DGP Shivadhar Reddy : తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసింది..
- మావోయిస్టుల అంతం: డీజీపీ ప్రకటన
- ఆపరేషన్ కగార్ ఫలితం
- అడవుల్లో అభివృద్ధి అడుగులు
- ఆదివాసీలకు కొత్త వెలుగు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్పుడు శాంతి గీతం వినిపిస్తోంది. దశాబ్దాల కాలంగా మావోయిస్టులకు అడ్డాగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు అభివృద్ధి పరుగులు తీస్తోంది. తెలంగాణలో మావోయిజం పూర్తిగా అంతరించిందని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ‘ఫేస్ టు ఫేస్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కర్రెగుట్టల వంటి మారుమూల ప్రాంతాల్లో మారుతున్న పరిస్థితులను వివరించారు.
ఒకప్పుడు దట్టమైన అడవుల్లో సమాంతర ప్రభుత్వాన్ని నడిపిన మావోయిస్టుల ఉనికి ఇప్పుడు తెలంగాణలో లేదని డీజీపీ స్పష్టం చేశారు. ఆపరేషన్ కగార్ విజయవంతం కావడంతో పాటు, కీలక నాయకత్వం , సైన్యాధ్యక్షులు సైతం బయటకు రావడంతో ఆ వ్యవస్థ పూర్తిగా కొలాప్స్ అయిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ప్రాంతాలు నక్సల్ రహిత జోన్లుగా మారాయని, ప్రజలు స్వేచ్ఛగా తిరుగుతున్నారని తెలిపారు.
Also Read
Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!
గతంలో కనీస సౌకర్యాలు లేకపోవడమే నక్సలిజం పెరగడానికి ప్రధాన కారణమని గుర్తించిన ప్రభుత్వం, ఇప్పుడు ఆ లోటును భర్తీ చేస్తోంది. బాహ్య ప్రపంచంతో సంబంధం లేని కర్రెగుట్టల వంటి ప్రాంతాలకు ఇప్పుడు బిటి రోడ్ల నిర్మాణం జరుగుతోంది. దీనివల్ల ఆదివాసీలకు రవాణా సౌకర్యం మెరుగుపడింది.
అత్యవసర సమయాల్లో ఆసుపత్రికి వెళ్లడానికి గ్రామస్తుల కోసం ప్రభుత్వం ఒక ఆటో , టూ వీలర్ను కమ్యూనిటీ వాహనాలుగా అందజేసింది. గతంలో 12-13 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సిన దుస్థితి ఇప్పుడు తొలగిపోయింది. ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేని మారుమూల ఇళ్లకు సోలార్ కందిళ్లను పంపిణీ చేయడం ద్వారా ప్రభుత్వం చీకట్లను తొలగిస్తోంది.
కనీసం ఆధార్ కార్డులు, ఓటు హక్కు వంటి కనీస గుర్తింపు కూడా లేని ఆదివాసీలకు ఇప్పుడు అన్ని ప్రభుత్వ ఫలాలను అందించడమే లక్ష్యంగా పోలీస్ బాస్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దే అవకాశం ఉందని, అటవీ వనరులను కాపాడుకుంటూనే అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని డీజీపీ భరోసా ఇచ్చారు. తుపాకీ గొట్టం ద్వారా కాకుండా, అభివృద్ధి ద్వారానే మార్పు సాధ్యమని తెలంగాణ ప్రభుత్వం నిరూపిస్తోంది. కర్రెగుట్టల వంటి ప్రాంతాల్లో వేసిన రోడ్లు కేవలం రవాణా కోసమే కాదు, ఆ ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం వేసిన బాటలు అని చెప్పవచ్చు.
Turkey: టర్కీలోని ఇజ్రాయెల్ కాన్సులేట్పై కాల్పులు.. ముగ్గురు దుండగులు హతం
తాజావార్తలు
-
Peddi: “మాస్క్ తీస్తే బిల్లు ఫ్రీ”.. దుబాయ్లో ఏఆర్ రెహమాన్ క్రేజ్ చూసి షాకైన బుచ్చిబాబు!
-
Chittoor Police: ఖాకీలే దొంగలుగా మారారు.. రూ.10 లక్షల దోపిడీ..
-
Rahul Dravid: “హీరోలు లేకుండా క్రీడ ఉండదు”.. గంభీర్ వ్యాఖ్యలకు ద్రావిడ్ కౌంటర్..
-
Tandoori Roti Recipe: తందూర్ లేకుండానే ధాబా స్టైల్ తందూరీ రోటీ.. ఇంట్లోనే సులభంగా తయారు చేసే చిట్కా!
-
Sing Geetham: సింగీతం – నాగ్ అశ్విన్ కాంబో మూవీపై భారీ క్యూరియాసిటీ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..