Naseeruddin Chisti: ప్రధాని మోదీపై పాకిస్తాన్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. సూఫీ కౌన్సిల్ ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sufi Council Slams Bilawal Bhutto Remarks On PM Modi: భారత ప్రధాని నరేంద్రమోదీపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యలు భారతదేశంతో ఆగ్రహజ్వాలలకు కారణం అవుతున్నాయి. ఇప్పటికే భుట్టో వ్యాఖ్యలపై బీజేపీ దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు తెలుపుతోంది. ఢిల్లీలోని పాక్ ఎంబసీ ముందు బీజేపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇదిలా ఉంటే బిలావల్ భుట్టోపై ఆల్ ఇండియా సూఫీ సజ్జదానాషిన్ కౌన్సిల్ చైర్మన్ నసీరుద్దీన్ చిస్తీ ఆగ్రహం వ్యక్తం చేశారు. భుట్టో వ్యాఖ్యలను ఖండించారు. బిలావల్ భుట్టో ఉపయోగించిన భాష ఆయన హోదాతో పాటు పాకిస్తాన్ పరువును దిగజార్చిందని అన్నారు. మన ప్రధాని, మన మాతృభూమిపై పాక్ విదేశాంగ మంత్రి చేసిన విషపూరిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు నసీరుద్దీన్ చిస్తీ ప్రకటించారు.
Read Also: Delhi: భార్యతో గొడవ.. 2 ఏళ్ల కొడుకును బిల్డింగ్ నుంచి తోసేసిన తండ్రి..
Also Read
- CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
- Google Top Employer: భారత్లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్కు నంబర్-1 ర్యాంక్
- Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్బర్గ్ క్షమాపణ
- Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ చనిపోలేదని.. పాకిస్తాన్ ప్రభుత్వం రక్షణలో ఉన్న సమయంలో అమెరికన్ దళాలు చంపేశాయని గుర్తు చేశారు. భారత ముస్లింలు పాకిస్తాన్ ముస్లిం కన్నా సురక్షితంగా, మెరుగైన స్థితిలో ఉన్నారని ఇది పాకిస్తాన్ గుర్తుంచుకోవాలని సూచించారు. బిలావల్ భుట్టో తన అస్థిర దేశాన్ని భారతదేశంతో పోల్చుకోవద్దని.. భారత రాజ్యాంగం అందరికి మత స్వేచ్ఛను కల్పించిందని అన్నారు. ఆల్ ఇండియా సూఫీ సజ్జదనాశిన్ కౌన్సిల్ అనేది దేశంలోని వివిధ దర్గాల ఆధ్యాత్మిక అధిపతుల సంఘం.
ఇటీవల ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్తాన్ తీరును ఎండగట్టారు. ఉగ్రవాదులకు, సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ సహాయం చేస్తుందని విమర్శించారు. ఒసామా బిన్ లాడెన్ కు ఆశ్రయం ఇచ్చిన మీరా మాట్లాడేది..? అంటూ ఫైర్ అయ్యారు. అయితే ఈ వ్యాఖ్యలకు బదులుగా పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో.. లాడెన్ అయితే చనిపోయాడు కానీ.. గుజరాత్ కసాయి ఉన్నాడంటూ ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని అయ్యేంత వరకు అమెరికా ప్రధాని మోదీని నిషేధించిందని.. ఆర్ఎస్ఎస్ ప్రధాని అని, ఆర్ఎస్ఎస్ సంస్థకు హిట్లర్ స్ఫూర్తి అని విమర్శించాడు. ఈ వ్యాఖ్యలపై భారతవిదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ మరింత దిగజారిందని ఘాటు వ్యాఖ్యలు చేసింది.
తాజావార్తలు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
-
Google Top Employer: భారత్లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్కు నంబర్-1 ర్యాంక్
-
RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
-
JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్కు అలా కలిసి వచ్చిందా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!