Damodar Raja Narasimha: పేదవారికి మెరుగైన వైద్యం అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం..
- అన్ని జిల్లాల డీఎంహెచ్ఓలతో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష..
- ప్రైవేటు హస్పత్తుల్లో డీఎంహెచ్ఓలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు..
- పేదవారికి మెరుగైన వైద్యం అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం: దామోదర రాజనర్సింహ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్ని జిల్లాల డీఎంహెచ్ఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డీఎంహెచ్ఓలు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలన్నారు.. ప్రజారోగ్యాన్ని బలోపేతం చేస్తున్నామన్నారు.. డీఎంహెచ్ఓలు ప్రైవేటు ఆసుపత్రులలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. పేదవారికి మెరుగైన వైద్యం అందించడమే మా ప్రభుత్వ ప్రాధాన్యం అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్యారోగ్య సేవా కార్యక్రమాల ప్రోగ్రాములను ఎలా కో- ఆర్డినేట్ చేయాలనే దానిపై డిఎంహెచ్ఓలకు మంత్రి దిశానిర్థేశం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్య ఆరోగ్య సేవలను ప్రజలకు అందించడంలో డీఎంహెచ్ఓలది గురుతరమైన బాధ్యత అని దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.
Read Also: SS Rajamouli on Kalki 2898 AD: కల్కి 2898 ఏడీపై ప్రశంసలు కురిపించిన దర్శకధీరుడు
Also Read
- TS Police Recruitment 2026: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 5,000 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్!
- BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
- OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
- SHAKTI : తెలంగాణలో కార్మిక, ఉపాధి శాఖ పేరు మార్పు.. ఇకపై ‘శక్తి’ శాఖగా..
ఇక, జిల్లా, ఏరియా, పీహెచ్సీల మధ్య భౌగోళికంగా కనెక్టివిటీపై దృష్టి సారించాలని డీఎంహెచ్ఓలకు మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ప్రతి 30 కిలోమీటర్ల దూరంలో ఒక ప్రభుత్వ హెల్త్ సెంటర్ ఉండాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేటు ఆసుపత్రుల లైసెన్స్ రద్దు చేయాలి అని చెప్పారు. తదుపరి సమావేశానికి డీఎంహెచ్ఓలు పూర్తి సమాచారంతో రావాలి అని తెలిపారు. పేదవాడికి ప్రమాణాలతో కూడిన మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలి.. ఆసుపత్రుల్లో ప్రభుత్వ వైద్యుల అటెండెన్స్ తప్పనిసరిగా మెయింటైన్ చేయాలి.. జిల్లాల వారిగా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలు డీఎంహెచ్ఓలదే బాధ్యత అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలలో సిబ్బంది కొరత లేకుండా చూడాలి అని వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు.
Read Also: TG SSC Supplementary Results 2024: రేపు పదవ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు..
ఇక, మౌలిక సదుపాయాల కల్పన కు ప్రాధాన్యత ఇవ్వాలి అని దామోదర రాజనర్సింహ తెలిపారు. శానిటేషన్ వ్యవస్థ మెరుగుపడేలా చర్యలు చేపట్టాలి.. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.. రోగులకు మెరుగైన డైట్ ను అందించాలి.. డాక్టర్లు విధిగా సమయపాలన, మెరుగైన వైద్య సేవలను అందించేలా డీఎంహెచ్ఓలు నిరంతరం పర్యవేక్షించాలి.. ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కలిగేలా విస్తృత సేవలను అందించాలని మంత్రి ఆదేశించారు. ఆరోగ్య మందిర్లలో అదనపు సేవలను అందించడానికి కృషి చేయాలన్నారు. డీఎంహెచ్ఓల పని తీరును మెరుగుపరచుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ “New Chapter” పోస్ట్ వైరల్.. ఈ సంకేతం అదేనా..?
-
TS Police Recruitment 2026: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 5,000 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్!
-
BLA: గ్వాదర్ కోస్ట్ గార్డ్ క్యాంప్పై దాడి.. 30 మంది పాకిస్తానీ భద్రతా సిబ్బందిని హతమార్చినట్లు బీఎల్ఏ ప్రకటన
-
Keeway Hypvolt-R: భారత్లోకి కీవే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ప్రీమియం ఫీచర్లు, 180KM రేంజ్
-
Papikondalu Boat Tour: పాపికొండల విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్.. 18 రోజుల తర్వాత మళ్లీ బోటు షికారు
ట్రెండింగ్
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!