Harish Rao: రేపు గన్ పార్క్ దగ్గర వస్తా.. నీకు దమ్ముంటే రా..? రేవంత్ కు హరీష్ రావు మరో సవాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు మరో సవాల్ విసిరారు. రేపు ఉదయం 10 గంటలకు గన్ పార్క్ దగ్గర వస్తా అన్నారు. ఆగస్ట్ 15 లోగా రుణమాఫీ చేసేది నిజమైతే.. ఆరు గ్యారెంటీలు అమలు చేయాలన్నారు. మనమిద్దరం మన రాజీనామా లేఖలని మేధావులకి ఇద్దామన్నారు. నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేస్తే నా రాజీనామా లేఖని స్పీకర్ కి ఇస్తా అన్నారు. నువ్వు చెయ్యకపోతే నీ రాజీనామా లేఖని గవర్నర్ కి ఇస్తానని తెలిపారు. రేవంత్ రెడ్డి నువ్వు సిద్ధమా..నీకు దమ్ముంటే రా..! అని మరో సవాల్ విసిరారు. కొడంగల్ లో తోక ముడిచినట్టే తోక ముడుస్తావా అన్నారు.
Read also: IPL 2024: సొంత ఆటగాడినే హేళన చేస్తారా.. ఇకనైనా ఆపండి! అక్రమ్ ఫైర్
Also Read
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
సిద్దిపేట బీజేపీ మీటింగ్ లో టెంట్ లు వేసి, కూలర్లు వేసి, వాటర్ బాటిళ్లు ఇచ్చి మీటింగ్ పెట్టుకున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ మెదక్ లో మీటింగ్ పెడితే ఎండ కూడా భయపడిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి కేసీఆర్ ఏం చేశాడు అని మాట్లాడుతున్నారని అన్నారు. ఏం చేసిండు బిడ్డా లిల్లిపుట్… నువ్వు మెదక్ వచ్చావు అంటే అది కేసీఆర్ వల్లనే అన్నారు. కేసీఆర్ మెదక్ ని జిల్లా చేస్తేనే నువ్ మెదక్ వచ్చావు… లేకపోతే సంగారెడ్డి లో నామినేషన్ వేసేవాడివి అంటూ మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి స్క్రిప్ట్ రైటర్ సరిగా లేడు.. సరిగా రాసిస్తలేరన్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇజ్జత్ మానం తీసుకుంటున్నాడని తెలిపారు. నీ పరువు పోతే పోయింది.. కానీ సీఎం పదవి విలువ తగ్గిస్తున్నావు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Uppal Stadium: ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో శివసేన రెడ్డి
బాండ్ పేపర్ కి వాల్యూ ఉండేది.. కాంగ్రెస్ వాళ్లు బాండ్ పేపర్ ఇచ్చిన తర్వాత దాని వాల్యూ కూడా పోయిందన్నారు. ఇప్పుడు ఎక్కడపోతే అక్కడ దేవుళ్ళకు దండం పెడుతున్నారని తెలిపారు. నా ఎత్తు గురించి మాట్లాడే ధ్యాస రేవంత్ కి ఉంది కానీ రైతుల వడ్లు అమ్ముడుపోతలేవు అది చూడు అన్నారు. బీజేపీ అభ్యర్థిరఘునందన్ రావు మాట నమ్మితే నీళ్లు లేని బావిలో దుకినట్టే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దుబ్బాకలో ఏదేదో హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. బీజేపీ మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తుంది కానీ పేదల గురించి పట్టించుకోదన్నారు. బీఆర్ఎస్ గెలుపు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలుకు మలుపు అన్నారు.
CM Revanth Reddy: మోడీ పదేళ్ల పాలనపై కాంగ్రెస్ చార్జీ షీట్.. విడుదల చేసిన సీఎం రేవంత్
తాజావార్తలు
-
Kim Jong Un: కిమ్ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
-
Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
-
Uzbekistan: భారతీయులకు గుడ్న్యూస్.. మోడీ టూర్ ఎఫెక్ట్.. 30 రోజులు వీసా ఫ్రీ
-
Nepal Floods: తప్పిన ఘోర విషాదం.. 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన హెడ్మాస్టార్.. క్షణాల్లో మునిగిన స్కూల్
-
Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!