Harish Rao : రాష్ట్రంలో నిర్బంధ పాలన, పోలీస్ రాజ్యం నడుస్తోంది
- హరీష్ రావు ఆగ్రహం
- రైతుల పరామర్శలో అరెస్ట్
- ‘పోలీస్ రాజ్యం’ ఆరోపణ
- భూసేకరణపై డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ, పూర్తిగా నిర్బంధ పాలన సాగిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వికారాబాద్ జిల్లా పరిగి ప్రాంతంలో భూసేకరణను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న తనను పోలీసులు అడ్డుకుని అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. శంషాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న రైతులను ఓదార్చడానికి, వారికి భరోసా కల్పించడానికి వెళ్తుంటే అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా రైతులను కలవకుండా అడ్డుకోవడం గొంతు నొక్కే ప్రయత్నమని, ఇది రాష్ట్రంలో ఒక ‘పోలీస్ రాజ్యం’ నడుస్తోందనడానికి నిదర్శనమని ఆయన ఆరోపించారు.
Krithi Shetty: నా బ్రేకప్ మా అమ్మకు కూడా తెలుసు..ప్రస్తుతం సింగిల్నే!
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను హరీష్ రావు ‘గడీల పాలన, బేడీల పాలన’గా అభివర్ణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఒక నిర్బంధ వాతావరణం నెలకొందని, విమర్శించే వారిని అక్రమ అరెస్టులతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రకమైన ‘గుడ్డి పాలన’ ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా రెండు, మూడు పంటలు పండే పచ్చని సాగు భూములను ఫ్యాక్టరీల కోసం లాక్కోవడానికి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రంలో సాగుకు పనికిరాని భూములు చాలా ఉన్నాయని, అభివృద్ధి పేరుతో పంట భూములను నాశనం చేయవద్దని సూచించారు.
DGP Shivadhar Reddy : తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసింది..
బాధిత రైతుల్లో మెజారిటీ ఎస్సీ, బీసీ , పేద వర్గాలకు చెందిన వారని, వారి ఏకైక జీవనాధారమైన భూములను లాక్కోవడం దారుణమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని అరెస్టులు చేసినా రైతుల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని, ప్రజాస్వామ్యబద్ధంగా వారి హక్కుల కోసం పోరాడుతామని హరీష్ రావు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
-
Seyon: కమల్ హాసన్ నిర్మాణంలో శివకార్తికేయన్ మాస్ అవతార్
-
Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
-
IPL 2026: ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్ మారుతుందా? బీసీసీఐ, కేంద్రం ఆదేశాలపై ఉత్కంఠ!
-
Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..