హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ ఎన్నికలకు సిద్దమవుతోంది తెలంగాణ కాంగ్రెస్. పార్టీ అభ్యర్ధి ఎంపిక కసరత్తు మొదలుపెట్టింది. పార్టీ గెలుస్తుందని ఎవరు అనుకోవడం లేదు.. కానీ, పోటీలో కూడా లేకుండా పోతే ఎలా అని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. వీలైనంత త్వరగా అభ్యర్ధి ఎంపిక చేయాలనే ఆలోచనలో పార్టీ ఉంది. బలమైన పోటీ ఇచ్చే అవకాశం ఎవరికి ఉంటుందనే లెక్కలు వేస్తోంది. దీంట్లో భాగం… మాజీ మంత్రి కొండా సురేఖ పేరు పరిశీలిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. అయితే అందుకు కొండా సురేఖ సుముఖంగా ఉన్నారా, లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. ఇప్పుడున్న పరిస్థితిలో బరిలో దిగితే.. భవిష్యత్ ఎలా ఉంటుందనే ఆలోచన కూడా కొండా ఫ్యామిలీ చేస్తున్నట్టు సమాచారం. కొండా సురేఖను బరిలో నిలిపితే.. నాన్ లోకల్ అనేది సమస్యగా మారే ప్రమాదం ఉంది.
Read Also : “బిగ్ బాస్-5” కంటెస్టెంట్స్ క్వారంటైన్ అప్పటి నుంచే…?
Also Read
- Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం
- Tragedy : చిలకలగూడలో దారుణం.. బీటెక్ విద్యార్థిని వెంటాడి, కత్తులతో పొడిచి దారుణ హత్య.!
- Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
- CM Revanth Reddy : నేడు కొడంగల్లో సీఎం రేవంత్రెడ్డి పర్యటన.. రూ. 364 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.!
ఇక అదే నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి సతీమణి పెరుపైనా పార్టీలో చర్చ జరుగుతోంది. లేదంటే దామోదర రెడ్డి కుమారుణ్ణి బరిలో నిలిపితే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చేస్తున్నారు. ఆయన అధికార టీఆర్ఎస్ ను కాదని కాంగ్రెస్ లోకి వస్తారా..? అనే టాక్ కూడా ఉంది. అభ్యర్ధి రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉండాలనుకుంటే.. హుజురాబాద్ కిసాన్ కాంగ్రెస్ సెల్ నాయకుడు పత్తి కృష్ణారెడ్డి పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. దళిత సామాజికవర్గంకి చెందిన.. కరీంనగర్ dcc అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ పేరు కూడా పరిశీలనలో ఉంది. మొత్తంమీద అన్ని సమీకరణాలపై చర్చలు జరుపుతోంది హస్తం పార్టీ. టీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రధాన పోరు ఉన్న ఈ ఎన్నికను.. కాంగ్రెస్ అంత ప్రతిష్టాత్మకంగా తీసుకోకపోయినా.. తమ ఓటు బ్యాంకును కాపాడుకుంటూ పరువు నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలని చూస్తోంది.
తాజావార్తలు
-
CM Chandrababu: మంత్రుల రివ్యూకు మినహాయింపు ఉండదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్!
-
Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం
-
LED Smart TV: స్మార్ట్ టీవీలపై బంపర్ డీల్స్.. ఎల్ఈడీ స్మార్ట్ టీవీ రూ. 5499కే..
-
Parenting Tips : పిల్లల పెంపకంలో మీరు ఈ మాటలు వాడుతున్నారా.? అయితే జాగ్రత్త..!
-
Lavanya Tripathi: చిరంజీవిపై లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!