Telangana Rains: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Rain Updates: తెలంగాణలో వర్షాలు కురిసి దాదాపు 15 రోజులు కావస్తోంది. జూలై చివరి వారంలో కురిసిన వర్షాలు ఎడతెరిపి లేకుండా మాయమయ్యాయి. రైతులకు ఆగస్టు నెల కీలకం.. వరుణుడు ముఖం చాటేశాడు. ఎదుగుదల దశలో వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. చాలా రోజుల తర్వాత రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి.
Read also: Tulsi Archana: వేంకటేశ్వర స్వామి తులసి అర్చన.. విశేష స్తోత్ర పారాయణం
Also Read
- Hyderabad Traffic Alert: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ఈ దారుల్లో వెళ్తే ట్రాఫిక్లో చిక్కుకోవాల్సిందే! కంప్లీట్ రూట్ మ్యాప్ ఇదే
- Extends Working Hours : తెలంగాణ ప్రజలకు ఊరట.. ఈ కార్యాలయాల్లో పెరిగిన పనివేళలు
- PM Modi Hyderabad Tour: ప్రధాని మోడీ సభకు సర్వం సిద్ధం.. పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ పోలీసుల రక్షణ వలయం!
- Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్రెడ్డి
వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి ఏర్పడడంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సముద్ర మట్టానికి 7.6 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో గురువారం (ఆగస్టు 17) ఏర్పడిన అల్పపీడనం చురుగ్గా ఉందన్నారు. దీని ప్రభావంతో నేడు, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ఆదిలాబాద్, కుమురభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్లో సీఎస్ శాంతికుమారి మాట్లాడారు. కలెక్టరేట్లలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కీలక ఆదేశాలు జారీ చేశారు.
Read also: Astrology: ఆగస్టు 19, శనివారం దినఫలాలు
తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లిలో అత్యధికంగా 10.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షపాతం నమోదైంది. భూపాలపల్లి జిల్లా చాల్పూర్లో 7.95, ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలో 7.6, భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లో 5.76 సెం.మీ. వర్షం పడింది. ములుగు జిల్లా కన్నాయిగూడెంలో 5.6, ఏటూరు నాగారంలో 5.1, వెంకటాపురంలో 5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల, కుమురంభీం-ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. హైదరాబాద్ నగరంలో పలుచోట్ల వర్షం కురిసింది. నగర శివార్లలో చిరు జల్లులు పడ్డాయి.
Venkateswara Stotram: తొలి శ్రావణ నాడు ఈ అభిషేకం వీక్షిస్తే సుఖజీవితాన్ని గడుపుతారు
తాజావార్తలు
-
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం