తెలంగాణ ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే త్వరలోనే జాబ్ క్యాలెండర్ను కూడా విడుదల చేయనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్రావు వెల్లడించారు. శుక్రవారం ఆయన నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాజాగా పరిస్థితులు మారాయి భారతదేశానికి ధాన్యం అందించే స్థాయికి తెలంగాణ చేరుకుందని ఆయన అన్నారు. అధికారంలోకి వస్తే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న బీజేపీ రైతుల ఖర్చులను మాత్రం రెట్టింపు చేయగలిగిందన్నారు.
రైతుల రుణమాఫీ చేయని బీజేపీ బ్యాంకు రుణాల ఎగవేతదారుల బ్యాంకుల రుణాలు మాఫీ చేసిందని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా బీజేపీ రైతులకు ఏం చేసిందో ఒక్క మంచి పని చెప్పాలని, హిందూ ముస్లింల మధ్య కొట్లాట పెడుతున్నారని ఆయన ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే దమ్ము బీజేపీకి ఉందా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేసన్లు విడుదల చేసిందని.. త్వరలో జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తామని, ఖాళీగా ఉన్న అన్ని పోస్టులు భర్తీ చేస్తామని ఆయన వెల్లడించారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కేంద్రానికి ఢిల్లీ పెద్దలకు గులాంగిరి చేస్తాయని, టీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పని చేస్తుందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తున్న కేంద్రం రాజ్యాంగ స్ఫూర్తిని మంటగలుపుతుందన్నారు.