Etela Rajender: వేరే పార్టీ ర్తు మీద గెలిచినా వాళ్లకు మంత్రి పదవి ఎలా కట్టబెట్టారు? ఇదెక్కడి ప్రజాస్వామ్యం? అని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మండిపడ్డారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మీరెలా 8 ఏళ్లలో ప్రతిపక్షాలను పడగొట్టి చెడగొట్టరో మేము కూడా దేశంలో ఉన్న అన్ని కోర్టులకు, మేధావులకు డేటా పంపిస్తామన్నారు. దీని మీద చర్చ పెట్టుకుందాం రా అంటూ సవాల్ విసిరారు. రాష్ట్రం ఏర్పడ్డ వెంఠనే టీవీ ఛానెల్స్ మీడియా మీద ఆంక్షలు విధించింది మీరు కాదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ రాసిన స్క్రిప్ట్ ను కొన్ని ఛానల్స్ పని గట్టుకొని చూపిస్తున్నాయని ఆరోపించారు. సీపీఎం పార్టీ ఛానల్ ను సీఎం స్వాధీనం తీసుకున్నారని మండిపడ్డారు. పెద్ద పెద్ద టీవీ ఛానెల్స్ ను బెదిరించి లోంగదిసుకుంటున్నాడని అన్నారు. మీ అహంకారంకు దుర్మార్గాలకు ఇవి నిదర్శనమన్నారు. సీఎం కేసిఆర్ తో దేశం అదోగతి పాలవుతుందని, మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. సీఎం వెల్లడించిన బాధనే మేము తెలంగాణలో అనుభవిస్తున్నామన్నారు.
Read also: Andhra Pradesh: పోస్టు కార్డుల ఉద్యమం చేపట్టిన టీడీపీ.. ఎందుకంటే..?
లక్షలాది మంది ఉద్యమంలో పాల్గొని, వేల మంది ప్రాణాలు అర్పిస్తే రాష్ట్ర ఏర్పడిందని గుర్తు చేశారు. కేసీఆర్ హయాంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యి అపహస్యనికి గురైందని ఆరోపించారు. కేసీఆర్ మాటలకు చేతలకు పొంతన లేదని అన్నారు. కేసీఆర్ తానే ఒక రాజు, చక్రవర్తిలా రాజ్యం ఏలుతున్నారని ఎద్దేవ చేశారు. ఆ నలుగురూ ఎమ్మెల్యేలు ఏ విధంగా నిప్పు కనికలు అవుతారో రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం, నుంచి ఏ పేరుతో ఎమ్మెల్యే ల కొనుగోలు చేసారు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో సొంత పార్టీ ఎమ్మెల్యే లకు ఉన్న గౌరవం, మర్యాద మాకు ఉండేదని అన్నారు. కాంగ్రెస్ హయాంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నియోజక వర్గానికి మంత్రులు వచ్చిన సమాచారం ఇచ్చి, మేము అడిగిన పనులు చేసేవారన్నారు. 2018 లో 90 ఎమ్మెల్యేల ఉన్న మానవత్వం లేకుండా కాంగ్రెస్ కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకున్నారు? అని ప్రశ్నించారు. ప్రతిపక్షం నుంచి గెలిచిన ఎమ్మెల్యేల కు అభివృద్ది జరగదని బెదిరింపులకు గురి చేస్తోంది నిజాం కాదా? అని ఈటెల రాజేందర్ మండిపడ్డారు.