TS High Court: పోడు భూముల పట్టాల పంపిణీపై స్టేకు హైకోర్టు నిరాకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS High Court: ఏళ్ల తరబడి సమస్యగా ఉన్న పోడు భూములకు పట్టాల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. అయితే.. పోడు భూములకు పట్టాల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుండగా..పోడు భూముల క్రమబద్ధీకరణ చట్ట విరుద్ధమని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ పిటిషన్ను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సోమవారం విచారించింది. కాగా.. పోడు భూములకు పట్టాల పంపిణీపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అయితే.. పోడు భూముల క్రమబద్దీకరణ జరగాలంటే ఆదివాసీల అటవీ హక్కుల చట్టం, నిబంధనలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఈనేపథ్యంలో.. పోడు భూములను క్రమబద్ధీకరించడం చట్ట విరుద్ధమని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అభిప్రాయపడుతోంది. ఈ విషయాన్ని వారి తరఫు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇకపై ఈ భూముల క్రమబద్దీకరణ చేయడం అనేది సుప్రీంకోర్టు తీర్పునకు సైతం ప్రభుత్వ మెమో విరుద్ధంగా ఉందని లాయర్ వాదించారు. ఇక.. మరోవైపు సాగు చేసుకుంటున్న వారికే పోడు భూముల పట్టాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ ములుగు జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త కె. శ్రవణ్ కుమార్ ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డుకోకూడదని.. సాగు చేసుకుంటున్న వారికి పోడు భూమి పట్టాలు ఇచ్చేలా సమర్థించాలని కోర్టును శ్రవణ్ కుమార్ కోరారు.
Read also: Warangal Crime: వైద్యం ముసుగులో క్షుద్రపూజలు.. హనుమకొండలో ఇద్దరు నకిలీ డాక్టర్స్ అరెస్ట్
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
అంతేకాకుండా.. అడవులు, పోడు భూములపై ఆధారపడిన గిరిజనులకు ప్రయోజనాలు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం భావించడం ఆదివాసీల అటవీ హక్కుల చట్టం ఉద్దేశమని శ్రవణ్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ హైకోర్టులో వాదనలు వినిపించారు. కాగా.. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్, శ్రవణ్ కుమార్ తరఫు లాయర్ వాదనలు విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం పోడు భూముల పట్టాల పంపిణీపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. తదుపరి విచారణను జూన్ 22కి వాయిదా వేసింది. అయితే.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
తెలంగాణలో లక్షలాది కుటుంబాలు పోడు భూములపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఈ భూములు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. ఆ భూమిపై ఆదివాసీలు, గిరిజనులు ఎన్నో ఏళ్లుగా తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. తెలంగాణలో కూడా దాదాపు 10 జిల్లాల్లో పోడు భూములున్నాయి. ప్రభుత్వం హరితహారం పథకాన్ని తీసుకొచ్చి అటవీ భూముల్లో మొక్కలు నాటుతోంది. అయితే.. దీని వల్ల అటవీ అధికారులు, ఆ ప్రాంతంలోని గిరిజనులకు మధ్య వివాదం కొనసాగుతోంది. ఇక గత ఏడాది పోడు భూముల పరిరక్షణకు వెళ్లిన ఓ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే.. పోడు భూముల వివాదం నేపథ్యంలో వలస దారులు దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన అటవీ రేంజ్ అధికారి శ్రీనివాసరావు మృతి చెందాడు.
India vs Australia ODI: క్రికెట్ ఫ్యాన్స్కు అలర్ట్.. ఆఫ్లైన్లో విశాఖ వన్డే టికెట్లు
తాజావార్తలు
-
Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
-
TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
-
Today Gold and Silver Prices: పసిడి ధరలో భారీ పతనం.. వెండి కూడా చౌకైంది.. 22, 24 క్యారెట్ ధరలు ఎంతంటే?
-
Peddi vs Drishyam : మోహన్ లాల్కు “పెద్ది” దెబ్బ…. విదేశాల్లోనూ షాకే!
-
Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!