Naseeruddin Chisti: ప్రధాని మోదీపై పాకిస్తాన్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. సూఫీ కౌన్సిల్ ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sufi Council Slams Bilawal Bhutto Remarks On PM Modi: భారత ప్రధాని నరేంద్రమోదీపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యలు భారతదేశంతో ఆగ్రహజ్వాలలకు కారణం అవుతున్నాయి. ఇప్పటికే భుట్టో వ్యాఖ్యలపై బీజేపీ దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు తెలుపుతోంది. ఢిల్లీలోని పాక్ ఎంబసీ ముందు బీజేపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇదిలా ఉంటే బిలావల్ భుట్టోపై ఆల్ ఇండియా సూఫీ సజ్జదానాషిన్ కౌన్సిల్ చైర్మన్ నసీరుద్దీన్ చిస్తీ ఆగ్రహం వ్యక్తం చేశారు. భుట్టో వ్యాఖ్యలను ఖండించారు. బిలావల్ భుట్టో ఉపయోగించిన భాష ఆయన హోదాతో పాటు పాకిస్తాన్ పరువును దిగజార్చిందని అన్నారు. మన ప్రధాని, మన మాతృభూమిపై పాక్ విదేశాంగ మంత్రి చేసిన విషపూరిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు నసీరుద్దీన్ చిస్తీ ప్రకటించారు.
Read Also: Delhi: భార్యతో గొడవ.. 2 ఏళ్ల కొడుకును బిల్డింగ్ నుంచి తోసేసిన తండ్రి..
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ చనిపోలేదని.. పాకిస్తాన్ ప్రభుత్వం రక్షణలో ఉన్న సమయంలో అమెరికన్ దళాలు చంపేశాయని గుర్తు చేశారు. భారత ముస్లింలు పాకిస్తాన్ ముస్లిం కన్నా సురక్షితంగా, మెరుగైన స్థితిలో ఉన్నారని ఇది పాకిస్తాన్ గుర్తుంచుకోవాలని సూచించారు. బిలావల్ భుట్టో తన అస్థిర దేశాన్ని భారతదేశంతో పోల్చుకోవద్దని.. భారత రాజ్యాంగం అందరికి మత స్వేచ్ఛను కల్పించిందని అన్నారు. ఆల్ ఇండియా సూఫీ సజ్జదనాశిన్ కౌన్సిల్ అనేది దేశంలోని వివిధ దర్గాల ఆధ్యాత్మిక అధిపతుల సంఘం.
ఇటీవల ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్తాన్ తీరును ఎండగట్టారు. ఉగ్రవాదులకు, సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ సహాయం చేస్తుందని విమర్శించారు. ఒసామా బిన్ లాడెన్ కు ఆశ్రయం ఇచ్చిన మీరా మాట్లాడేది..? అంటూ ఫైర్ అయ్యారు. అయితే ఈ వ్యాఖ్యలకు బదులుగా పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో.. లాడెన్ అయితే చనిపోయాడు కానీ.. గుజరాత్ కసాయి ఉన్నాడంటూ ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని అయ్యేంత వరకు అమెరికా ప్రధాని మోదీని నిషేధించిందని.. ఆర్ఎస్ఎస్ ప్రధాని అని, ఆర్ఎస్ఎస్ సంస్థకు హిట్లర్ స్ఫూర్తి అని విమర్శించాడు. ఈ వ్యాఖ్యలపై భారతవిదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ మరింత దిగజారిందని ఘాటు వ్యాఖ్యలు చేసింది.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!