Harish Rao : హనుమకొండలో హైటెన్షన్.. ధర్నా తర్వాత హరీశ్ రావు అరెస్ట్..
- ఉద్యోగులకు బీఆర్ఎస్ అండ
- సర్కార్పై హరీశ్ ఫైర్
- 15 శాతం కమిషన్ ఆరోపణలు
- అసెంబ్లీలో తేల్చుకుంటాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hanamkonda Protest: హనుమకొండ కలెక్టరేట్ ప్రాంగణం గురువారం ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం టీఎన్జీవోలు చేపట్టిన ధర్నా ఆందోళనలో బీఆర్ఎస్ అగ్రనేతలు పాలుపంచుకుని ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. ఈ క్రమంలో ధర్నా ముగిసిన అనంతరం కలెక్టరేట్ నుండి పాలిటెక్నిక్ కాలేజీ వైపు బయలుదేరిన మాజీ మంత్రి హరీశ్ రావును పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఉద్యోగులకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు
ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు , మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొని ఉద్యోగ వర్గాలకు అండగా ఉంటామని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లన్నిటికీ బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడిన హరీశ్ రావు కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలను ఎండగట్టారు.
Also Read
- TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
- Bhatti Vikramarka : ప్రాణహిత-చేవెళ్ల కడదామా? వద్దా? బీజేపీ సమాధానం చెప్పాలి
- Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
- Danam Nagender : దానం నాగేందర్ ఉదంతంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
కమిషన్లు ఇస్తేనే రిటైర్మెంట్ బెనిఫిట్స్.. హరీశ్ రావు సంచలన ఆరోపణలు
రేవంత్ రెడ్డి పాలనపై హరీశ్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ప్రభుత్వంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందాలంటే 15 శాతం కమిషన్లు ఇచ్చుకోవాల్సిన దారుణమైన పరిస్థితి నెలకొందని ఆయన ఆరోపించారు. ఉద్యోగులకు వెంటనే మెరుగైన పీఆర్సీ (PRC) ప్రకటించాలని, అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను ఆలస్యం చేయకుండా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘ప్రజా పాలన’ అని చెప్పుకుంటున్న ఈ సర్కారులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలవడానికి వెళ్తే కనీసం సెల్ ఫోన్ను కూడా అనుమతించడం లేదని మండిపడ్డారు.
బెదిరింపులకు ఉద్యోగులు లొంగరు
రాష్ట్రంలో రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు , విద్యార్థులు ప్రతి ఒక్కరూ తమ హక్కుల కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చిందని, అయినా సర్కారుకు చలనం లేదని విమర్శించారు. ఉద్యోగ సంఘాల నాయకులను బెదిరించేందుకు ఏసీబీ, విజిలెన్స్ కేసులను అస్త్రాలుగా వాడుతూ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి కొందరు నాయకులను బెదిరించవచ్చేమో కానీ, లక్షలాది మంది ఉన్న ఉద్యోగుల పవర్ ముందు ఈ బెదిరింపులు సాగవని హెచ్చరించారు.
అసెంబ్లీలో సర్కారును నిలదీస్తాం
ఉద్యోగులతో పెట్టుకుని ఎవరూ సంతోషంగా ఉన్న చరిత్ర లేదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా రోజులు దగ్గర పడ్డాయని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగుల గొంతుకగా మారి బీఆర్ఎస్ తరఫున ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని, ఉద్యోగుల డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
-
Saikrishna Case Update: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. కీలక వివరాలను వెల్లడించిన సిట్..
-
The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
-
Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
-
CM Vijay: “పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం”.. రాష్ట్రంలో కొత్త పథకం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..