాకు ప్రత్యేక రాయబారి పాత్రను నిర్వహిస్తారని ట్రంప్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: US: న్యూయార్క్లో బస్సు బోల్తా.. ఐదుగురు మృతి.. భారతీయులుగా అనుమానం!
Also Read
- Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య సుంకాల ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భారత్పై 50 శాతం సుంకాన్ని ట్రంప్ విధించారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ సన్నిహితుడైన సెర్గియో గోర్ను భారత రాయబారిగా ట్రంప్ నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తిరిగి ఇరు దేశాల మధ్య సంబంధాలను బలపరుస్తారా? లేదంటే ఆజ్యం పోస్తారో చూడాలి.
ఇది కూడా చదవండి: Off The Record: ఆ మాజీ ఎమ్మెల్యే దంపతులు టీడీపీని బెదిరిస్తున్నారా..?
సెర్గియో గోర్.. ట్రంప్కు అత్యంత విధేయుడు. వైట్హౌస్లో ట్రంప్కు అత్యంత నమ్మకస్థుడు. ఇక గోర్కు కూడా ఎలాన్ మస్క్ కూడా శత్రువే. ఇద్దరి మధ్య సరైన సంబంధాలు లేవు. ఎలాన్ మస్క్ను పాము లాంటివాడని ముద్ర వేశాడు. ఇక దౌత్యవేత్తల నియామకంలో ఎక్కువగా సన్నిహితులకే ట్రంప్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. అందులో భాగంగానే గోర్ను భారత రాయబారిగా నియమించారు. ఇక విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఎక్స్లో కీలక పోస్ట్ చేశారు. గోర్ నియామకాన్ని సమర్థించారు. అతి ముఖ్యమైన సంబంధాల్లో ఒకదానికి అద్భుతమైన ప్రతినిధిగా ఉంటారని తెలిపారు.

తాజావార్తలు
-
Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
-
Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
-
సమంతకు ముందే.. గర్భంతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రసవాన్నే సినిమాలో చూపించారు!
-
QR Code Mandatory on Medicines: ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. ఇకపై అసలైన, నకిలీ మందులను క్షణాల్లో గుర్తించొచ్చు!
-
Raja Shivaji OTT: బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన ‘రాజా శివాజీ’.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!