తెలంగాణ సీఎంగా కేసీఆర్ కావడం వల్లనే సిద్దిపేట ప్రాంతం దశ దిశా మారిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట శివారు నాగులబండ వద్ద త్రీ స్టార్ టూరిజం హోటల్ ను ప్రారంభించారు మంత్రి హరీశ్ రావు. ఈ కార్యక్రమంలో… ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, టూరిజం శాఖ కార్పోరేషన్ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… ఉత్తర తెలంగాణ నుండి హైదరాబాద్ వెళ్ళే వారికి ఈ హోటల్ చాలా ఉపయోగ పడుతుందన్నారు. ఎల్ వి ప్రసాద్ కంటి ఆసుపత్రిలో పేద ప్రజలకు ఉచిత పరీక్షలు నిర్వహిస్తారని.. కావున ఎవరు కూడా కంటి చూపుతో బాధపడవద్దన్నారు. 100 మందికి ఉపాధినిచ్చే ఐటీ టవర్ త్వరలోనే ప్రారంభం కానుందని.. ప్రతి రంగంలో గుణాత్మకమైన మార్పు తెస్తున్నామని చెప్పారు. నాడు రాష్ట్రం కోసం నేడు ప్రజల ఆకాంక్ష కోసం ఉద్యమిస్తున్నామని పేర్కొన్నారు.