Uppal Stadium: ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో శివసేన రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uppal Stadium: ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఉప్పల్ స్టేడియంను ముట్టడించేందుకు వెళుతున్న యూత్ కాంగ్రెస్ నేత శివసేన రెడ్డిని రామంతపూర్ వద్దే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉప్పల్ స్డేడియం వద్ద యూత్ కాంగ్రెస్ నేతలు భారీ ఎత్తున తరలిరావడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. శివసేశారెడ్డి ని అడ్డుకుని ఉప్పల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Read also: CM Revanth Reddy: మోడీ పదేళ్ల పాలనపై కాంగ్రెస్ చార్జీ షీట్.. విడుదల చేసిన సీఎం రేవంత్
Also Read
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Sanjush : రోడ్డు ప్రమాదంలో లైఫ్స్టైల్ ఉద్యోగిని మృతి.. జనసేన ఎంపీ కుమారుడిపై కేసు
- OTR: ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారా? లేక పవర్, ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తున్నారా?
- OTR : సుస్మిత వ్యాఖ్యలతో కొండా సురేఖకు చిక్కులు? పదవిపై కత్తి వేలాడుతుందా?
కాగా.. ఈరోజు హైదరాబాద్ – బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్ టికెట్లను పెద్ద ఎత్తున బ్లాక్లో అమ్మారంటూ యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్న జగన్మోహన్ రావు తనకు చెందిన అక్షర స్కూల్స్ యాజమాన్యంతో అక్రమంగా టిక్కెట్లను బ్లాక్లో అమ్ముతున్నారంటూ ఆందోళనకు శివసేనారెడ్డి పిలుపునిచ్చారు. దీంతో ఉప్పలే స్టేడియం వద్దకు పెద్ద ఎత్తున యూత్ కాంగ్రెస్ నేతలు తరలి రావడంతో ఉద్రికత్త చోటుచేసుకుంది. యూత్ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. కాంప్లిమెంటరీ పాసులను కూడా బ్లాక్లో అమ్ముతున్నారని మండిపడ్డారు.
Read also: Secunderabad Railway Station: అద్భుతం.. గాలి నుంచే నీటి తయారీ.. లీటర్ నీరు ఎంతంటే?
కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా హెచ్ సిఏ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ల వ్యవహారంలో అనేక ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. అందుకే ప్రెసిడెంట్ పై ఉప్పల్ స్టేషన్లో కేసు పెట్టబోతున్నామని క్లారిటీ ఇచ్చారు. హెచ్ సీ ఏ ప్రెసిడెంట్ ఇంకా టిఆర్ఎస్ నేతల కనుసన్నల్లో నడుస్తున్నాడని ఆరోపించారు. హరీష్ రావు బినామీగా ఉండి బ్లాక్ టికెట్స్ అమ్ముకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ శాఖలకు ఇవ్వాల్సిన కాంప్లిమెంటరీ టికెట్లను సైతం జగన్ మోహన్ రావు అక్రమంగా అమ్ముకుంటున్నాడని మండిపడ్డారు. జగన్ మోహన్ రావు తక్షణమే ప్రెసిడెంట్ గా తప్పుకోవాలన్నారు. చేతకాని వాడిలా జగన్ మోహన్ రావు ఫోన్ స్విచాఫ్ చేసి పెట్టుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్లబ్ మెంబర్స్ కి ఇచ్చే టికెట్లను కూడా అమ్ముకుంటున్నాడని మండిపడ్డారు.
Traffic Restriction: నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు.. సాయంత్రం 4 నుంచి రాత్రి 11.50 వరకు
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?