హుజూరాబాద్ దేశానికి, రాష్ట్రానికి దిక్సూచి: ఈటల రాజేందర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంగారెడ్డి జిల్లా బీజేపీ శిక్షణ తరగతుల్లో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పై విమర్శల వర్షం కురిపించారు. గొప్ప రాజ్యాంగం ఉన్న ఈ దేశంలో.. హుజూరాబాద్లో కేసిఆర్ నియంతృత్వంతో స్వేచ్ఛను హరించారన్నారు. స్వేచ్ఛ మీద ఉక్కుపాదం పెట్టారు. అందుకే అక్కడ ప్రజలు బయటికి మాట్లాడకుండా ఉండి అవకాశం వచ్చినపుడు ఓటుతో తమ శక్తిని చూపించారని ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ కోరలు పీకారు. చెంప చెళ్లుమనిపించి చరిత్ర నిర్మాతలు ప్రజలేనని నిరూపించారన్నారు. హుజురాబాద్ యావత్ దేశానికి రాష్ర్టానికి దిక్సూచి అని దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపిందన్నారు. ఒకప్పుడు నాయకుడు అంటే త్యాగమని.. కానీ నేడు నాయకుడు అంటే వ్యాపారం అనే భావనకు ఈ ప్రభుత్వం తీసుకువచ్చిందని విమర్శించారు.
25 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నాను. ప్రజల ప్రేమను చూసినవాడిని. ఉద్యమంలో ఎలా ప్రజలు కొట్లాడమని ముందుకు నడిపించారని, ఇప్పుడు కూడా అలానే కొట్లాడుతానని ఆయన అన్నారు. కేసీఆర్ కొనసాగడం ప్రజాస్వామ్యానికే అరిష్టం అని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారని ఎద్దేవా చేశారు.కేసీఆర్ ఏం చేసినా.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మార్పు తథ్యం అన్నారు. కాంగ్రెస్కి ఓటు వేస్తే వారు టీఆర్ఎస్లోకి వెళ్తున్నారన్నారు. యాంటి డిఫెక్షన్ లా ను అపహస్యం చేసిన వాడు కేసీఆర్ అని పేర్కొన్నారు.
Also Read
- TGSRTC Bus Route Changes: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్వే ఎఫెక్ట్... ఆర్టీసీ బస్సు రూట్లలో కీలక మార్పులు.. పూర్తి వివరాలు ఇవిగో..
- CM Revanth Reddy UK, USA Tour: సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. కీలక భేటీలు.. ఆగస్టు 20 నుంచి 30 వరకు పూర్తి షెడ్యూల్
- CM Revanth Reddy: గౌడన్నలకు సీఎం రేవంత్ బిగ్ హామీ.. గీత కార్మికుల కోసం కీలక ప్రకటనలు
- Adulterated Ghee: పాడైపోయిన క్రీమ్తో నెయ్యి దందా.. 25 టన్నుల నకిలీ నెయ్యి పట్టివేత..
అప్పుడు టీడీపీనీ, ఇప్పుడు 119 లో 90 మంది గెలిచినా కూడా కాంగ్రెస్ ను విలీనం చేసుకున్నాడని దుయ్యబట్టారు. నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారా? నమ్మకాన్ని అమ్ముకుంటున్నారా అనేది ప్రజలు గమనిస్తున్నారన్నారు. రంగారెడ్డి జిల్లాలో బీజేపికి మంచి అవకాశం ఉంది. పార్టీ మారిన నాయకులందరినీ వెనక్కు పిలవండి. ప్రజలకు విశ్వాసం కల్పించాలని, టీఆర్ఎస్ను నిలువరించి బొందపెట్టే పార్టీ ఒక్క బీజేపీనేనని ఆయన అన్నారు. మోడీ ప్రధాని అయిన తర్వాత భారత్ అభివృద్ధిలో దూసుకెళ్తుందని, కేంద్రంలో కనుచూపు మేరలో వేరే ఏ పార్టీ పోటీలో లేదని ఈటల అన్నారు.
తాజావార్తలు
-
AAP: ఆప్కు బిగ్ షాక్.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్..
-
Colgate: కొల్గేట్ ప్రియులకు షాక్.. టూత్పేస్ట్ ధరలు పెరగనున్నాయా?
-
VMC Contractors Strike: వీఎంసీ కాంట్రాక్టర్లతో మంత్రి నారాయణ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
-
Sonia Gandhi: ‘బిలాంగింగ్’ పేరుతో సోనియాగాంధీ ఆత్మకథ.. రాజీవ్గాంధీతో ప్రేమ ముచ్చట్లు
-
Hockey World Cup 2026: మహిళల హాకీ ప్రపంచకప్లో భారత్ జోరు.. దక్షిణాఫ్రికాపై 6-1 ఘన విజయం
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!