Harish Rao : వీటికి జీఎస్టీ నుండి మినహాయింపులు ఇవ్వాలి.. కేంద్రంను కోరిన హరీష్రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 48వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున పలు విజ్ఞప్తులను కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. జీఎస్టీ నుండి మినహాయింపులు ఇవ్వాలని కోరారు.
Also Read : Naseeruddin Chisti: ప్రధాని మోదీపై పాకిస్తాన్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. సూఫీ కౌన్సిల్ ఆగ్రహం
తెలంగాణలో మైనర్ ఇరిగేషన్ కింద 46 వేల జలాశయాలు ఉన్నాయి. వీటి ద్వారా 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాం. అయితే ప్రతి ఏడాది వీటి నిర్వహణ చేయడం ఎంతో ముఖ్యం. ఈ పనులు తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చేస్తున్నది. ఈ నిర్వహణ, మరమ్మతుల పనులను జీఎస్టీ నుండి మినహాయింపు ఇవ్వండి అని కోరడం జరిగింది.
పీడీఎస్ (ప్రజా పంపిణీ వ్యవస్థ) సంబంధిత సేవలైన కస్టమ్ మిల్లింగ్, ట్రాన్స్ పోర్ట్ సేవలుకు జిఎస్టీ నుండి మినహాయింపు ఇవ్వాలనీ, పేదలకు అందించే ఈ సేవలపై జీఎస్టీ వేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతున్నదనీ, అందువల్ల జీఎస్టీ నుండి మినహాయింపు ఇవ్వాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.
Also Read : Ind vs Ban: లక్ష్య ఛేదనలో బంగ్లా విలవిల.. విజయానికి చేరువలో టీమిండియా!
బీడీ ఆకుపై పన్ను వేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. గిరిజన, పేద, మారుమూల ప్రాంతాలకు చెందిన ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఎంతో మంది బీడీలు తయారీ చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇప్పటికే కేంద్రం బీడీ లపై 28 శాతం జీఎస్టీ వేయడం జరిగింది. దీన్ని గతంలో మేము తీవ్రంగా వ్యతిరేకించాము. బీడీ ముడిసరుకు అయిన ఆకులపై ఇప్పుడు 18 శాతం జీఎస్టీ వేయడం పేదలు, గిరిజనుల ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి. అందువల్ల మినహాయింపు ఇవ్వాలని మంత్రి హరీష్ రావు కోరారు.
Also Read
టాక్స్ ఇన్ వాయిస్ రూల్స్ సవరణ ప్రపోజల్ స్వాగతిస్తున్నాము. అయితే దీనిపై ఉన్న సంశయాలను కౌన్సిల్ దృష్టికి తెస్తున్నాం. ముఖ్యంగా టెలికాం సేవలకు సంబంధించి, ట్రాయ్ రూల్స్ వల్ల కస్టమర్ అడ్రస్, పిన్ నెంబర్ పే టీఎం, మోబి క్విక్, బిల్ డెస్క్ తదితర ఆన్లైన్ వ్యాపార సంస్థల వద్ద ఉండే అవకాశం ఉండదు. దీని వల్ల వినియోగదారులు ఉన్న రాష్ట్రాల ఆదాయం ఇతర రాష్ట్రాలకు వెళుతున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మార్పు చేయాలి అని కోరుతున్నాం.
మైనర్ ఇరిగేషన్, పిడిఎస్ సంబంధిత సేవలైన కస్టమ్ మిల్లింగ్, బీడీ ఆకులపై జీఎస్టీ నుండి మినహాయింపులు ఇవ్వాలని కోరిన తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తులపై జీఎస్టీ పూర్తి పరిశీలన నిమిత్తం ఫిట్ మెంట్ కమిటీకి సిఫార్సు చేస్తూ, ఆదేశించింది. టాక్స్ ఇన్ వాయిస్ రూల్స్ సవరణ అంశంపై తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అంశాలను పరిష్కరిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి వెల్లడించారు.
బీఅర్కే భవన్ నుండి జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సీఎస్ సోమేష్ కుమార్, కమిషనర్ కమర్షియల్ టాక్స్ నీతూ ప్రసాద్, వాణిజ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
India vs Ireland T20: అరంగేట్రంలోనే టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్ బౌలర్.. ఎవరీ మాథ్యూ హోలార్డ్..?
-
Ram Charan : RC 17.. ఓ చిన్న కన్ఫ్యూజన్
-
Broken Cups Reuse Idea: విరిగిన కప్పులే మీ ఇంటి అందాన్ని పెంచుతాయి.. ఈ ట్రిక్స్ తెలుసా?
-
SS Rajamouli: “ఆ అభిమాని ఆఖరి కోరిక తీరింది”.. కెమెరా ముందే కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి..
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
ట్రెండింగ్
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!