India vs Australia ODI: క్రికెట్ ఫ్యాన్స్కు అలర్ట్.. ఆఫ్లైన్లో విశాఖ వన్డే టికెట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Australia ODI: భారత్ -ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 19వ తేదీన విశాఖ వేదికగా రెండో వన్డే మ్యాచ్ జరగబోతోంది.. ఈ డే అండ్ నైట్ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లను ఇప్పటికే ఆన్లైన్లో విక్రయించింది ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ).. ఆన్లైన్లో పెట్టిన ఆరగంటకే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి టికెట్లు.. పేటీఎం యాప్, పేటీఎం ఇన్ సైడర్ యాప్, ఇన్ సైడర్. ఇన్ వెబ్ల నుంచి టికెట్స్ కొనుగోలు చేశారు క్రికెట్ ఫ్యాన్స్.. వన్డే మ్యాచ్కు సంబంధించిన ఆన్ లైన్ టికెట్ల విక్రయం ముగియడంతో.. ఇక ఆఫ్లైన్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.. అయితే, వారు అప్రమత్తం కావాల్సిన సమయం రానే వచ్చింది.. ఈ రోజు ఆఫ్లైన్లో రెండో వన్డే మ్యాచ్కు సంబంధించిన టికెట్లు విక్రయించనున్నారు.. ఉదయం 10 గంటలకు టికెట్ల విక్రయం ప్రారంభం కానుంది.
Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
- AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
- Vaibhav Sooryavanshi: టీమిండియాలోకి 15 ఏళ్ల వండర్ కిడ్.. వైభవ్ ఎంట్రీతో జట్టులో బలి అయ్యేది ఎవరు?
- Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
ఆఫ్లైన్లో టికెట్ల విక్రయం కోసం విశాఖలో మూడు కేంద్రాలు ఏర్పాటు చేశారు.. పీఎంపాలెం క్రికెట్ స్టేడియం-బి, టౌన్ కొత్తరోడ్డులోని ఇందిరా ప్రియదర్శిని మునిసి పల్ స్టేడియం, గాజువాకలో గల రాజీవ్ గాంధీ క్రీడా ప్రాంగణం వద్ద టికెట్ల విక్రయాలు చేపట్టనున్నారు.. టికెట్ ధరలు రూ.600, రూ.1,500, రూ. 2000, రూ. 3000, రూ.3,500, రూ. 6000గా నిర్ణయించారు.. ఆన్లైన్లో టికెట్లకు వచ్చిన డిమాండ్ చూస్తే.. ఆఫ్లైన్ కోసం కూడా భారీగా డిమాండ్ ఉండే అవకాశం ఉంది.. దీంతో.. కౌంటర్ల వద్ద తోపులాట, తొక్కిసలాటలకు తా వివ్వకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.. కాగా, ఇప్పటికే ఆస్ట్రేలియాపై టెస్ట్ సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది భారత్.. నాల్గో టెస్ట్ డ్రాగా ముగిసిన విషయం విదితమే.. ఇక. ఇప్పుడు మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.. తొలి వన్డే ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ నెల 17న జరగనుండగా.. రెండో వన్డే 19వ తేదీన విశాఖపట్నంలో నిర్వహిస్తారు.. మూడో వన్డే చెపాక్ స్టేడియంలో జరుగుతుంది. విశాఖపట్నంలో చివరిసారిగా వన్డే మ్యాచ్ 2019లో జరిగింది. గత ఏడాది మాత్రం ఇక్కడ ఒక టీ20 మ్యాచ్ మాత్రమే జరిగింది. నాలుగేళ్ల తర్వాత వన్డే మ్యాచ్ విశాఖలో జరుగుతుండడంతో.. క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
-
Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై “సింగం” ఫార్ములా బ్లాక్బస్టర్!!
-
Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!