Revanth Reddy: రిజర్వేషన్లు కావాలంటే కాంగ్రెస్ కి.. వద్దు అనుకుంటే బీజేపీ కి ఓటు వేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: రిజర్వేషన్లు కావాలంటే కాంగ్రెస్ కి.. వద్దు అనుకుంటే బీజేపీ కి ఓటు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇస్తాం అని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని స్పష్టం చేశారు. దీన్ని అడ్డుకోవాలని కుట్ర జరుగుతోందన్నారు. రాహుల్ గాంధీ ఓబీసీ పక్షాన నిలబడ్డారు అని అన్నారు. రిజర్వేషన్లు రద్దు చేయాలని అనుకుంటున్నారని.. బీజేపీ కి వేసే ప్రతీ ఓటు.. రిజర్వేషన్లు రద్దుకు తోడ్పాటని అన్నారు. వర్గీకరణ కోరుకునే వాళ్ళు… బీజేపీ కి ఎలా మద్దతు ఇస్తారో అర్థం కావడం లేదన్నారు.
Read also: AP Elections 2024: చంద్రబాబుతో బీజేపీ జాతీయ నేతల భేటీ.. ఏం చేద్దాం..?
Also Read
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
- TG EAPCET 2026: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
- Bandi Bhagirath Arrest: కరీంనగర్ నుంచి ఢిల్లీ దాకా వేట.. బండి భగీరథ్ అరెస్ట్పై పోలీసుల అధికారిక ప్రకటన
రిజర్వేషన్లు కావాలంటే కాంగ్రెస్ కి… వద్దు అనుకుంటే బీజేపీ కి వేయాలని సూచించారు. ఇదే రెఫరెండం అంటూ రేవంత్ అన్నారు. పదేళ్ళలో ఎన్డీఏ వైఫల్యం ప్రజలకు వివరించే బాధ్యత మాదన్నారు. మోడీ ఇచ్చిన 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందన్నారు. పదేళ్ళలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు.. కానీ 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చారన్నారు. రైతుల ఆదాయం రెండింతలు చేస్తా అన్నారు.. ఏం చేశారు ? అని ప్రశ్నించారు. నల్లచట్టాలు తెచ్చి రైతులను బానిసలు చేసే కుట్ర చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనతో .. మోడీ క్షమాపణ చెప్పారన్నారు. స్విస్ బ్యాంక్ లో ఉన్న నల్లధనం తీసుకువచ్చి పేదల అకౌంట్ లో వేస్తా అన్నారు. ఒక్కటి ఖాతాలోకి ఇవ్వలేదు మోడీ అని తెలిపారు. సిలిండర్ 1200 కి పెంచాడు, పప్పు ధర పెరిగిందన్నారు.
Read also: T20 World Cup 2024: బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. టీ20 ప్రపంచకప్లో ఎంఎస్ ధోనీ!
భక్తులం అని చెప్పే బీజేపీ..అగరు వత్తుల పై కూడా జీఎస్టీ వేసిందని మండిపడ్డారు. పిల్లలు వాడే పెన్సిల్ మీద కిడా జీఎస్టీ వేశాడు మోడీ అని మండిపడ్డారు. 14 మంది ప్రధానులు చేసిన అప్పు 54 లక్షల కోట్లు చేశారన్నారు. మోడీ ఒక్కడే 113 లక్షల కోట్ల అప్పు చేశాడన్నారు. డబుల్ ఇంజన్ అంటే.. ఆధాని.. ప్రధాని అన్నారు. ఎస్సీ, ఎస్టీ లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆర్ఎస్ఎస్ అజెండా అమలు చేస్తున్న మోడీ.. రిజర్వేషన్లు కూడా తీసేస్తారన్నారు. రాజ్యాంగం పై బీజేపీ ఆఖరి యుద్ధం ప్రకటించిందని తెలిపారు. 400 సీట్లు ఉంటేనే అది రద్దు అవుతుందన్నారు. అందుకే బీజేపీ 400 సీట్ల స్లోగన్ తీసుకుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Dulam Nageswara Rao: ఆశీర్వదించండి.. కైకలూరును మరింత అభివృద్ధి చేస్తా..
తాజావార్తలు
-
PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
-
Drone Attack: అబుదాబిలో హై టెన్షన్.. అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ల దాడి.. అసలు ఏం జరిగిందంటే!
-
New Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాల మధ్య మరో కొత్త ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభం..
-
Pithapuram Varma : వర్మ ఓదార్పు రాజకీయాలపై జనసేన అసంతృప్తి.?
-
Virat Kohli: అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ.. చరిత్ర పుటల్లో ఒకే ఒక్కడుగా..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..