DGP Shivadhar Reddy : తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసింది..
- మావోయిస్టుల అంతం: డీజీపీ ప్రకటన
- ఆపరేషన్ కగార్ ఫలితం
- అడవుల్లో అభివృద్ధి అడుగులు
- ఆదివాసీలకు కొత్త వెలుగు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్పుడు శాంతి గీతం వినిపిస్తోంది. దశాబ్దాల కాలంగా మావోయిస్టులకు అడ్డాగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు అభివృద్ధి పరుగులు తీస్తోంది. తెలంగాణలో మావోయిజం పూర్తిగా అంతరించిందని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ‘ఫేస్ టు ఫేస్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కర్రెగుట్టల వంటి మారుమూల ప్రాంతాల్లో మారుతున్న పరిస్థితులను వివరించారు.
ఒకప్పుడు దట్టమైన అడవుల్లో సమాంతర ప్రభుత్వాన్ని నడిపిన మావోయిస్టుల ఉనికి ఇప్పుడు తెలంగాణలో లేదని డీజీపీ స్పష్టం చేశారు. ఆపరేషన్ కగార్ విజయవంతం కావడంతో పాటు, కీలక నాయకత్వం , సైన్యాధ్యక్షులు సైతం బయటకు రావడంతో ఆ వ్యవస్థ పూర్తిగా కొలాప్స్ అయిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ప్రాంతాలు నక్సల్ రహిత జోన్లుగా మారాయని, ప్రజలు స్వేచ్ఛగా తిరుగుతున్నారని తెలిపారు.
Also Read
Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!
గతంలో కనీస సౌకర్యాలు లేకపోవడమే నక్సలిజం పెరగడానికి ప్రధాన కారణమని గుర్తించిన ప్రభుత్వం, ఇప్పుడు ఆ లోటును భర్తీ చేస్తోంది. బాహ్య ప్రపంచంతో సంబంధం లేని కర్రెగుట్టల వంటి ప్రాంతాలకు ఇప్పుడు బిటి రోడ్ల నిర్మాణం జరుగుతోంది. దీనివల్ల ఆదివాసీలకు రవాణా సౌకర్యం మెరుగుపడింది.
అత్యవసర సమయాల్లో ఆసుపత్రికి వెళ్లడానికి గ్రామస్తుల కోసం ప్రభుత్వం ఒక ఆటో , టూ వీలర్ను కమ్యూనిటీ వాహనాలుగా అందజేసింది. గతంలో 12-13 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సిన దుస్థితి ఇప్పుడు తొలగిపోయింది. ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేని మారుమూల ఇళ్లకు సోలార్ కందిళ్లను పంపిణీ చేయడం ద్వారా ప్రభుత్వం చీకట్లను తొలగిస్తోంది.
కనీసం ఆధార్ కార్డులు, ఓటు హక్కు వంటి కనీస గుర్తింపు కూడా లేని ఆదివాసీలకు ఇప్పుడు అన్ని ప్రభుత్వ ఫలాలను అందించడమే లక్ష్యంగా పోలీస్ బాస్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దే అవకాశం ఉందని, అటవీ వనరులను కాపాడుకుంటూనే అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని డీజీపీ భరోసా ఇచ్చారు. తుపాకీ గొట్టం ద్వారా కాకుండా, అభివృద్ధి ద్వారానే మార్పు సాధ్యమని తెలంగాణ ప్రభుత్వం నిరూపిస్తోంది. కర్రెగుట్టల వంటి ప్రాంతాల్లో వేసిన రోడ్లు కేవలం రవాణా కోసమే కాదు, ఆ ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం వేసిన బాటలు అని చెప్పవచ్చు.
Turkey: టర్కీలోని ఇజ్రాయెల్ కాన్సులేట్పై కాల్పులు.. ముగ్గురు దుండగులు హతం
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?