Ponguleti Srinivas Reddy: రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మించడమే మా లక్ష్యం..
- హనుమకొండలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి
- పేద పిల్లలకు బువ్వ పెట్టలేని పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేది- పొంగులేటి
- ఆర్టీసీ దండగన్నారు, ఆర్టీసీ కార్మికులను విస్మరించారు..
- ఇందిరమ్మ రాజ్యంలో ఆర్టీసీ కార్మికులను ఆదుకుంటున్నాం- మంత్రి.
హనుమకొండలో ఆర్టీసీ 50 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పేద పిల్లలకు బువ్వ పెట్టలేని పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేదని ఆరోపించారు. అందుకే 200 శాతం మెస్ ఛార్జీలు పెంచామన్నారు. అంతేకాకుండా.. ఆర్టీసీ దండగన్నారు, ఆర్టీసీ కార్మికులను విస్మరించారు.. కానీ ఇందిరమ్మ రాజ్యంలో ఆర్టీసీ కార్మికులను ఆదుకుంటున్నామని తెలిపారు.
Read Also: Ponnam Prabhakar: ఆర్టీసీ ప్రజలది.. కాపాడుకొని ముందుకు తీసుకుపోవాలి
Also Read
- KTR : నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలి.
- Kunamneni Sambasiva Rao: కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికి రాదు.. కూనంనేని కీలక వ్యాఖ్యలు
- Boianapalli Vinod Kumar: రజతోత్సవ సభ.. కొత్త తరానికి కొత్త ఆలోచనలు..!
- Devadula Pipeline Leak: దేవాదుల ప్రాజెక్ట్ పైప్లైన్ లీక్.. మండిపడిన రైతులు
వరి వేస్తే ఉరే అని నాటి సీఎం కేసీఆర్ అంటే… ఇందిరమ్మ రాజ్యంలో రైతును రాజును చేస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. తాము చేసే మంచి పనులను ఓర్వలేక పోతున్నారని దుయ్యబట్టారు. సంక్రాంతి తర్వాత 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తాం.. రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మించడమే తమ లక్ష్యం అని చెప్పారు. నాడు పింక్ కలర్ షర్ట్ తొడుక్కున్న వారికే ఇళ్లు ఇచ్చారు.. కానీ తాము పార్టీలకు, కులాలు మతాలకు అనుగుణంగా పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. రాబోయే ఐదేళ్ల తర్వాత కూడా వచ్చేది ఇందిరమ్మ ప్రభుత్వమేనన్నారు.
Read Also: HMPV Virus: భారత్లో విజృంభిస్తున్న HMPV వైరస్.. గుజరాత్లో మరో కేసు..
అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలు అచ్చొచ్చిన ఆంబోతులా ప్రవర్తించారని పేర్కొన్నారు. మరోవైపు.. ధరణిని పూర్తిగా ప్రక్షాళన చేశామని మంత్రి తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుచేసి దోచుకుంటే తాము 6500 కోట్ల రూపాయలు ఈఎంఐ చెల్లిస్తున్నామని చెప్పారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా అచ్చొచ్చిన కుర్ర ఆంబోతులను పంపిస్తున్నారు.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కేసీఆర్ డోర్ క్లోజ్ అవుతుందని విమర్శించారు. పంట పండించే ప్రతీ గుంటకు రైతు భరోసా ఇస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!