Harish Rao : రేవంత్కు రైతుల శాపం తప్పదు.. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది
- 100 సీట్లతో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని హరీష్ ధీమా
- రైతు బంధు, స్కాలర్షిప్ హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందన్న విమర్శ
- రైతు డిస్కం పేరుతో ఉచిత విద్యుత్కు ఎసరు పెడుతున్నారన్న ఆరోపణ
- హిట్లర్ పాలనలా వ్యవహరిస్తున్నారని రేవంత్ సర్కార్పై మండిపాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి ఎంత ప్రయత్నించినా, రాబోయే రోజుల్లో వంద సీట్లతో తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమవడమే దీనికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు.
రైతు బంధుపై నిర్లక్ష్యం.. కేసీఆర్ పాలనే ఆదర్శం
ఎన్నికల సమయంలో ఇచ్చిన స్కాలర్షిప్లు, రైతు బంధు వంటి అనేక కీలక హామీలను ఈ ప్రభుత్వం ఇప్పటికీ నెరవేర్చలేదని హరీష్ రావు మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఏ ఒక్క రైతు కూడా రేవంత్ రెడ్డికి ఓటు వేసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. గతంలో కేసీఆర్ కేవలం ఓట్ల కోసం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టలేదని, రైతులపై ఉన్న గుండె నిండా ప్రేమతోనే దానిని అమలు చేశారని గుర్తు చేశారు. తమ పాలనలో 11 విడతల్లో ఏకంగా 73 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు. రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా గుళ్లలో ఒట్లు వేస్తూ హామీలు ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చడం లేదని విమర్శించారు.
Also Read
- Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- IPS Transfers: తెలంగాణలో 26 మంది IPSల బదిలీ.. ఎవరికి ఏ పోస్టింగ్.?
సంక్షోభంలో వ్యవసాయ రంగం
కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఎరువుల కొరత అనేదే లేదని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు క్యూ లైన్లలో నిలబడి ఎరువులు కొనుగోలు చేయాల్సిన దుస్థితి వచ్చిందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన నాలుగు నెలలుగా తెలంగాణలో ‘రైతు బీమా’ నిలిచిపోయిందని, మార్కెట్లలో మక్కలను (మొక్కజొన్న) కొనే నాథుడే లేకుండా పోయాడని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు, వారి భూములకు విలువ తగ్గిపోయిందని, రైతులకు నిజమైన విలువ కల్పించింది కేసీఆర్ మాత్రమేనని అన్నారు.
ఉచిత విద్యుత్కు ఎసరు.. ‘రైతు డిస్కం’పై మండిపాటు
రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ‘రైతు డిస్కం’ తీసుకురావాలని చూస్తోందని, దీని వెనుక రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ను నిలిపివేయాలనే కుట్ర దాగి ఉందని హరీష్ రావు ఆరోపించారు. రేవంత్ సర్కార్ ఈ విధానం ద్వారా రైతులకు తీవ్ర అన్యాయం చేయాలని చూస్తోందని, ఒకవేళ దీనిని అమలు చేస్తే కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో తిరిగే పరిస్థితి కూడా ఉండదని హెచ్చరించారు. రైతులను ఇబ్బంది పెడుతున్న రేవంత్ రెడ్డికి వారి ఉసురు తగలడం ఖాయమని శాపనార్థాలు పెట్టారు.
ప్రస్తుత రేవంత్ రెడ్డి పాలన హిట్లర్ సర్వాధికార పాలనను తలపిస్తోందని హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. అందుకే సామాన్య ప్రజల ఇళ్లను నిర్ధాక్షిణ్యంగా కూలగొడుతున్నారని ఆరోపించారు. స్థానిక సమస్యలపై సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారిని పోలీసులతో కొట్టించడం దారుణమన్నారు. రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ ప్రజావ్యతిరేక పాలన వల్ల భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు జీవితాంతం క్షమాపణలు చెప్పుకోవాల్సి వస్తుందని అన్నారు. రానున్నది తమ ప్రభుత్వమేనని, అక్రమాలకు పాల్పడుతున్న ప్రతి ఒక్కరూ దీనిని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలను బీఆర్ఎస్ అధిష్టానం గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటుందని హరీష్ రావు భరోసా ఇచ్చారు.
తాజావార్తలు
-
Asian Games 2026: ఆసియా క్రీడలకు టీమిండియా జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎంపికపై బీసీసీఐ కీలక నిర్ణయం!
-
Ikka Trailer: 30 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి.. సన్నీ, అక్షయ్ కోర్ట్రూమ్ వార్ అదిరింది
-
Tattoo Safety Tips: టాటూ వేయించుకుంటున్నారా?.. ముందు ఈ విషయాలు తెలియకపోతే రిస్కే..!
-
India External Debt 2026: 762.8 బిలియన్ డాలర్లకు పెరిగిన భారత విదేశీ రుణం..
-
Puri Jagannadh: ప్రభాస్ పేరు చెప్పగానే బ్యాంకాక్ హాస్పిటల్లో వీఐపీ ట్రీట్మెంట్.. పూరి చెప్పిన ఆసక్తికర ఘటన
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!